Home Blog Page 44

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు ముదుల్కర్ వనజ  ఆమె అనుచరులతో కలిసి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  వీరికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు పేరిట గొడవలు పెట్టిందని మండిపడ్డారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతామన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఎప్పుడూ సంప్రదించిన అండగా నిలబడే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పక్షంలో ఉండాలని, బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసిన మోసాలకు మహిళలు మండిపడుతున్నారని, వారికి కచ్చితంగా మహిళలే బుద్దిచెబుతారని, ఆడ బిడ్డలను మోసం చేస్తే ఎవరు బాగుపడరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, పండరీ, దేవేందర్ రెడ్డి, ప్రతాప్ తదితరులు ఉన్నారు.

రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎల్మ సంజయ్ రెడ్డి

 రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎల్మ సంజయ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ఎల్మ సంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ  మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు సంతోష్ రెడ్డి, తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ రెడ్డి(అడ్వకేట్) మాట్లాడుతూ.. పేద రెడ్డి బంధువులకు న్యాయం చేస్తానని, రెడ్ల వైభవానికి,  అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, యూత్ జనరల్ సెక్రెటరీ క్యాతం శివప్రసాద్ రెడ్డి, ఇతర రెడ్డి బంధువులు పాల్గొన్నారు.

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

0

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కౌఠ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  7వ తరగతి చదివే విద్యార్థి శోభన్కర్ ఆదిత్య  తన  అద్భుతమైన తెలివిని ఉపయోగించి పనికి రాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ ను తయారు చేసి చూపించాడు. అటు చదువుతోపాటు ఆ విద్యార్థి ప్రతిభను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ప్రోత్సహించారు. దీంతో ఆ విద్యార్థి పనికిరాని వస్తువులని ఉపయోగించి బ్లూటూత్ స్పీకర్ తయారుచేసి అందరినీ అబ్బురపరచాడు. ప్రతి ఒక్కరూ విద్యార్థిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేటి సమాజంలో అన్ని రంగాలు  టెక్నాలజీతో ముడిపడిందని ప్రతి ఒక్కరు తమ ప్రతిభతో, ఆలోచనతో పనికిరాని  వస్తువులను సేకరించి వివిధ రకాల వస్తువులను తయారు చేసి తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. గతంలో కూడా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో (ఎన్ ఎమ్ ఆర్) వాగ్దేవి సొసైటీ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్ పనికిరాని వస్తువులతో ఇంటికి ఉపయోగపడే వంద రకాల అలంకార వస్తువులను తయారు చేసి వావ్ అనిపించుకున్నాడు.

బాసర గోదావరి ఘాట్లు శుభ్రపరుస్తున్న గ్రామ యువకులు 

0

బాసర యువకులు భళా..

 గోదావరి ఘాట్లు శుభ్రపరుస్తున్న గ్రామ యువకులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి పుష్కర ఘాట్లను గ్రామ యువకులు శుభ్రపరిచారు. ఇటీవల దేవీ నవరాత్రులలో నిమజ్జనం చేసిన దుర్గ మాత విగ్రహాలు, పూలమాలలు, ప్లాస్టిక్ కవర్లు, బట్టలు పేరుకుపోయాయి. వచ్చే భక్తులు స్నానాలకు వెళ్లాలన్న భయంకరంగా ఉండేది. గమనించిన గ్రామ యువకులు స్పందించి ముందుకు వచ్చి స్వయంగా పుష్కర ఘాట్లను పరిశుభ్రం చేశారు. గ్రామ యువకులు స్వచ్ఛందంగా ఘాట్లను శుభ్రం చేయడంతో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

సోనేరావును సన్మానించిన  కలెక్టర్, ఎస్పీ

సోనేరావును సన్మానించిన  కలెక్టర్, ఎస్పీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కుమురం భీం వర్ధంతి  వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమురం భీం విగ్రహానికి ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  భీం ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఇటీవల ఆదిమ గిరిజన కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన కొడప సోనేరావును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సన్మానించారు. అభినందనలు తెలిపారు. 

 

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది 

కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కులకోసం పోరాడిన కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధనకోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కుమురం భీం చౌక్ లోని అయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప వీరుడు కుమురం భీం అని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల సాధనకోసం కృషిచేసిన భీం పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి ప్రత్యేక కృషిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనందరావు, NSUI మావల మండల అధ్యక్షుడు మర్సుకోల గౌతం, మావల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు రేండ్ల రాజన్న, కొరటి ప్రభాకర్, అలీమ్ ఖాన్, సముల ఖాన్, ఫెరోజ్ ఖాన్, MD వసీం, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

*నిజాం పాలనలోనే జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మన జిల్లా బిడ్డ కుమురం భీం

చిత్రం న్యూస్,నేరడిగొండ: కుమురం భీం జ్ఞాపకార్తం రూ. 25 కోట్లతో జోడేఘాట్ లో మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని బోథ్ ఎలా అనిల్ జాదవ్ అన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మావ నాటే..మావ రాజ్ కలను సాకారం చేసి వారి గ్రామాల్లో వారికే అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాల తనిఖీ 

0

మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాల తనిఖీ 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో గల దీపావళి మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాలను అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు రెవెన్యూ, అగ్ని మాపక అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా మాత్రమే మందు గుండు సామగ్రి తయారీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. కార్యక్రమంలో సీఐ విజయ శంకర్, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, పెద్దాపురం అగ్నిమాపక అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

0

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

తెలంగాణ స్థానిక ఎన్నికలు నిలుపుదలకు ఛాన్స్..?

లక్ష్మణరేఖ దాటిన బీసీ రిజర్వేషన్లు

సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

చిత్రం న్యూస్, నిర్మల్; తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 న్యాయపరమైన సంక్షోభానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న ఈ అంశంపై ఏకంగా సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులలో ఏకకాలంలో విచారణ జరగనుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ న్యాయ పోరాటానికి కేంద్ర బిందువు, సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఈ కొత్త జీవో ఉల్లంఘిస్తుందనే ప్రధాన అభ్యంతరం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు, 42% బీసీ రిజర్వేషన్లు కలిపితే, మొత్తం రిజర్వేషన్ల శాతం 50% పైగా పెరుగుతుందని పిటిషనర్లు గట్టిగా వాదిస్తున్నారు. రిజర్వేషన్ల చరిత్రలో అత్యంత కీలకమైన ‘ఇందిరా సాహ్నీ’ తీర్పు ఆధారంగానే పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యేక పరిస్థితులు మినహా, రిజర్వేషన్లు ఏమాత్రం 50 శాతాన్ని మించకూడదని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఈ జీవో ఆ రాజ్యాంగ పరిమితిని స్పష్టంగా దాటుతుందని పేర్కొంటూ, దీనిని తక్షణమే రద్దు చేయాలని గోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ కింద  (అక్టోబర్ 6, 2025) సుప్రీంకోర్టు విచారించనుంది. అత్యున్నత న్యాయస్థానం ఈ జీవోకు పచ్చజెండా ఊపుతుందా.. లేక 50 శాతం పరిమితిని దృష్టిలో ఉంచుకుని బ్రేకులు వేస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశంపై చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధమవుతున్నప్పటికీ, ఇదే బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఈ కేసును అక్టోబర్ 8న విచారించనుంది. ఒకే కీలక అంశంపై రెండు  ఉన్నత న్యాయస్థానాలు వరుసగా విచారణ జరపనుండడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను పెంచింది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన తరుణంలో కోర్టు తీర్పు ప్రభావం బహుముఖంగా ఉండనుంది. ఒకవేళ కోర్టులు జీవోను నిలుపుదల చేసినా లేదా సవరింపునకు ఆదేశించినా స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే లేదా వాయిదా పడే అవకాశం ఉంది. రిజర్వేషన్లను తిరిగి లెక్కించడం, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించడం వంటి అనివార్య చర్యల కారణంగా అభ్యర్థులు, ఆశావహులలో గందరగోళం నెలకొంటుంది. ఇది ఎన్నికల భవిష్యత్తును, రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

*బీసీ సంఘాల ఆశ- ప్రాతినిధ్యం నిలుస్తుందా?

ఈ మొత్తం వ్యవహారంలో బీసీ సంఘాలు, నాయకుల ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. ఎక్కువ శాతం రిజర్వేషన్ల ద్వారా తమ వర్గానికి మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని వారు ఆశిస్తున్నారు. గతంలో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నందున, స్థానిక సంస్థల్లో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదనేది వారి ప్రధాన వాదన. 42% రిజర్వేషన్ల నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఒకవేళ కోర్టులు 42% రిజర్వేషన్లను తగ్గిస్తే..స్థానిక సంస్థలలో బీసీలకు దక్కే సీట్లు తగ్గుతాయి. దీంతో బీసీల ఓటు బ్యాంకు వారి రాజకీయ ప్రాధాన్యతపై ప్రభావం పడుతుందనే భయం ఉంది. మరోవైపు ఈ అంశం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కోర్టు పరిధిలోకి రావడంతో దీనిపై ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలితే ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం లభించినట్టే అవుతుంది.

*రాజకీయ వ్యూహంపై ప్రభావం-అభ్యర్థుల్లో అనిశ్చితి

ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం అనేది రాజకీయంగా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా బీసీ వర్గాల మద్దతును పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవాలని పాలక పక్షం భావించింది. అయితే.. న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో బీసీ అభ్యర్థులు,  ఆశావహుల్లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే.. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడాలనే వారి ఆశలు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి. రిజర్వేషన్లు తగ్గినట్లయితే ఇప్పటికే ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్న అనేకమంది అభ్యర్థులు తమ పోటీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల రాజకీయం, న్యాయస్థానాల పాత్రను మరోసారి చర్చనీయాంశం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న సుప్రీంకోర్టు విచారణ, తెలంగాణ రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ల అంశానికి కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది, ఇది రాబోయే ఎన్నికల ప్రక్రియకు, నూతన అధ్యాయానికి దిశానిర్దేశం చేయనుంది.

వెంకగారి భూమయ్య (సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863)

 

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

0

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

సోయా పంట కాపాడేందుకు ఇబ్బందులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం  వర్షం కురిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే భారీ వర్షం కురవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సోయా పంట వచ్చిందని ఆరబోయే సమయానికి అకాల వర్షం కురవడంతో రైతన్నలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వర్షాలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాలతో పంటలు దెబ్బతినగా.. ఇప్పుడేమో చేతికి అందిన సోయా పంట ఆరబోయనీయకుండా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.  ఎప్పుడొస్తుందో తెలియని వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంట కుప్పలపై టార్ఫాలిన్లు కప్పుతూ పంటను కాపాడుకునేందుకుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.