మే 3న ‘నీట్’ పరీక్ష: ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వచ్చే నెల (మే 3, 2026) నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమన్వయ సమావేశంలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావుతో పాటు విద్యా, వైద్య, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

