Home Blog Page 93

మత్స్యరంగం యువతకు ఉపాధి కల్పనలో కీలకం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

సాత్నాల ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల

చిత్రం న్యూస్, సాత్నాల: మత్స్య రంగం గ్రామీణ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించే రంగమని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సాత్నాల ప్రాజెక్టులో రూ.3 లక్షల విలువైన రొయ్య పిల్లల (రొయ్య సీడ్) విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రొయ్య పిల్లలను నీటిలోకి విడుదల చేసి, స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు.

సాంకేతికతతో మత్స్యాభివృద్ధి: ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో, మత్స్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా గ్రామీణ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేజ్ వీల్ (Cage Wheel) సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సాంకేతికతను సాత్నాల, మత్తడివాగు, పెండల్‌వాడ చెరువుల్లో అమలు చేసేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పెండల్‌వాడ చెరువు అభివృద్ధికి హామీ: పెండల్‌వాడ చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి అవసరమైన నిధుల మంజూరుకు తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిధులు సాధించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని, మత్స్యకారుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రాజెక్టులలో రొయ్య పిల్లల విడుదల కార్యక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని పాయల్ శంకర్ కోరారు. సకాలంలో వీటిని చేపట్టకపోతే మత్స్యకారుల జీవనాధారం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య రంగం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, డోకె సంతోష్, ముకుంద్, అస్తక్ సుభాష్, స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ 

0

చిత్రం న్యూస్, బేల:   మహిళల ఆత్మ గౌరవాన్ని చాటాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తి ద్వారా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ మహిళలకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ తో కలిసి శుక్రవారం ఈ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సామ  రూపేష్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అండగా  ఉంటుందన్నారు. మహిళా శక్తి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లోను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించి మరిన్ని సేవలందించేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు వినోద్, మంచికంటి సాయి, మంచికంటి ఉషన్న,సిద్రప్ సునిల్, గెడం సతీష్,రనీల్,బేల మండల యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,సుధాకర్,సునీల్ తదితరులు ఉన్నారు.

130 దేశీదారు బాటిల్స్ పట్టివేత

0

ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

చిత్రం న్యూస్, సొనాల:  సొనాల మండలంలోని సంపత్ నాయక్ తండా గ్రామంలో  దేశీదారు సీసాలను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ Md. జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ పూల్ సింగ్ , రాథోడ్ సంజు అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన దేశీదారు బాటిల్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఇద్దరు వ్యక్తుల దగ్గర మొత్తం 130 (90ml) బాటిల్స్ లభించాయి. ఈ దాడులలో ట్రైనీ సబ్ ఇన్ స్పెక్టర్ వి.శ్రీనివాస్, సిబ్బంది కార్తీక్ , సంధ్యారాణి, మయూరి, అరుణ, మంజుల పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా కలిగి ఉన్న, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామపంచాయతీ కోసం భూదానం చేసిన సర్పంచ్ అడప నవీన్ కుమార్

0

చిత్రం న్యూస్, బోథ్:బోథ్ మండలంలోని నక్కలవాడ గ్రామపంచాయతీ నూతన భవనానికి గ్రామ సర్పంచ్ అడప నవీన్ కుమార్ భూమిని విరాళంగా అందజేశారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డితో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ తన సొంత ఇంటి స్థలాన్ని గ్రామపంచాయతీ భవనానికి కేటాయించడం అభినందనీయమని, త్వరలోనే నక్కలవాడ గ్రామపంచాయతీ పరిధిలో గల రోడ్డు సమస్య, హై లెవెల్ వంతెన కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ భవనానికి తన సొంత స్థలాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చట్ల ఉమేష్, అందూర్ గ్రామ సర్పంచ్ పెందూర్ పృథ్వీరాజ్, మర్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ తలంపుల రమేష్, కుచలాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్రహార్, బోత్ మేజర్ గ్రామ మాజీ సర్పంచ్ మెరుగు నరసింహ దాసు, మహమ్మద్, అనిల్ అప్ప, అత్రం గంగారాం, గ్రామ పటేల్, ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

శిశుమందిర్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి బాసర జ్ఞాన సరస్వతి కుంకుమను ,అమ్మవారి ఫొ టోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి MD హుస్సేన్,  ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్.టి. వి. ప్రసాద్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలకలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ వసంత పంచమి విశిష్టతను, జ్ఞానం, సంగీతం, కళ అభ్యాసానికి స్వరూపమైన సరస్వతీ దేవిని ఆరాధిస్తామని, విద్యా ప్రయాణాన్ని ప్రారంభిస్తారని, వసంత పంచమి జ్ఞానం విలువను ,సృజనాత్మకతను స్వీకరించాలని ,ప్రకృతి సౌందర్యాన్ని అభినందించాలని తెలియజేస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త జక్కుల వెంకటేష్ ,పోషకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాసరలో భక్తునికి సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించిన హోంగార్డులు

0

ప్రాణాన్ని రక్షించిన హోం గార్డులను అభినదించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో విధులు నిర్భహిస్తున్న హోగార్డులు   ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి పలువురుకి ఆదర్శంగా నిలిచారు. వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి ఆలయ క్యూ లైన్‌లో నిలబడి ఉండగా, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన అక్కడ విధుల్లో ఉన్న హోమ్ గార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్, నారాయణలు గమనించివెంటనే అప్రమత్తమయ్యారు.తక్షణమే CPR (Cardio Pulmonary Resuscitation) నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. వారి సకాలిక చర్యల వల్ల భక్తుడి ప్రాణాలు నిలిచాయి. తర్వాత అతనిని తక్షణమే వైద్య సిబ్బందికి అప్పగించి, సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా హోంగార్డుల ధైర్యసాహసాలు, మానవీయత, బాధ్యతాయుతమైన విధుల నిర్వహణ ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అధికారులు, అభినందించారు.

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

0

వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు.  ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు. ఆలయంలో ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వసంత పంచమి పర్వదినానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేస్తామని వివరించారు. రూ.200 కోట్ల  నిధులతో, బాసర అభివృద్ధికై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారు. బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

బాసరలో కనులపండువగా వసంత పంచమి వేడుకలు

0
collector abhilasha abhinav
collector abhilasha abhinav

కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలో చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వసంత పంచమి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు, కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర,, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బేలలో అక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడండి..సర్పంచ్ భాగ్యలక్ష్మి

0

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓల్లఫ్ వార్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మొదటి సారి జరిగిన గ్రామ సభలో గ్రామస్థులు పలు సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. బేల గ్రామంలో ప్రభుత్వ స్థలాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించుకున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామంలో విచ్చలవిడిగా ఏర్పడిన బెల్టు షాప్ ల వల్ల యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రంథాలయంలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, యువతీ,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రోడ్లపైన తిరుగుతున్న పశువులను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామ సభలో సంబంధిత అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ సందర్బంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్థులు పలు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు.ప్రతి సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామ సభలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేలా చూస్తామన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను కూడా వెలికితిస్తామన్నారు.

ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం-ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

జీపీ బిల్డింగ్ కి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించడం జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ భవనాలు లేని పంచాయితీలకు నూతన భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పొలంబాట కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్లే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రూ.30 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలతో పంచాయితీ భవనాలు, రూ.30 లక్షలతో పొలం బాట మొత్తం రూ.50 లక్షలు మంజూరు చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నూతన సర్పంచులు సైతం పనులను త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.