-Advertisement-

టీటీడీసీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు: పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా

టీటీడీసీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు: పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:  టీటీడీసీలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌పై స్పందించవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన, జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రిన్సిపల్, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments