Home Blog Page 32

జాతీయ రహదారిపై ప్రమాదం: కల్వర్టును ఢీకొన్న లారీ

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామ సమీపంలో 353బీ జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న ఓ లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా సోమవారం ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను ఢీకొనడంతో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

* డా.అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఆదివారం డా అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నాయకులు పిడమర్తి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..డా. అన్నా బాహు సాఠే, కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన అణగారిన వర్గాల గొంతుకని, తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయం జరగాలన్నదే మన ప్రభుత్వ సంకల్పమన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో మాదిగ సోదరుల పాత్ర మరువలేనిదన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించుకోవడం మన బాధ్యతన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బహుజన పక్షపాతిగానే ఉంటుందన్నారు. ఇవాళ ఇక్కడ ఇంతమంది మాదిగ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం గర్వకారణమన్నారు. రాజకీయాల్లో ఎదిగిన మాదిగ సోదరులు తమ అధికారాన్ని పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. బలహీన వర్గాల సాధికారత కోసమే ఇవాళ కులగణన వంటి కీలక నిర్ణయాలను మనం ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..సాఠే విగ్రహం మనకు నిరంతరం పోరాట పటిమను గుర్తుచేస్తుందన్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమన్నారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందేలా చూడటమే మన లక్ష్యమన్నారు.

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం

*స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​,ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​ విద్యార్థులను సన్మానించారు.ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు.స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు.ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​,ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​ విద్యార్థులను సన్మానించారు.

సెకండియర్​ ఎంపీసీలో మృదుల స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించగా, బైపీసీలో తుబా ఫాతిమా, బి.కావ్య నాలుగో ర్యాంకు సాధించారు. అంతేకాకుండా ఎంపీసీలో హమియా ఉమేమా, వై.గౌతమి ఆరో ర్యాంకు పొందారు. అలాగే డి.కౌచిత, ఏ.సంజన, సీహెచ్​.వైష్ణవి, ఎన్​.రూపాని, కె.కీర్తి, టి.నిత్యశ్రీ, కె.అశ్రిత స్టేట్​ ర్యాంకులు సాధించారు.

ఫస్టియర్​ ఎంపీసీలో బి.మనోగ్న,ఆర్​.అక్షిత స్టేట్​ సెకండ్​ ర్యాంకులు పొందారు.అలాగే ఎస్​.భవాని,సాకేత్​, ఇష్రా మహీన్​,జేఎస్​.రినిత్య మూడో ర్యాంకులు సాధించారు. ఏ.సాయి విఘ్నత, తమన్నా నాజ్​, సిరి వేద స్టేట్​ ర్యాంకులు పొందారు.

ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల ఛైర్​పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాల వెనుక నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు.90 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు,స్టేట్ ర్యాంకులు సాధించారన్నారు.

రాష్ట్రంలో అగ్రగామిగా..

స్టేట్ ర్యాంకులే కాకుండా, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో కాకతీయ విద్యార్థులు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. అద్భుతమైన విజయాలకు కారకులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు విశేషమైన కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు చెరుకూరి రజనీకాంత్​, రామోజీ ,తేజస్విని, రాజా,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

నిఘా నేత్రం..నేర నియంత్రణకు మార్గం

ఇచ్చోడలో 40 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీటీవీ కెమెరాలు ‘మూడో కన్ను’గా నిరంతరాయంగా పని చేస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గంజాయి వినియోగానికి, విక్రయాలకు దూరంగా ఉంటూ “నో టు గంజాయి” నినాదాన్ని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు  సిబ్బంది పాల్గొన్నారు.

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!

0

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!

చిత్రం న్యూస్,జైనథ్: మండల కేంద్రానికి చెందిన గాతాడే వైష్ణవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో సంచలనం సృష్టించింది. బైపీసీ (BiPC) విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.

జైనథ్ గ్రామానికి చెందిన గాతాడే అనిల్ కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తన ప్రతిభతో అగ్రస్థానంలో నిలిచి, అటు తల్లిదండ్రులకు, ఇటు జైనథ్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చింది. 438 మార్కులతో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

వైష్ణవి సాధించిన ఈ అద్భుత విజయంపై స్థానికులు,  గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైనథ్ పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైష్ణవి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నామని తెలియజేశారు.

ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 

చిత్రం న్యూస్, నల్గొండ: నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విభాగాలతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాలలోనూ విద్యార్థులు ఉన్నత ర్యాంకులను సాధించారు.  సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి. దీప్తి 994/1000, కె. మహతి 991/1000, బి. ప్రవీణ్ 989/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ బైపీసీలో కే. మేఘన 992/1000, ఎన్. సిరి 985/1000 మార్కులు సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో బి. సిరి 438/440, అయాన్ 436/440, డి. భార్గవి 432/440, జె. చందన 431/440, బి. సాయి నాగేంద్ర 429/440 మార్కులు సాధించగా, ఎంపీసీలో టి. హన్సిక రెడ్డి, జి. శ్రావణి, ఎన్. ఎన్. జాన్వి 466/470 మార్కులతో జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు.కే. హిమావర్షిని 464/470, ఆర్. శివమణి, అష్రాఫ్ అలీ 461/470 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి, స్వీట్లు తినిపించి ప్రోత్సహించింది.

చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, అత్యవసర నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు చప్రాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ (Assistant Engineer) ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని,  వినియోగదారులు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

చిత్రం న్యూస్, బేల: మండలంలోని బాధి గ్రామపంచాయతీ పరిధిలోని హేటి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. గ్రామ పటేల్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంతేలా వినోద్, వార్డు సభ్యులు జోడే గణేష్, కనకే జ్ఞానేశ్వర్ మరియు గ్రామ పెద్దలు దాసరి గుణవంతరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంజయ్ గుండవార్, వాంఖడే వామన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయ విస్తృత పర్యటన 

చిత్రం న్యూస్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటిస్తూ పలు ధార్మిక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దమ్మపేట మండలం సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట (బొడ్రాయి), నాభిశిల, ద్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లి మండలం మంగళిగుట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. తిమ్మపేట గ్రామంలో ఇటీవల మరణించిన పాత్రికేయులు పోతుగంటి క్రాంతి దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వరరావుని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో పద్ధం వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

శనగ కొనుగోళ్లు తాత్కాలికంగా నిలుపుదల: రైతుల్లో ఆందోళన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని శనగ రైతులకు మార్క్ ఫెడ్ (Markfed) అధికారులు కీలక సూచన చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా జరుగుతున్న శనగల కొనుగోళ్లను 4 నుండి 5 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేటాయించిన కొనుగోలు కోటా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి తదుపరి కొనుగోలు కోటా మరియు అనుమతులు వచ్చే వరకు మార్కెట్ కు కొత్తగా శనగలను తీసుకురావద్దని సెక్రటరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల కూడా కొనుగోళ్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులకు శనగలను తీసుకువచ్చి ఇబ్బందులు పడకుండా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు కోరారు. మరోవైపు, అప్పటికే మార్కెట్ కు చేరుకున్న నిల్వలను కాపాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధరపై ఆశలు పెట్టుకున్న తమకు, కొనుగోళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు.