Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home NIRMAL యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్,...

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర :

0
52

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, బాసర :

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో బాసర సీఐ కిరణ్ కుమార్ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై గ్రామస్తులకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్,మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకొని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. యువత చదువుతో పాటు ఆయా రంగాల్లో రాణించాలని, మత్తు పానీయాలకు బానిస కాకూడదు అని తెలిపారు.  మైనర్లు వాహనాలు  నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం