భైంసాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసాలో డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన గొప్ప సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు. బైంసా పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులను త్వరలోనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించనున్నట్లు స్పష్టం చేశారు.




