Home Blog Page 43

IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

0

ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్.కళ్ళెం వెంకట్ రెడ్డి

IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవవర్గాన్ని  శనివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కాలే సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కళ్లెం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా బండి  సాయికృష్ణతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా  ఐఎంఏ నూతన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను డాక్టర్లు శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు.

ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు

0

ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు

* లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన  ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలకతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేలా చేపడుతున్న ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం భోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండకూడదని సదుద్దేశంతో ఇప్పటికే 4 కోట్ల 80 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2 కోట్ల 40 లక్షల ఇండ్ల నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అశోక్ రెడ్డి, రమేష్, గంగాధర్ సంజు,గణేష్, శ్రీనివాస్,  అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

0

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసరలోని మహారాష్ట్ర పర్డేకర్ భవనంలో వారం రోజుల అఖండ హరినామ సప్తాహ శనివారం రోజు ఘనంగా ముగిసింది. బ్రహ్మముహుర్తాన స్వామి వారికి కాగడ హారతితో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పర్భని జిల్లాకు చెందిన యోగేష్‌ మహారాజ్‌ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. దైవ నామస్మరణ చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు భక్తి సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం బాసరలో అఖండహరినామ సప్తాహ నిర్వహించడంతో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలతో పాటు క్రమశిక్షణ, జీవన విధానంలో మార్పు వచ్చి, వ్యవసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు

0

వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోని    ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లో జరిగిన వైన్స్ షాపుల దొంగతనాల కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. భైంసా ASP అవినాష్ కుమార్ నిందితుల వివరాలను శనివారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన యాపరి వినోద్ తన స్నేహితులైన  బ్యాగరి రోహిత్, నీరది శ్రావణ్ కుమార్, ఖదులూరి సాయి ఆదిత్య గౌడ్, పట్ల నవీన్, టి.దిలీప్ లతో కలిసి  దొంగతనానికి పాల్పడ్డారన్నారు. మే నెల 24న శ్రావణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ముథోల్ లోని రాజరాజేశ్వర  వైన్స్ లో మద్యం బాటిళ్ల కాటన్లను అపహరించారన్నారు. జనవరి 24న తానూర్ లోని లక్ష్మీ వైన్స్ లో రూ.8 వేల నగదును దొంగలించారని, సీసీ కెమెరాల్లో దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయని గమనించి వాటిని సైతం దొంగలించి బాసర గోదారి నదిలో పడేశారన్ననారు.వినోద్ తాడ్ బిలోలి లో బెల్టు షాపు నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యం బాటిళ్లను అక్కడ విక్రయించగా వచ్చిన డబ్బులను అతని వద్దే ఉంచుకున్నాడన్నాడు. మరో దొంగతనం చేసినప్పుడు వాటా ఇస్తా అని చెప్పాడన్నాడు. శుక్రవారం ముథోల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద దొంగతనం చేసే ఉద్దేశంతో తిరుగుతుండడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారన్నారు. ప్రధాన నిందితుడు యాపరి వినోద్ తో పాటు మరో ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు.  ముథోల్ సీఐ మల్లేష్  ఎస్సై బిట్ల పెర్సిస్,   తానూర్ ఎస్సై జుబేర్ లను జిల్లా SP డాక్టర్ జానకి షర్మిల అభినందించారు.

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

0

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండలం శారద నగర్ కాలనీకి చెందిన పలారం గంగాధర్ ద్విచక్రవాహనం దొంగలించిన ఇద్దరు దొంగలను బాసర పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం..గంగాధర్ ఎప్పటిలాగే ఇంటి వద్ద ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశారు.  ఇంతలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఇంటి లోపలికి చొరబడి పార్కింగ్ చేసిన బైకును ఎత్తుకొని పారిపోయారు. బాధితుడు బాసర పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన  పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని పలారం గంగాధర్ కు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులకు కాలనీవాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

0

సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర మండల తహసీల్దార్  పవన్ చంద్రకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాసర  మండల కార్యదర్శి ఆనంద్ బండారి, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావ్, ముత్యం భగవాన్, బలిరాం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక 

0

బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ ల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. కాగా ప్రెస్ క్లబ్ మండల గౌరవ అధ్యక్షులుగా ఎండల సంతోష్ రావు, జిల్లా అధ్యక్షులుగా నర్సూరి భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా అబ్బువార్ గౌతం, కోశాధికారిగా బండారి ఆనంద్, సలహాదారులుగా హనుమంతరావు, నర్సూరి ధర్మారావు లను ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులుగా పింప్లే రామేశ్వర్ .బలగం రాములు, సుధాకర్ రావు, దావు సంతోష్, జాదవ్ సంజీవ్, జాజోళ్ల ప్రకాష్, పసుపుల నాగేష్, బలగం పవన్ కుమార్ లను ఎన్నుకున్నారు. అనంతరం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ లు మాట్లాడుతూ..ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురితం చేయాలని సూచించారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకొన్నారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు

బేలలో వైభవంగా బతుకమ్మ నిమజ్జనం 

బేలలో వైభవంగా బతుకమ్మ నిమజ్జనం 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం రాత్రి బతుకమ్మ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు, యువతులు కలిసి రంగు రంగు పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు దారి గుండా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. బతుకమ్మ..వెళ్లి రావమ్మా అంటూ కొలుస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం సమీప వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం

ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి నుంచి బెదోడ వరకు మంజూరైన రహదారి పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెదోడ నుంచి 35 మంది విద్యార్థులు సాంగిడి ఉన్నత పాఠశాలకు చదువుకునేందుకు నిత్యం ఆటోలో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పోషకులు స్వయంగా రహదారి బాగు చేయడంతో ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి బుధవారం ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కలిసి అసంపూర్తిగా ఉన్న రోడ్డుని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సామ రూపేష్ రెడ్డి కోరడంతో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభించి చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట సంతోష్, సుధాకర్, మంచికంటి సాయి, గెడం సతీష్ తదితరులు ఉన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు ముదుల్కర్ వనజ  ఆమె అనుచరులతో కలిసి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  వీరికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు పేరిట గొడవలు పెట్టిందని మండిపడ్డారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతామన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఎప్పుడూ సంప్రదించిన అండగా నిలబడే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పక్షంలో ఉండాలని, బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసిన మోసాలకు మహిళలు మండిపడుతున్నారని, వారికి కచ్చితంగా మహిళలే బుద్దిచెబుతారని, ఆడ బిడ్డలను మోసం చేస్తే ఎవరు బాగుపడరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, పండరీ, దేవేందర్ రెడ్డి, ప్రతాప్ తదితరులు ఉన్నారు.