Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

0
14
Payal shankar
Payal shankar

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సాత్నాల మండలం కాన్ప మేడిగూడ రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే అనేక కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జొన్నలు కొనరేమోనన్న ఆత్రుతతో మార్కెట్ యార్డుల్లో రద్దీ నెలకొందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జొన్న పంట కోటా పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి నాయకులు రమేష్, ఎల్టి అశోక్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం