-Advertisement-

తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, తాంసి: తాంసి మార్కెట్ యార్డులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోjaa రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన జొన్న పంట కొనుగోళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తోందని, దీనిని 15 క్వింటాళ్లకు పెంచేలా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో చర్చించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా జొన్నల పంపిణీకి ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు.

రైతులు షెడ్యూల్ ప్రకారమే పంటను మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. ఒక రైతు బిడ్డగా తాను చైర్మన్ బాధ్యతలు తీసుకున్నందున, మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్, మెంబర్ ధనంజయ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు సామ సంతోష్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments