Home Blog Page 94

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి

0

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి

*ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

*కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల)రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,  సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్,ఎంపీ మల్లు రవి కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు.  MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రెమిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. వరుసగా 85 ఎకరాలు, 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్)కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉంది. సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందని తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్షంగా 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కు ఏర్పాటు

తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. MSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వశాఖ సహకారంతో అమలు చేస్తోంది. వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర MSME మంత్రిత్వశాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

✖ Close హోం

ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు

ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని శంషాబాద్ గ్రామంలో బుధవారం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దర్నె జీవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 30 కుర్చీలను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్, నాయకులు దశరథ్ పటేల్, దత్తా నిక్కం, సందీప్ ఠాక్రే, బర్కడే రాము, ప్రదీప్ ఖోడే, పొత్ రాజ్ నవీన్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

జన్మదినం సందర్భంగా విద్యా సామాగ్రి పంపిణీ 

విద్యార్థులతో పడిగెల నాగరాజు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా  సొనాల మండల సామాజిక కార్యకర్త, నవ నిర్మాణ్ సొసైటీ సభ్యుడు పడిగెల నాగరాజు తన జన్మదినం సందర్భంగా గిరిజన గ్రామాలైన మహదుగూడ, పార్డి(కే) పాఠశాలలకు బోధన అభ్యసనకు ఉపయోగకరమైనటువంటి వివిధ రకాల చార్ట్స్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు బిస్కెట్ పాకెట్స్ ను పంచిపెట్టి వారి మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కచ్చకాయల హరీష్, జాదవ్ పవన్,కోరుట్ల నిఖిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆర్డీవో ను కలిసిన బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బొడ్డు గంగారెడ్డి 

ఆర్డీవో ను కలిసిన బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బొడ్డు గంగారెడ్డి 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ,నేరడిగొండ గ్రామాలలో వ్యవసాయదారులు పండించిన పంటలని కొనుగోలు చేయడం వీలుగా  సబ్ మార్కెట్ యార్డ్  కోసం స్థల సేకరణ చేసి ఇవ్వాలని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి  ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతిని కోరారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆమెను కలిసి విన్నవించారు. సబ్ మార్కెట్ ఏర్పాటైతే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారన్నారు. అనంతరం శాలువాతో సత్కరించారు.

 

✖ Close హోం

ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

*అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు

*భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ

*ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్ 

చిత్రం న్యూస్, భైంసా: ఆధార్ కార్డు అప్డేట్ లేదని ఫ్రీ టికెట్ ఇవ్వని విషయంలో అరగంట పాటు పంచాయతీ జరిగిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. భైంసా – నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 20 మంది మహిళలు ప్రయాణించగా, ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ అడిగిన మహిళలకు, ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందని, ఆ మహిళలకు కండక్టర్ టికెట్ ఇవ్వలేదు.

దీంతో భైంసా మండలం దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి కండక్టర్ తో మహిళను గొడవకు దిగారు. అరగంటసేపు బస్సు రోడ్డు మీద నిలిచి ఉన్నందున తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని మహిళలను బస్ లో  పంపించారు. గొడవ సద్దు మణిగింది.

✖ Close హోం

అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలను పూడ్చండి 

అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలను పూశ్చాలని ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు నుండి సొనాల మండల కేంద్రం మీదుగా మహారాష్ట్ర వైపుకు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై కనుగుట్ట సమీపంలో గల పెద్ద వాగు దగ్గర, కౌట, సాకేర గ్రామల సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పొచ్చర బంక్ నుండి కౌఠ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు బాగా పెరిగిపోయాయి.  వాటి వల్ల మలుపు వద్ద వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఈ అంతరాష్ట్ర మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు తమ రాకపోకలను కొనసాగిస్తుంటాయి. ఈ గుంతల కారణంగా ఇప్పటికే ఈ మార్గంలో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ మార్గంలో గుంతలతో పాటు రోడ్డు కి ఇరువైపుల పెరిగిన చెట్లు, ముళ్ల పొదలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పైకి వచ్చిన పొదల కారణంగా ముందర నుండి వచ్చే వాహనం కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలకు నెలవుగా మారిన గుంతలను పూడ్చివేయడంతో పాటు రోడ్డుకు అడ్డంగా వచ్చిన పొదలను తొలగించాలని కోరుతూ బుధవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ బోథ్ మండల చైర్మన్ పూండ్రు ఆదిత్య రెడ్డి, కన్వీనర్ గొడిసెల రమణ గౌడ్ లు ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రంను అందజేశారు.

✖ Close హోం

లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు

బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ప్రజలు

లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో గత రెండు సంవత్సరాల నుండి జొన్న, శనగలు ఇతర ధాన్యాలు టన్నుల కొద్ది నిల్వ ఉండడంతో లక్క పరుగుల బెడద తీవ్రమైంది. దీంతో మండల కేంద్రంలోని చుట్టుపక్కల కాలనీవాసులకు, గోదాం పక్కనే ఉన్న కేజీబీవీ పాఠశాలలో లక్కపురుగుల దాడికి జనాలు వణికిపోతున్నారు. ఇంటా బయట కుప్పలు తెప్పలుగా స్వైర విహారం చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 అయ్యిందంటే చాలు కిలో మీటర్ల దూరం వరకు లక్క పురుగులు పాకుతూ కాలనీలకు చేరుతున్నాయి.దీంతో జనాలు పడుకుందామంటే మంచం నిండా అవే పాకడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చిన్నారులు స్కిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. గత రెండు ఏండ్లుగా ఈ సమస్య ఉన్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో లక్క పురుగుల బెడద మరింత తీవ్రమౌతుంది. బుధవారం బేల మండల పోలీస్ స్టేషన్లో కాలనీవాసులు వచ్చి ఫిర్యాదు చేశారు వెంటనే గోదాం లో నిలువ ఉన్న ధాన్యాన్ని వేరే చోటకు తరలించి లక్క పురుగుల బెడదను అరికట్టాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా  మాజీ సర్పంచ్ మస్కే తేజరావు మాట్లాడుతూ.. చూడటానికి చిన్న సమస్య అనిపించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాయంత్రం ఐదు అయిందంటే ప్రతి ఒక్కరిపై ఒళ్లంతా ఈ పురుగులే కనిపిస్తాయని పేర్కొన్నారు. గోదాంలో నుంచి లక్క పురుగులు బయటకు వెళ్లకుండా నిబంధనలున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీటి సమస్య పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే కాలనీవాసులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు,నిరసనలు చేపడతామని మార్కెట్ అధికారులకు హెచ్చరించారు.

✖ Close హోం

డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు

అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

చిత్రం న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు  సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేశారు.  ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలేముద్దని తెలియజేశారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. గర్భిణీలు ప్రసవ సమయంలో సిజేరియన్ల వైపు వెళ్లకుండా సాధారణ కానుపు చేయించుకుంటే మంచిదని సూచించారు. ఆయా గ్రామాలలోని గర్భిణులకు శ్రీమంతాలు చేసి, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నరసవ్వ, పంచశీల, దేవలత, ఏఎన్ఎంలు జయ,రాజ కళ, ఆశ వర్కర్లు నర్మద, సంజన, గర్భిణీలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకలు

 ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకల్లో స్వర్ణకారులు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయ వృత్తితో జీవితం ఆరంభించి చిన్ననాటి నుంచి ఉద్యమ భావశీలి పొందిన ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకలు ఇచ్చోడ మండల కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలి ఉద్యమాలలో సిద్ధాంతకర్తగా ఉండి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చి తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ వివాహాన్ని చేసుకోకుండా ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్  కు హర్ష నివాళులును ప్రకటించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్  ఆశయాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారులందరూ అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు అందరూ ముందుకెళ్లి ఉద్యమాలలో ప్రజలకు సేవ చేస్తూ ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సభ్యులు సుదర్శన్, గణేష్, మారుతి రావు, గోపి, మల్లేష్, మహేందర్, సురేందర్ పాల్గొన్నారు.

✖ Close హోం

ధర్నాలో పాల్గొననున్న సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో  సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

చిత్రం న్యూస్, సొనాల:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో  బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు  తరలివెళ్లారు.  ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ నడిగడ్డ పైన జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొననున్నామని తెలిపారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు అనిల్, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరి పోతన్న, మాజీ సర్పంచ్ వినోద్  పాల్గొన్నారు.

✖ Close హోం