-Advertisement-

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

చిత్రం న్యూస్, సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి  దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు విశేషమైన “చందన ప్రసాదం” పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు తెలిపారు.

చందన ప్రసాదం విక్రయం  ఈ నెల 28 ఉదయం 8  గంటల నుండి దేవస్థానం ప్రసాద కౌంటర్ల వద్ద ప్రారంభమవుతుందన్నారు. ప్రతి చందన ప్రసాదం ప్యాకెట్ ధర రూ.10 మాత్రమే నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రతి భక్తుడికి ఒక్క టికెట్ (ఒక ప్యాకెట్) మాత్రమే జారీ చేస్తామని, ప్రసాదం పొందదలచిన భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (అసలు లేదా జిరాక్స్ ప్రతిని) వెంట తీసుకురావలసిందిగా సూచించారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments