పవిత్ర శ్రావణ మాసంలో ఆకుర్ల గ్రామంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం, అన్నదానం
చిత్రం న్యూస్, జైనథ్: పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆకుర్ల గ్రామ సర్పంచ్ వైద్య సాయి ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అనంతరం భక్తులకు గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లూరి సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, పిప్పల్గావ్ సర్పంచ్ సంజీవ్, పిప్పల్గావ్ ఉప సర్పంచ్ ఊరాడే లక్ష్మణ్, బాలాపూర్ శంకర్, కరంజి ఉప సర్పంచ్ సూర్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
