చిత్రం న్యూస్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటిస్తూ పలు ధార్మిక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దమ్మపేట మండలం సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట (బొడ్రాయి), నాభిశిల, ద్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లి మండలం మంగళిగుట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. తిమ్మపేట గ్రామంలో ఇటీవల మరణించిన పాత్రికేయులు పోతుగంటి క్రాంతి దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వరరావుని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో పద్ధం వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-

