Home Blog Page 79

పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం

0

పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం *ఎమ్మెల్యే రామారావు పటేల్

             చిత్రం న్యూస్, ముథోల్:

బహుజన రాజ్య స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం  ముథోల్ పట్టణంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ పోరాట పటిమ, త్యాగం ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని, ఆ మహనీయుని ఆలోచనలను అందరూ ఆచరణలో పెట్టాలని పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్ కులస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలి

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్  రెడ్డి

       చిత్రం న్యూస్, ఆదిలాబాద్

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితమే శ్రీ బాల గంగాధర్ తిలక్ హిందూ ఐక్యతకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే యువత పెద్ద ఎత్తున సంఘటితమై స్వాతంత్ర్య పోరాటంలో సైతం భాగస్వామ్యులయ్యారని తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడంతో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారన్నారు. ఆయన స్ఫూర్తితో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఐకమత్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడుతూ, గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు.

ముఖ్యంగా వినాయక చవితి, కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయం అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని తమ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమితి ప్రతినిధులందరిని సన్మానించారు. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు జిల్లా కేంద్రంలో ఈ నెల 26,27 తేదీలలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు బండారి వామన్, అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ప్రధాన కార్యదర్శులు గేడం మాధవ్, పడకంటి సూర్యకాంత్, కార్య నిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, లోపు శ్రీనివాస్, మహిపాల్, సంజీవ్, రాజు, మేకల అశోక్, వెనుగంటి ప్రకాష్, సంతోష్ అగర్వాల్, సురేష్ పోడ్వాల్, పూసం ఆనందరావు,  మహిళా అధ్యక్షురాలు చౌహన్ శశికళ, ప్రధాన కార్యదర్శి మాలతి, తదితరులు పాల్గొన్నారు.

తక్కువ ఖర్చుతో మోకాలి మార్పిడి చికిత్స

0

* నిర్మల్ అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో  మోకాలి మార్పిడి చికిత్స (Knee Replacement Surgery)

*విజయవంతంగా ఆపరేషన్ చేసిన డా. అరుణ్ కుమార్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లేన్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అరుదైన మోకాలి చిప్ప ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. హైదరాబాద్, నాగపూర్ లాంటి పెద్ద పట్టణాల్లో మాత్రమే జరిగే ఈ ఆపరేషన్ ను  డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు.  లక్ష్మణచందా గ్రామానికి చెందిన శంకర్ కు గతంలో మోకాలి చిప్ప అరిగిపోయి నడవడానికి ఇబ్బంది పడడంతో హైదరాబాద్ లో కుడి మోకాలి మార్పిడి చికిత్స చేసుకున్నాడు. అక్కడ భారీ మొత్తంలో ఖర్చు అయ్యింది. ఆ తరువాత మళ్ళీ ఎడమ కాలు కూడా నొప్పితో నడవలేని స్థితికి రావడంతో హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అదే మోకాలి మార్పిడి ఆపరేషన్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్నారని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. మిత్రుడి సలహా మేరకు హైదరాబాద్ వెళ్లకుండా అక్కడ లభించే కార్పొరేట్ హాస్పిటల్ సేవలు నిర్మల్ లోని అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అందిస్తున్నారని తెలుసుకొని వైదున్ని కలిశారు. శంకర్ కు డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసి పేషెంట్ ను నడిపించారు. చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్ అయినప్పటికీ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, నాగపూర్ లాంటి పట్టణాల్లో చేసే ఇలాంటి అరుదైన ఆపరేషన్లతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్ జిల్లాల పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని  ఆయన కోరారు.

మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

0

మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్: వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్  మాట్లాడుతూ.. విత్తన గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామాన్నారు. విత్తన గణపతులను పూజలు చేసిన అనంతరం ఇంటి ఆవరణలో నిమజ్జనం చెయ్యాలన్నారు. ఇలా చేస్తే విత్తన గణపతి నుండి ఒక మొక్క మొలుస్తుందని, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను ప్రతిష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువకులు గాడ్గే దీపక్, ధీరజ్ తదితరులు ఉన్నారు.

సీఎం చంద్ర బాబుకు వల్లభ స్వామి వారి చిత్రపటం అందజేసిన రేలంగి వెంకట్రావు

0

సీఎం చంద్ర బాబుకు వల్లభ స్వామి వారి చిత్రపటం అందజేస్తున్న రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర_స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చిన సీఎం నారా చంద్ర బాబు నాయుడుని స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పతో కలిసి పెద్దాపురం ఐటీడీపీ అధ్యక్షులు, మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. తొలి తిరుపతిలో వెలసిన శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ చరిత్రను సీఎం కు వివరించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని, సహకరించాలని  సీఎంకి విన్నవించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

