Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 96

జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి

0

జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి

*చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 

చిత్రం న్యూస్, చింతలపూడి: APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడిలో చింతలపూడి ఎంఎల్ఏ  సొంగా రోషన్ కుమార్ ని వారి కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు , జర్నలిస్టులకు పెన్షన్ ,  అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ, ప్రతినిధులకు ప్రాతినిధ్యం, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు, మీడియా అకాడమీ బలోపేతం చేయడం, ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం, ర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, భీమా సదుపాయం ఏర్పాటు , జర్నలిస్టులకు ఆరోగ్య భీమా, జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాట్ల తదితర అంశాలపై వినతి పత్రం  అందజేశారు. ఈ కార్యక్రమంలో APWJF ఏలూరు జిల్లా కోశాధికారి కె. నాగ చిన్నారావు, సంయుక్త కార్యదర్శి ఎం. రవి, కె. రజనీకాంత్, టి. సంజయ్, టి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు

0

ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు

*ఎమ్మెల్యే బడేటి చంటి

చిత్రం న్యూస్, ఏలూరు:రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, ప్రజాసంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వ పాలనకు గీటురాళ్ళని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయ్యింది. ఈ ఏడాదిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వచ్చామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని నందమూరి తారక రామారావు మున్సిపల్‌ పార్క్‌ వద్ద నిర్మించిన అభివృద్ధి ఫైలాన్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. సుమారు రూ. 12.45 కోట్ల రూపాయల భారీ నిధులతో 120 అభివృద్ధి పనులను అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇదేక్రమంలో రానున్న కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు…

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆత్రం సుగుణక్క 

0

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ

*సన్మానించిన మంత్రి సీతక్క

చిత్రం న్యూస్, ఉట్నూర్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ప్రజాభవనంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నూతనంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సుగుణను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్కను సుగుణ శాలువాతో సన్మానించారు.

ముగిసిన రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్

0

        చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

బహుమతులను ప్రదానం చేస్తున్న ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొనగా…. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ రెండు, మూడవ స్థానాలను సాధించాయి. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు. తెలంగాణా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బని రాష్ట్రపాల్ తో పాటు పలువురు క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు.

చదువుతోనే అభివృద్ధి సాధ్యం  -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

0

చదువుతోనే అభివృద్ధి సాధ్యం 

-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ 

*స్వయంగా అడవిలో 7 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం నడిపి ఆదివాసులకు అవగాహన కార్యక్రమం

*భీంపూర్ మండలం గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ లలో పోలీసు మీకోసం కార్యక్రమాలు.

*త్వరలోనే ఆదిలాబాద్ లో జాబ్ మేళా 

*నిరుద్యోగ యువత అగ్నివీర్ లో ఉద్యోగం సాధించి దేశ సేవ చేయాలని సూచన

*యువత క్రీడారంగంలో అభివృద్ధి చెందాలని స్పోర్ట్స్ కిట్స్ అందజేత

చిత్రం న్యూస్, భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజలలో మమేకమై ప్రజలకు అత్యంత చేరువై పోలీసు సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. భీంపూర్ మండలం లోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ లను సందర్శించి ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అడవిలో అత్యంత మారుమూల గ్రామం భగవాన్ పూర్ కు ద్విచక్ర వాహనం తో చేరుకొని యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని గ్రామస్ పేరును కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని తెలిపారు.

