-Advertisement-

బీజేపీలోకి విశ్రాంత ఉద్యోగుల చేరిక: ఎంపీ, ఎమ్మెల్యే ఆహ్వానం

 బీజేపీలోకి విశ్రాంత ఉద్యోగుల చేరిక: ఎంపీ, ఎమ్మెల్యే ఆహ్వానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులై పలువురు విశ్రాంత ఉద్యోగులు బీజేపీలో చేరారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేర దేవన్న ఆధ్వర్యంలో రిటైర్డ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజన్న, డిప్యూటీ రేంజ్ అధికారి రాజేశ్వరరావు, రిటైర్డ్ ఎస్సై స్వామి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ తదితరులు పార్టీలో చేరారు.  ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాషాయ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. సమాజంపై అవగాహన ఉన్న విశ్రాంత ఉద్యోగుల చేరిక పార్టీకి బలమని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ఘటిక క్రాంతి, రాకేష్, జోగు రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments