-Advertisement-

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలలో భాగంగా శ్రీకాంత్ రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీకాంత్ రెడ్డి, పార్టీ పట్ల తన విధేయతకు దక్కిన గౌరవంగా దీనిని అభివర్ణించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఆదిలాబాద్ మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ నియామకంపై గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొనగా, అధిష్టానం శ్రీకాంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. జిల్లా రాజకీయాలలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments