శనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ నాయకుల వినతి
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన శనగ కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం తహసీల్దార్ (MRO) కార్యాలయంలో RI ఉల్లాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు మాజీ మండల అధ్యక్షుడు సర్సన్ లింగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులుగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నిలిచిపోయిన శనగ సేకరణను వెంటనే ప్రారంభించలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే , కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, నాయకులు సోమ రాంరెడ్డి, గణేష్ యాదవ్, పూండ్రు వెంకట్ రెడ్డి ఇతర నాయకులు మ పాల్గొన్నారు.

