Home Blog Page 37

సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా 

0

*రోడ్డుపైనే వంట వార్పు

*అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతులు

చిత్రం న్యూస్, సొనాల:కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ సొనాల మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాను నిర్వహించారు. వంట వార్పు చేసి అక్కడే భోజనం తిన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా, మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందన్నారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సొనాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పంటలను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో  డబ్బులు జమచేసేవారని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని, రైతులకు రావలసిన రైతుబంధు విడుదల చేయాలని, పత్తి పంటను పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని అన్నారు.  విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సీఐ గురుస్వామి,  ఏవో అక్కడకు చేరుకొని సముదాయించారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముత్తన్న, జనార్ధన్ ,ఇర్ల అభిలాష్, భీంరావు పాటిల్, యాల్ల సుధీర్ రెడ్డి, హరీష్, లంక లలిత, రామ్ కిషన్, వినోద్, సంజీవరెడ్డి, సుగుణాకర్ తుల, అభిలాష్, రాజన్న, ప్రదీప్, కృష్ణ, ఈశ్వర్, సంతోష్ ఇర్ల శ్రీధర్, నవీన్, శ్రీకాంత్, విట్టల్, మహేష్, ఆసిఫ్ షేక్, శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు

0

చిత్రం న్యూస్, భీంపూర్: సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భీంపూర్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహకార కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్  ఎ.నవీన్ కుమార్ ను నియమించారు. భీంపూర్ లోని సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించగా సొసైటీలో (09) డైరెక్టర్ పోస్టు లకు ( 09) మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా మెస్రం దీపీక, సహ అధ్యక్షులుగా మెస్రం నాగమ్మ, కార్యదర్శిగా ఆత్రం సరస్వతి, కార్య నిర్వాహక సభ్యులుగా కుడుమెత సంగీత, గేడం పుష్పలత, కినక మమత, గేడం రూప, పెందుర్ మనీషా, తొడసం శశికళ బాయిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘ బలోపేతానికి పనిచేయాలని కోరారు. ఎన్నికైన సభ్యుల కాల పరిమితి (05) సంవత్సరాల వరకు ఉంటుంది. ఎన్నికైన సభ్యులకు ఎన్నికల అధికారి ఎ.నవీన్ కుమార్ ధృవీకరణ పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆదర్శ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామెల్లి శివకుమార్ కు సన్మానం

0

చిత్రం న్యూస్, కలెక్టరేట్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించి బాధ్యతలు చేపట్టిన భీంపూర్ మండలం ఆర్లీ (టి) కు చెందిన రామెల్లి శివ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ యూనియన్ తరపున శనివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్ మాట్లాడుతూ..నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ కు యూనియన్ తరపున అభినందనలు  తెలిపారు. సహకార శాఖ పటిష్టత ను కాపాడుతూ, ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆత్మారామ్, శారద, అరుణ,  ఉద్యోగులు విక్రాంత్, దేవేందర్ , దినేష్, సంతోష్, నయీం, సంజయ్, సంతోష్, దిరేష్, లక్ష్మీ, ఆశ జ్యోతి, రజిత , శశికళ, దేవు బాయి తదితరులు పాల్గొన్నారు.

వైభవోపేతంగా భావుబీజ్ వేడుకలు 

0

చిత్రం న్యూస్, బేల: సోదర అనుబంధానికి, అనురాగాలకు ప్రతీగా నిలిచే భావుబీజ్ వేడుకలను శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. దీనిని మహారాష్ట్ర, గోవా, మరియు గుజరాత్‌లలో భావుబీజ్ అని పిలుస్తారు, ఇది “భాయ్ దూజ్” కు మరొక పేరు. మహారాష్ట్రలోని ఈ పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోగా సరిహద్దులోని ఇక్కడి ప్రాంత మరాఠీ ప్రజలు జరుపుకోవడం  ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్, బేల, జైనథ్,  భీంపూర్ మండలాల్లో ఈ పండగను వేడుకగా నిర్వహించారు. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ వేడుకలు  నిర్వహించగా సోదరీమణులు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. సోదరులు వారికి కానుకలు అందజేసి తమ ప్రేమను చాటుకున్నారు. భావు బీజ్ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.

