Home Blog Page 195

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

0

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ  ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళ వాయిద్య పూర్వక గంగ సేకరణ, యాగశాల ప్రవేశం ,గణపతి గౌరీ పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, పంచచార్యా, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం వంటి కార్యక్రమాలను పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనీకిరెడ్డి సతీష్ మాట్లాడుతూ.. శనివారం రోజున విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో కనకిరెడ్డి సురేష్, సదానందం, సారయ్య, పరుశురాం, కిరణ్ ,సాయి రమణ, రాజ్ కుమార్ ,రాజయ్య, అనిల్, ప్రభాకర్ , కనకయ్య , మల్లమ్మ, వనజ, తిరుమల, కీర్తి, లావణ్య, రాధా .మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

0

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

చిత్రం న్యూస్, పెద్దాపురం:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్లాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి చెప్పారు. శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందని ప్రభుత్వం గుర్తించి ఆ వాహనాలను రద్దు చేయడం తో పాత విధానాన్ని పునరుద్ధరించారన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. వృద్దులు, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఎటూ కదలలేని వారికి ఆయా రేషన్ డిపో నిర్వాహకులు నేరుగా కార్డుదారుడి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా డీటీ వై. శ్రీనివాస్, ఎంఎస్ఓ కమల కుమారి, కార్యాలయ ఏవో పద్మ, డీలర్లు పాల్గొన్నారు.

0

అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, పెద్దాపురం:

రాణి అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు, మహారాణి అహల్యా భాయి హోల్కర్ యొక్క స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయంగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, లూతరన్ హై స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న  ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని, జాతీయ భావ ఐక్యతను పెంపొందించాలని బిజెపి పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్ కోరారు.

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

0

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

చిత్రం న్యూస్, ఓదెల:  పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ బోగే కనకమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ వార్డ్ మెంబర్లు పరామర్శించారు.

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి

0

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
*సహాయ కార్మిక అధికారి డి.రవీందర్

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపెల్లి జిల్లా మంథని పరిధిలో కొరియర్ హోమ్ సర్వీసెస్ ,ఫుడ్ డెలివరీ, ఏసి టెక్నీషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, వంటి విధులు చేసేవారు ఈ శ్రమ్ పోర్టల్ లో వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి డి. రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శక్తి అమెజాన్, ఫ్లిప్ కార్డ్, జోమాటో, స్విగ్గి వంటి సంస్థలో పనిచేసే వారిని కార్మికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 14434 కు ఫోన్ చేసి సందేహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.

తరోడ వాగులో గలంతైన దత్తు మృతదేహం లభ్యం

0

తరోడ వాగులో గల్లంతైన దత్తు మృతదేహం లభ్యం

చిత్రం న్యూస్, భోరజ్: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు భోరజ్ మండలం తరోడ వాగులో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా వాగు ఉధృతికి గల్లంతయిన విషయం విధితమే… పోలీసులు జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం పూసాయి వాగులో మృతదేహం లభ్యమయ్యింది.  మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

0

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

చిత్రం న్యూస్, కేశపట్నం
జర్నలిస్టు రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి అని శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరేం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలను బుధవారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి తహసిల్దార్ సురేఖ,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్, ఏఎస్ఐ సుధాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు రాములు, గట్టు తిరుపతి గౌడ్,గాండ్ల తిరుపతి,మోత్కూరి సమ్మయ్య, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొరిమి వెంకటస్వామి,,దేవునూరి రవీందర్,, బూర్ల వెంకటేష్, నేరెళ్ల సంతోష్, కొరిమి సంతోష్, కత్తెరమళ్ళ కిరణ్,చింతం వెంకటేష్, గొర్ల అనిల్, తాళ్లపల్లి సాగర్, ఎల్కపల్లి సుధీర్, సంపత్ రెడ్డి, రాకేష్, తుమ్మ సుధాకర్, సురేష్, ప్రణదీప్, రంజిత్, తిరుపతి, అనిత్, పెద్ది గట్టయ్య, నరేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

0

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: ఘనంగా "రాణి అహల్యా బాయి హోల్కర్" 300 జయంతి ఉత్సవాలు

కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయం లో కేంద్ర, రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు ” రాణి అహల్య భాయ్ హోల్కర్” 300 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ  కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు వల్లూరి బుల్లియ్య , కూనం శెట్టి అర్జునుడు, జనీ మోజెస్, తుమ్మల పల్లి శివ, చుక్క వెంకటరమణ, విజయలక్ష్మి, రఘు సాయి,. చిట్టిబాబు,, N. శ్రీను, S.వెంకటేశ్వరరావు పుప్పాల నాగ గోవిందు, సామర్లకోట టౌన్ బిజెపి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

0

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

*సైదాపూర్ మండల ఆటో కార్మికుల ఆవేదన

చిత్రం న్యూస్, సైదాపూర్:

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సైదాపూర్ మండల ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయలేకపోయిందని కార్మికులు ఆరోపించారు. ఈ వైఫల్యం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వారు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఆటో కార్మికులైన పొడిశెట్టి నరేష్, పిల్లి నరేష్, గడ్డం శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత బస్సు పథకం వంటి విధానాలతో తమ ఉపాధిని కోల్పోయేలా చేసిందని, హామీ ఇచ్చిన ఆర్థిక సాయం అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వాపోయారు. మా బతుకులు గాడినపడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి, హామీ ఇచ్చిన రూ.12,000 సాయాన్ని అందించాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల హామీలను నెరవేర్చి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆటో కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ఘనంగా కడప మహానాడు

0

ఘనంగా కడప మహానాడు
*టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు
*మహానాడులో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప


చిత్రం న్యూస్, పెద్దాపురం:
కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు మొదటిరోజు సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా ప్రతినిధుల నమోదు, ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మా తెలుగు తల్లి గీతాలాపన అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ప్రజాప్రతినిధులతో కలిసి సంతాపం ప్రకటించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగాపెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో కలిసితిలకించారు.