ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఏ.జగదీశ్వర్ గౌడ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఏ. జగదీశ్వర్ గౌడ్ నియమితులయ్యారు. గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా అంతకుముందు జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ కమిషనర్గా సేవలందించిన ఆయనను, ప్రభుత్వం ఆదిలాబాద్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జగదీశ్వర్ గౌడ్ ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