గ్రామాలలో  గంజాయిని పండించకూడదని, సేవించకూడదని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా గంజాయిని పండించిన వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వ పథకాలు రాకుండా జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేయబడుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని, ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించి వచ్చిన ప్రదేశంలో ఉద్యోగాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా యువత క్రీడారంగంలోనూ అభివృద్ధి చెందాలని నాలుగు గ్రామాలలో వాలీబాల్ కిట్లు క్రికెట్ కిట్లను అందజేసి క్రీడారంగం లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లలకు చదువు ఒక ప్రాధాన్యతను తెలియజేసి ప్రతి ఒక్కరూ చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. చదువు వల్ల భవిష్యత్తు మారుతుందని, ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు సాధించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మహారాష్ట్ర తో అనుసంధానంతో ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎలాంటి సమాచారం అయినా తన వద్ద ఉండే ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న 8712659973 అనే నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో షీ టీం బృందం మహిళలకు అండగా ఉందని, మహిళల వేధింపుల పట్ల కళాశాలలో పాఠశాలలో విద్యార్థినిలకు ఎలాంటి సమస్యలున్న షీ టీం బృందాలకు తెలియజేయాలన్నారు. షీ టీం నెంబర్ 8712659953 కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ డి సాయినాథ్, బీంపూర్ ఎస్సై పీర్ సింగ్ నాయక్, గ్రామ పెద్దలు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్

0

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్

*ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు పటేల్ ను సత్కరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

చిత్రం న్యూస్, ఉట్నూర్: హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కని మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తదితరులు ఉన్నారు.

ఘనంగా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాల తాళ్ళోత్సవం

0

ఘనంగా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాళ్ళతాళ్ళోత్సవం 

చిత్రం న్యూస్,పెద్దాపురం:

కాకినాడ జిల్లా మరిడమ్మ అమ్మవారి ఉయ్యాళ్ళతాళ్ళోత్సవం మంగళ వారం సాయంత్రం 4 గంటల నుండి పాత పెద్దాపురం కోటముందు వారిచే అత్యంత అంత వైభవముగా నిర్వహించారు. పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక , ఆలయ,అధికారులు , సిబ్బంది,భక్తులు, గ్రామస్తులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శంకరపట్నం మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.  

0

శంకరపట్నం మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, శంకరపట్నం: మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు  కాంగ్రెస్ పార్టీ మండలపరిషత్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి పి సి సి సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై కేకు కట్ చేసి స్వీటు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం 

0

మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం 

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం మరిడమ్మ అమ్మవారికి, పౌర్ణమి సందర్భముగా చండీ హోమం నిర్వహించారు. వేదపారాయణ దారులు పూజ, అర్చన కార్యక్రమాలు చేపట్టారు. పులిహోర ప్రసాద వితరణచేశారు కార్యక్రమంలో భక్తులు,మహిళలు పాల్గొనారు. మరిడమ్మ దేవస్థానంలో బుధవారం ఉదయం 9:00గం. లకు శ్రీ అమ్మవారి హుండీలను ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు,సిబ్బంది, గ్రామస్తులు, పోలీస్ వారి సమక్షంలో హుండీలను తెరుస్తారని సహాయకమీషనర్, కార్య నిర్వహణాధికారి కే.విజయలక్ష్మి తెలిపారు.

విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం

0

విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం పట్టణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దాపురం పట్టణ వాసి, వెలమ కుటుంబానికి చెందిన చీపురుపల్లి రాజు కుమారుడు తేజ ఎడ్యుకేషన్ కోసం పాలిటెక్నిక్ ఒక సంవత్సరం ఫీజు కొరకు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్ద్యార్థి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆపన్న హస్తం అందించారు. మంగళ వారం ఉదయం విద్యార్థి చీపురుపల్లి తేజ వీర వెంకట సాయి s/o చీపురుపల్లి రాజు పాలిటెక్నిక్ సంవత్సరం “పీజు కోసం” పెద్దాపురం పట్టణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పప్పల బుజ్జి ప్రధాన కార్యదర్శి యాళ్ళ వీరబాబు, కోశాధికారి అల్లు ప్రసాద్ చేతుల మీదుగా రూ.8 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి బాబురావు, వెలగల వెంకటరమణ, తైనాల శ్రీను, సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ.. బాగా చదువుకునే విద్యార్ధులు కొరకు సంఘంలో ఉన్న అందరి సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగు పడాలని ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.. ఎవరయినా చదువుకునే విద్యార్ధులు సహాయం కోసం తమని సంప్రదించవచ్చు అన్నారు.