ప్రమాదాలు నివారించాలి..ప్రాణాలను రక్షించాలి: డీజీపీ శివధర్ రెడ్డి
జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప రిధిలోని ఇందల్వాయి మండలం 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు. వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అనంతరం “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు) సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించడానికి, ఏ ఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఇన్ ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి , డిచ్పల్లి సీఐ కె వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్ , ఇందల్ వాయి ఎస్ఐ. జి.సందీప్ , ఈ -డార్ మేనేజర్ వర్ష , ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ వంశీధర్ , టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు , గ్రామ సర్పంచ్ రఘు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