ఘనంగా ముగిసిన శ్రావణ మాస నిత్య భజన కార్యక్రమం 

*భజన కళాకారులను సన్మానిస్తున్న రామాలయ కమిటీ ఛైర్మన్ జీ వీ రమణ

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల మండల కేంద్రంలో శ్రీ రామాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం సీతారామ భజన మండలి ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న శ్రావణ మాస నిత్య భజన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఆలయంలో  నిత్య భజనలు చేయడం గత 12 సంవత్సరముల నుండి ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా శ్రావణమాసం మొదలైన నాటి నుండి ప్రతిరోజు సీతారామ భజన మండలి కళాకారులు భక్తి గీతాలు ,ఆధ్యాత్మిక గీతాలు, హరినామ సంకీర్తనలు, శ్రీరామ కీర్తనలు ఆలపించి భక్తులను మైమరపింప చేశారు. భజన కళాకారులందరూ వ్యవసాయ పనులు, ఇతర వ్యాపార పనులు చేసుకుంటూ..ప్రతిరోజు రాత్రి మూడు గంటలపాటు రామాలయంలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు భజన గీతాలను ఆలపించి తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ శ్రీ జీ వీ రమణ నిత్య భజన కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భజనలు అనేవి మానసిక ఉల్లాసానికి, భక్తి భావాలకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. భజన కళాకారులు తమ కళ అంతరించి పోకుండా భావితరాలకు అందించాలన్నారు. కళాకారులందరినీ ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ భజన మండలి బృందం, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నేరడిగొండలో ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు

నేరడిగొండలో ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ,  సిరికొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నేరడిగొండ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో అడే గజేందర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఆయనతో  కేక్ కట్ చేయించారు. కార్యకర్తలు శాలువా, పూలమాలతో సన్మానించి తమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనం మెచ్చిన జననేత, పేద ప్రజల పెన్నిధి, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్న అని కొనియాడారు. తమ జన్మదిన వేడుకలకు హాజరైన కార్యకర్తలకు గజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజేందర్ గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ ఇమామ్ ,నారాయణ గౌడ్, అగు రమేష్, మురళిగౌడ్, పర్ల వంశీ, రాజు గౌడ్, కళ్లెం భోజన్న ,వడ్ల నారాయణ,లక్ష్మన్న, కంచం లక్ష్మణ్, దత్తు, కృష్ణ తదితరులు  పాల్గొన్నారు.

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

0

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

చిత్రం న్యూస్,భైంసా: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం భైంసా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ మేజర్ సీ హెచ్ శివప్రసాద్ పాల్గొని  మాట్లాడారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్యభట్ట లాంటి ప్రయోగాలు, చంద్రయాన్ వన్, టు, త్రీ, లాంటి ప్రయోగాలతో ప్రపంచంలో భారతదేశం ఎందులోనూ తక్కువ లేదని నిరూపించిన ఘనత మన శాస్త్రవేత్తలదని, ఇస్రో ఎన్నో ప్రయోగాలతో తన కీర్తిని ఇనుమడింప చేసిందన్నారు.విద్యార్థులు ఆదర్శనీయ వ్యక్తుల జీవితాలను ఎప్పటికప్పుడు చదువుతూ వారిని అనుసరిస్తూ ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో మన దేశం అత్యంత గర్వనీయ స్థానంలో ఉందని చంద్రయాన్ వన్ గాని మంగళ్ యాన్ గాని చంద్రయాన్ 3 గాని ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సృజనాత్మకమైనటువంటి ప్రతిభను కలిగి ఉండాలని, వివిధ ఆవిష్కరణలు, ప్రయోగాలు చేస్తూ ముందు ఉండాలని రాకేష్ శర్మ ,కల్పనా చావ్లా ,సునీత విలియమ్స్, శుభాన్స్ శుక్ల లాంటి ఎందరో అద్భుతమైన అంతరిక్ష యాత్ర చేసి దేశ కీర్తిని నలు దిశల ఇనుమ డింప చేశారని అన్నారు.ఈ సందర్భంగా అంతరిక్షానికి సంబంధించి పలు ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు డ్రాయింగ్‌, క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చంద్రయాన్‌ విజయవంతంపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.వివిధ పోటీలు నిర్వహించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, ఫిజిక్స్ అధ్యాపకులు శ్రావణ్య, రవికుమార్, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

0

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

చిత్రం న్యూస్, భైంసా, ముథోల్: అధికార లాంచనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల కింద న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళాల్లో పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ {25} వాటర్ పాల్ లో పడి మృతిచెందారు. శనివారం అతని అంత్యక్రియలు స్వగ్రామంలో అధికారిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ జవాన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముథోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్  తది

తరులు పాల్గొన్నారు.

భైంసాలో అందుబాటులోకి ఫ్రీజర్ సేవలు

*డా.ముత్యం రెడ్డి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం 

చిత్రం న్యూస్,భైంసా: తన తల్లి అమృతాబాయి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువుల రాకపోకల్లో ఆలస్యం కలిగిన సందర్భాల్లో మృతదేహాన్ని  భద్రపరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడనుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..తల్లి ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆశయంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సేవను ప్రారంభించాం. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫ్రీజర్ సేవలు అవసరమున్న వారు 9441375375, 6300854960 మొబైల్ నెంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన డా. ముత్యంరెడ్డిని భైంసా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కదం మోహన్ రావ్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చందులాల్, బీజేపీ పట్టణ కమిటి అధ్యక్షులు రావుల రాము, మాజీ అధ్యక్షులు గాలి రవితో పాటు పలువురు అభినందించారు.