పత్తి ముజ్జుకు లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పత్తి  ముజ్జును కాంగ్రెస్ సీనియర్ నాయకులు, న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శించారు. గత రెండు రోజుల క్రితం పత్తి ముజ్జు సోదరి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం పత్తి ముజ్జు నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పత్తి  ముజ్జు సోదరి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. లోక  ప్రవీణ్ రెడ్డి వెంట మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ తదితరులు  ఉన్నారు.

 

సహృదయ్ యాదవ్ కు ఎంబీబీయస్ సీటు

0

విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ కుమారుడు సహృదయ్ యాదవ్ కు యం. ఎంబీబీఎస్ లో సీటు వచ్చిన సందర్బాన్ని పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి స్వీట్స్, పసందైన చికెన్ తో కూడిన విందుభోజనం ఏర్పాటు చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మా పెద బాబు సహృదయ్ యాదవ్ కు ప్రభుత్వ  మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్  సీటు వచ్చింది అని అన్నారు. పాఠశాల విద్యార్థులకు చదువు యొక్క విలువను తెలియజేయడం జరిగింది అని అన్నారు. డాక్టర్ కావడం మా బాబు కల అని, గిరిజనులకు, పేదలకు సేవ చేయాలనే  లక్ష్యం ఉందని అని అన్నారు. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందం ఉంది అని అన్నారు. మా బాబులాగా మరింత ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో జామిని గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ,  లక్ష్మణ్, దూస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మూనాహిద్,మోహిజే పోచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

0

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు

*తప్పిన పెను ప్రమాదం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో  వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో  ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

0

చిత్రం న్యూస్, బోథ్: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నిర్వహించారు. బోథ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీసాయి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మండలం లోని యువకులు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రక్తదానం చేశారు. రక్తదానం చేయడంతో ఒక ప్రాణం నిలబడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.

ఇండోఫిల్ ఇండస్ట్రీస్ ‘ప్రాజెక్ట్ ఖుషి’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం

0

చిత్రం న్యూస్, జైనథ్: “సంస్కృతి, సమాజం పోషణకు ఒక అభివ్యక్తి”ని సూచించే ఇండోఫిల్ ఇండస్ట్రీస్ యొక్క “ప్రాజెక్ట్ ఖుషి (విస్టేరియా)” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, వెంకటేశ్వర దేవాలయం వద్ద వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులతో ముచ్చటించి వారితో కలిసి చురుకుగా వృక్షారోపణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ASM గజానన్, RDGM గౌతమ్ రెడ్డి, RSM మహిపాల్ రెడ్డి, ఆదిలాబాద్ DGE ఎర్ల సాయికృష్ణ, నిజామాబాద్ ప్రాంత DGO సంతోష్, CO బాపన్న హాజరయ్యారు.

విద్యార్థుల పరీక్ష ఫీజు గడువు పెంచాలి

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొదటి మూడు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు  చెల్లించడం కోసం ఈ నెల 22 వరకు గడువు ఉంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణం, వర్షాలు, ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్న బేల,  బజార్ హత్నూర్, ఉట్నూర్ లాంటి మండలాల్లో దీపావళి సందర్భంగా గుస్సాడీ దండారీలు అనే ప్రత్యేక పరిస్థితి ఉండటంతో అధిక శాతం మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేక పోతున్నారు. అలాగే సాంకేతిక కారణాలు కూడా ఉండటంతో యూనివర్సిటీ అధికారులు మానవత దృక్పథంతో మరో వారం రోజులు పరీక్ష ఫీజు గడువును  ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పెంచాలని ఏడీసీఏ ( ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్) తరుపున డా. వేముగంటి వరప్రసాద రావు సమావేశంలో యూనివర్సిటీ అధికారులని కోరారు.