Home Blog Page 92

చలో దిల్లీ విజయవంతం చేయండి-అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ 

0

 

చిత్రం న్యూస్, సాత్నాల: ఫిబ్రవరి 28న దిల్లీలో జరగనున్న లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని డా.బీ. ఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు, లంబాడాలు తరలివచ్చి విజయవంతం. చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:16 వ జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ వ్యసాయ పరిశోదన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.శ్రీధర్ చౌహన్ ఆధ్వర్యంలో ఆదివారం తమ సిబ్బందితో జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమన్నారు. ఓటు అందరి హక్కు. దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ఓటుతో అవినీతిని పారదోలే అవకాశం ఉంటుందని, ప్రశ్నించే అధికారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డా.కె.రాజశేఖర్, డా. మోహన్ దాస్, సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాస్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, టైమ్స్ స్కేల్ ఉగ్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

 

ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం – ఆడే గజేందర్

0

మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ సమక్షంలో భారీగా చేరికలు

చిత్రం న్యూస్, బోథ్: ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో 13వ వార్డు‌కు చెందిన సొలంకి సంతోష్, గిరిజబాయి, 14వ వార్డు‌కు చెందిన రాయల తిరుపతి, 16వ వార్డు‌కు చెందిన పద్మారావు, మాజీ వార్డు సభ్యులు సొలంకి తుకారాం, సిందేకర్ తాళ్ల శంకర్, మెర్గు శిందేకర్ నారాయణ, వెంకటరమణ, కొట్టూరి భాస్కర్, షేక్ నాజు తదితరులతో పాటు న్యూ కాలనీకి చెందిన దాదాపు 65 మంది వివిధ వర్గాల ప్రజలు, మాజీ వార్డు సభ్యులు, భారీ సంఖ్యలో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, మాజీ సర్పంచ్ నర్సింహ దాస్, ఆత్మ డైరెక్టర్ రహీం, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ మాల్యాల అంజయ్య, అందూర్ సర్పంచ్ పృథ్వి, మార్కెట్ డైరెక్టర్ అబుద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్, కాంగ్రెస్ నాయకులు ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి, ఉమేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పూజ బాపు దంపతులు ఆదివారం గృహప్రవేశం పూజా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతనితోపాటు భుక్తాపూర్ వార్డు కాంగ్రెస్ నాయకుడు రోహిత్ షిండే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  షేక్ అన్వర్, అంజాద్ ఖాన్, షేక్ రహీఫ్ అహ్మద్, షేక్ హైదర్ అహ్మద్, షేక్ అర్బజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

కొట్టాల పోచమ్మకు భక్తుల బోనాలు

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండల కేంద్రంలోని సినిమా టాకీస్ వద్ద కొట్టాల పోచమ్మ అమ్మవారికి ఆదివారం గ్రామస్తులు బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తూ మొక్కులు తీర్చుకున్నార. బోనాలు సమర్పించారు. సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు.

వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: మీరు బ్యాంక్ పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24 నుంచి జనవరి 27 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

సెలవుల వివరాలు ఇవే: జనవరి 24 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 25 (ఆదివారం): సాధారణ సెలవు దినం. 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా జాతీయ సెలవు. 27 (మంగళవారం) వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వరుస సెలవుల కారణంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కస్టమర్లు తమ అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు UPI సేవలను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 

0

చిత్రం న్యూస్, సాత్నాల: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాత్నాల మండలం మేడిగుడ (ఆర్ ) గ్రామంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ జాదవ్ రామారావు, గ్రామ సర్పంచ్ పర్చాకే లక్ష్మి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేపట్టారు. వయసు పైబడిన వారిని ఘనంగా సన్మానించారు.

క్రికెట్ ఆడి..పోటీ ప్రారంభించి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా  ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. అనంతరం సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. అంపైర్ గా న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయవాదులు రమణా రెడ్డి, దేవేందర్ సింగ్, కరుణాకర్, ముజాహిద్ హుస్సేన్ తదతరులు పాల్గొన్నారు.

 

మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ అంజనబాయి కిషన్

0

చిత్రం న్యూస్, సాత్నాల: మండలంలోని కాన్ఫ మేడిగూడ (కెనాల్) గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన అయ్యప్ప మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అంజనబాయి కిషన్ ప్రారంభించారు. ఆయన  మాట్లాడుతూ.. గ్రామస్తులు సీఎస్సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉప సర్పంచ్ మోటాపులకుల రవి, తుడం రమేష్, టీ.సుభాష్, యన్. నర్సింగ్, బి.వంశీ, బి.ఆకాష్, అడెల్లు తదితరులు పాల్గొన్నారు.

బాసర ఆలయంలో అలరించిన సంగీత కచేరి

0

*108 కళాకారులతో సామూహిక వీణ వాయిద్యం

*బాసర అమ్మవారికి “కళార్చన”

 చిత్రం న్యూస్, బాసర :భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోతరాజు జయలక్ష్మి త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాలలో ప్రముఖ వీణా అధ్యాపకురాలిగా సేవలందిస్తూ, తమ సంగీత సాధనతో అనేక మంది ప్రతిభావంతమైన శిష్యులను తీర్చిదిద్దారు. వీణా విద్యలో వారికి ఉన్న అపారమైన అనుభవం, నిబద్ధత, అంకితభావం వల్ల ఎంతో మంది శిష్యులు నేడు వీణా విద్వాంసులుగా ఎదిగి సంగీత లోకంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అటువంటి విశిష్ట కళాకారిణి అయిన జయలక్ష్మి ఎన్నో ప్రతిష్టాత్మక వీణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అనేక పురస్కారాలు, ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకున్నారు.  ఈ నేపథ్యంలో వసంత పంచమి సందర్భముగా  బాసర క్షేత్రంలో వారి శిష్యబృందం చేత అమ్మవారికి అంకితంగా “కచ్చపి అష్టోత్రర వీణా స్వరార్చన”ను ఇది భక్తి, సంగీతం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచే దివ్యమైన కార్యక్రమంగా ఒకేసారి సామూహికంగా 108 మంది కళాకారులు తమ వీణ వైద్యంతో  కళామ తల్లి శ్రీ జ్ఞాన సరస్వతికి కళశాల రూపంలో సమర్పించారు. కార్యక్రమాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అపూర్వమైన వీణానాదాన్ని ఆస్వాదించి భక్తులు చూస్తూ సాక్షాత్తు సరస్వతి దేవి వీణ వాయిస్తున్నట్టుగా అమ్మవారి రూపంలో కళాకారులు కనబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారిని అంజనీదేవి, ఏఈఓ సుదర్శన్ గౌడ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు