Home Blog Page 69

భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

0

భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గణేష్  నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాలతో సిర్సన్న శివ మార్కండేయ స్వామి గణేష్ మండలం నిర్వహించింది. యువతకు ఆధ్యాత్మిక మార్గాలను ప్రోత్సహించడం,శబ్ద కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా భజనలు, సంకీర్తనల మధ్య నిమజ్జనం నిర్వహించారు. మహిళలు, భక్తులు, గ్రామస్తులు భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపును నిర్వహించారు. ఆనందోత్సాహాల నడుమ వినాయకుణ్ణి  నిమజ్జనం చేశారు. గణపయ్యా.. మళ్ళీ రావయ్యా..అంటూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బేత రాఘవేంద్ర, రూపేష్, తుమ్మల సత్తు రెడ్డి,సతీష్, సాహిల్, గణేష్, సంతోష్, రాకేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

0

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ కల్చరల్:  గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, కేఆర్కే కాలనీ, న్యూ హోసింగ్ బోర్డ్ కాలనీ, దోబీ కాలనీ, రాంనగర్, బట్టిసావర్గాం  గ్రామాల్లో ప్రతిష్టించిన పలు గణేష్ మండపాలను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో, పలు మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండప నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సర్వ విఘ్నాలను హరించే ఆ లంబోదరుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి, సుఖ సంతోషాలతో, పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జనాలు చేసేవేళ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

డెంగ్యూతో ఒకరు మృతి

0

డెంగ్యూతో ఒకరు మృతి

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన చౌలమద్ది రాజేష్ (20)  డెంగ్యూతో మృతిచెందారు. గత వారం రోజుల క్రితం నుంచి జ్వరం రాగా స్థానిక హాస్పిటల్లో చూపించారు. జ్వరము తీవ్రత ఎక్కువగా ఉందని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పడంతో చికిత్స నిమిత్తం బుధవారం సాయంత్రం జ్వరం ఎక్కువ కావడంతో నిర్మల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ  గురువారం ఉదయం 6 గంటల సమయంలో హాస్పిటల్లో  రాజేష్ మృతిచెందారు. ప్లేట్ లెట్స్ కౌంట్ చాలా తగ్గిపోయిందని, డబ్ల్యూబీసీ కౌంట్ కూడ తగ్గడంతో మృతిచెందాడని డాక్టర్లు తెలిపారని, మృతుని తండ్రి చౌలమద్ది నడిపి రాజలింగు తెలిపారు.  రాజేష్ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

0

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రిజర్వేషన్ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడి రవి, ఆత్మ డైరెక్టర్ కుంట శంకర్, పాల శంకర్, దరందాస్ మహేందర్, కొప్పుల ఉషన్న, గంగారెడ్డి, బోలశెట్టి రాములు, సాంగు భోజన్న, పాల వెంకటరమణ, గుడ్ల పెద్ద బాపు, కొప్పుల భోజన్న, ప్రవీణ్, వడూర్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు ఘనంగా సన్మానం

0

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు ఘనంగా సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను గుర్తించి ఆదిలాబాద్ పట్టణంలోని అగ్రజ టౌన్ షిప్ లో జిల్లా  రెడ్డి సంఘం నెలకొల్పిన గణేష్ మండలికి సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. మండపానికి చేరుకున్న సభ్యులు విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి , ప్రధాన కార్యదర్శి సూర్యకాంత్ , ఉపాధ్యక్షులు  రేణికుంట రవీందర్, నాంపల్లి నర్సింలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి , యువజన సంఘం అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాలను దర్శించుకున్న బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ 

0

వినాయక మండపాలను దర్శించుకున్న బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ 

చిత్రం న్యూస్, బోథ్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రంలోనీ మున్నూరు కాపు సంఘం, శ్రీ చైతన్య గణేష్, ఫ్రెండ్స్ గణేష్ మండపాలను బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరుకాపు గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం సభ్యులు, బీఆర్ ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షుడు బోడ్డు శ్రీనివాస్, బోథ్ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, ఆడేపు శ్రీనివాస్, గంగమల్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వానరానికి అంత్యక్రియలు

0

వానరానికి అంత్యక్రియలు

*మానవత్వం చాటుకున్న యువకులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో కుక్క దాడిలో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు  ధర్మమైన ఆలోచనతో కుక్కల దాడిలో మరణించిన ఓ వానారానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఓ మనిషి మరణిస్తే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలా వానరానికి కుంకుమ, పూలతో అలకరించి భజన ,బ్యాండ్ భాజాలతో, మంత్రాలతో సాగనంపుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు. మానవత్వం చాటారు. దేగాంలో  మృతి చెందిన కోతికి గోటా ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

BSNL సీజీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

BSNL సీజీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మారుమూల గిరిజన ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని వినతి

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలపై  హైదరాబాద్ లో గల BSNL సీజీఎంను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గల మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ లేక అవస్థలు పడుతున్నారని, నెట్వర్కులు లేని ప్రాంతాల్లో నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ఆయన్ను కోరారు. నెట్వర్కులు ఉన్న గిరిజన ప్రాంతాల్లో టవర్లు సాంకేతిక లోపాల వల్ల నెట్వర్క్ సమస్యలు ఏర్పడుతున్నాయని, కొన్ని టవర్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంపై ఇబ్బంది తలెత్తుతుంది అని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీజీఎం కచ్చితంగా నెట్వర్క్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత 

0

జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత 

*మేడిగూడ (ఆర్) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ 

*ప్రముఖ వైద్యులు కళ్ళెం వెంకట్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి బుధవారం తన జన్మదినం సందర్భంగా సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు సతీమణి డాక్టర్ జీవితతో కలిసి ఉచితంగా షూలను పంపిణీ చేసి ఉదారత చాటారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించేందుకు  తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..  విద్యార్థులు ఆరోగ్య లక్షణాలను అలవర్చుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. వైద్యపరంగా విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలని, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలన్నారు. అనంతరం డాక్టర్  జీవిత వెంకట్ రెడ్డి దంపతులని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ యాదవ్, వీడేసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, గ్రామస్తులు మడపాచి శ్యాం, పోలవేణి అడెల్లు, డోకె సంతోష్, క్యాతం శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

0

ఆదిలాబాద్ జిల్లాలో ముంపు ప్రాంతాలు, పంటలను పరిశీలించిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం  అని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. గత పక్షం రోజులకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి, వచ్చిన వరదలతో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు ఎంతో నష్టపోయారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు బోథ్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను నియోజక వర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు,  నాయకులతో సందర్శించారు. ముందుగా జిల్లాకు వచ్చిన ఆయనకు నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలంలోని పలు గ్రామాలలో పాటు, తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి అధికారులు రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఆ నివేదికలు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని అన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.