ఆకట్టుకుంటున్న రెడ్డి బాలల గణేష్ మండలి గణేషుడు
సామూహికంగా మహిళల కుంకుమార్చన, ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటు నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలంతా ఓకే చోట చేరి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు అందరూ కలిసి ఒకే తాటిపై నడిచి పాల్గొనడం పండుగకు మరింత అందాన్ని తెచ్చింది. ఊరంతా ఒకే వేదికపై ఏకమై పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జనం జాతర వాతావరణాన్ని తలపించగా, అందరి ముఖాల్లో ఆనందం, భక్తి, ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. ఎస్సై బిట్ల పెర్సిస్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ విశేషంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల పూజలతో మండపంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి రోజూ వినాయకుని భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ రోజుకో కొత్త కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు.
