శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల సబ్ మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుంచి ప్రభుత్వం రైతుల శనగపంట కొనుగోలు చేయకపోవడంతో శనివారం రైతులు ధర్నా చేపట్టారు.మండల బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా 353బీ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ మండలంలో రైతులు 5,600 ఎకరాలల్లో శనగ పంట పండిస్తే కనీసం ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 20% కూడా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా ఉండి అన్ని విధాల ఆదుకుంటే, ఈ ప్రభుత్వ మాత్రం రైతుల పేరిట శాపంగా మారిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంబంధిత మార్క్ఫెడ్ డీఎంతో చరవాణిలో మాట్లాడించారు. సోమ, మంగళవారాల్లో కచ్చితంగా శనగ కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి రైతులకు నచ్చజెప్పారు దీంతో వారు శాంతించి ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖోడే విపిన్, నాయకులు గోడే విశాల్, మధుకర్ భలేరావు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.
శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
జైనథ్ మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
జైనథ్ మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్,జైనథ్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారానే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జైనథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి తో కలిసి ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత యాసంగి సీజన్లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అధిక డిమాండ్ ఉండే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్, బీజేపీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, బీజేపి నాయకులు పిడుగు సంతోష్ యాదవ్,చిలుకూరి లింగారెడ్డి, అశోక్ రెడ్డి, దేవన్న, వెంకట్ రెడ్డి, సారథి, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ స్రవంతితో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు రాహుల్ శుక్ల, ఎస్.జి. హెడ్గే, జెపి సబర్వాల్, రాజీవ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎదురవుతున్న సాంకేతిక అంశాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు
ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు
*అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలో అనుమానస్పదంగా తిరుగుతున్న యువకుడిని గోదావరి నది వద్ద గమనించి స్థానికులు 100కు డయల్ చేశారు. ఈ సమాచారం అందుకొని పోలీసులు హుటాహుటిన గోదావరి నది వద్ద చేరుకొని అతన్ని పట్టుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్ తరలించి అతని వివారాలు ఆరా తీశారు. కుంటాల మండలం లింబ కే గ్రామానికి చెందిన పండ్ల సిందే విజయ్ కుమార్ గా గుర్తించారు. కుటుంబం కలహాల కారణంగా చిన్న గొడవతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని గోదావరి వద్దకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆయన్ను అప్పగించారు. ఈ సమాచారంపై స్పందించిన సీఐ కిరణ్ కుమార్, బాసర పోలీసులు గగన్, సుభాష్, చందు, భాస్కర్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు .
ప్రతి ఒక్కరూ సీపీఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండాలి:పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి పణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో టాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అర్డెవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విసృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో బ్లూ కోర్టు సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సీపీఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్డెవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా సీపీఆర్ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ శిక్షణలో సీపీఆర్ విధానం, పాథమిక పథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. పత్రి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సీపీఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి నిజామాబాద్ టాఫిక్ ఏ.సీ.పి మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, టాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ రామనేశ్వర్ (న్యూరాలజిస్ట్ (ఐ.ఎమ్.ఏ ట్రెజరీ), డా. శ్రీశైలం (పీడియాటెస్ట్, డాక్టర్ విటల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్ ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం
రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం
చిత్రం న్యూస్, బేల: ఆపద సమయంలో సమాజ సేవలో ముందుంటూ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులను బేల మండలంలోని గ్రామమైన సిర్పన్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులైన ఊరాడే సాహిల్, మడావి నాగేష్, మరిపెల్లి కిరణ్ లను బేల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధు కృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. క్లబ్ సభ్యులు తమ బాధ్యతలను చురుకుగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సామాజిక సేవా కార్యక్రtమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాము బార్కడే, మడావర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2 లోగా పీఆర్సీని అమలు చేయాలి
*డిమాండ్ల సాధన కోసం భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన
*ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ రెండు లోగా పీఆర్ సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన… నిజామాబాద్ కలెక్టరేట్ సమీకృత కార్యాలయ ఆవరణలో, నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించుటకు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్ రావు అధ్యక్షతన, 206 పైగా భాగస్వామ్య సంఘాలతో టీజీ ఈ జేఏసీ ని స్థాపించి, పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినప్పటికీని, ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టడం వల్ల, ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో…ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన 69 డిమాండ్ లో అతి ముఖ్యమైన నాలుగు డిమాండ్లలో మొదటిది, పీ ఆర్ సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నప్పటికిని నేటికి నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరమని అయన అన్నారు. అతి త్వరగా 51% శాతం ఫిట్మెంట్ తో, 2 వ పిఆర్సిని, అమలు చేయాలనిరెండవది ఉద్యోగులకు 13 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లుల అన్నింటిని ఏక మొత్తంగా విడుదల చేయాలని మూడవది అతి ముఖ్యమైనది ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ, ఆరోగ్య కార్డులను అమలు చేయాలని
మూడవది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మరచినట్టు కాదని, సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సి పి ఎస్ స్కీం నుండి రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు మిగతా 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని, నిరసన ప్రదర్శనను చేపట్టామని… ఉద్యమ కార్యచరణలో భాగంగా, మే 5 న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలుపుతూ, అయినను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే, రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ… ఉద్యమ కార్యచరణలో భాగంగా, నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బాధ్యులు పులగం దామోదర్ రెడ్డి కి, టీజీఈ జేఏసీ జిల్లా భాగస్వామ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అన్ని శాఖల ఉద్యోగులకు మహిళా ఉద్యోగ సోదరులందరికీ ఉద్యమాభివంధనాలు తెలియజేస్తూ. టి జి ఈ జేఏసీ రాష్ట్ర బాధ్యులు దామోదర్ రెడ్డి తెలిపినట్టు పైన తెలిపిన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని, దీనికి గాను ఉద్యోగులందరూ సమయత్తం కావాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమానికి వీరితోపాటు టీజీఈ జేఏసీ జిల్లా, కో చైర్మన్లు రమేష్, రమన్ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరినాథ్, వైస్ చైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్ ,అమృత్ కుమార్, ప్రశాంత్,మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పత్రి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా తిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాకూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈలు, ఎం.పీ.ఓ లు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో ఏయే ప్రాంతాలలో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలలోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులుఉంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని అన్నారు.
ఈ వేసవిలో జిల్లాల్లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎంపీడీఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకుని, పత్రి గ్రామంలో,మున్సిపల్ వార్డులలో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలాపర్యవేక్షణ చేయాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్ లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభం చేయించాలని, ఎంపీఓలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
వైట్ కాలర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి
అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి
*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై పత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అరెవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పత్యేక దృష్టిపెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పత్రి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై పత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి నియామకం
తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి నియామకం
*డైరెక్టర్ గా కాకతీయ రజనీకాంత్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కుడిన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరుపున ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటేడ్ కోటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ ప్రొపేస్తర్ అంజనేయులు, యూనివర్సిటీ పరిధిలోని ఒక విభాగం ప్రిన్సిపాల్ ను నామినేట్ చేయాల్సిన కోటా జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్ మెంట్ అసోసియేట్ ప్రొఫేసర్ డా.సుధాకర్ గౌడ్, అఫిలియేటెడ్ కాలేజ్ ల తరుపున ఒక ప్రిన్సిపాల్ గా గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. సంజీవ రావు, యూనివర్సిటీ పరిధిలోని ఓక కాలేజీ లెక్చరర్ గా గిరిరాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామిని, అప్లియేటేడ్ కాలేజీల నుంచి ఓక అధ్యాపకుడిగా ఇందూర్ పిజీ కాలేజ్ ఆప్ బిజినేస్ మెనేజ్ మెంట్ కాలేజీ ప్రో. మదన్ మోహన్ ను నామినేట్ చేశారు.
