గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడిని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మండప నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట మావల మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులు సుధాకర్, అభిలాష్ తదితరులు ఉన్నారు.

దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వేళలో దోమల మందు పిచికారి చేస్తున్నారు. సేకరించిన చెత్తను ఎప్పటికప్పడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తున్న గ్రామస్తులు, వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.