Home Blog Page 92

ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఎమ్మెల్యే రామారావు పటేల్ కు రాఖీ కడుతున్న సోదరి  శాంతాబాయి

చిత్రం న్యూస్, భైంసా: ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ నివాసం లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సోదరి శాంతాబాయి అన్నకు రాఖీ కట్టి ఆశీర్వచనాన్ని అందించారు. ఎమ్మెల్యే తో పాటు అతని ఇద్దరు సోదరులు భీమ్ రావ్ పటేల్, దత్తారం పటేల్, కుమారులు, కూతుళ్లు, మనుమలు, మనవరాలతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. అక్క తమ్ముడు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని, రక్త సంబంధాలు మరింత బలపడాలని, మన హిందూ సంప్రదాయంలో పండగలు ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

✖ Close హోం

ఘనంగా శ్రీ వేంకటేశ్వర ఆలయంలో అన్నదానం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్  మండలంలోని కూర గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం శ్రావణ నక్షత్రం, శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాదం {అన్నదానము } దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు

దాత కొంగల మల్లేష్ కుటుంబం  అన్నదానం చేశారు.  ప్రతి శనివారం అన్న ప్రసాదం ఉంటుందన్నారు. భజన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు ప్రధాన అర్చకులు గుడిపాటి  రామాంజనేయులు తెలిపారు.

✖ Close హోం

అనురాగ బంధాల‌ను పెంపొందించే పండగ రాఖీ_ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

0

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రాఖీ కడుతున్న మహిళలు

చిత్రం న్యూస్, శ్రీకాకుళం:  సోదరీ, సోదరుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలకు ప్ర‌తీక‌గా నిలిచే పండుగ రక్షా బంధన్ అని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగింటి ఆడపడచులందరికీ ఆయన రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సోద‌ర భావానికీ, స‌హోద‌ర త‌త్వానికీ సోద‌ర, సోద‌రీమ‌ణుల బంధానికీ తార్కాణంగా నిలుస్తోందని, జీవితాంతం ఒక సోద‌ర బంధం అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకునే పండగ అని అన్నారు. ర‌క్తం పంచుకున్న సోద‌రుల జీవితాల్లో విజ‌యాలు కలగాలని మహిళా మూర్తులందరు ఆకాంక్షిస్తారని, రక్షాబంధన్ పండగ మ‌న సంస్కృతీ,సంప్రదాయానికీ సంబంధిత ఔన్నత్యానికీ నిదర్శనమని తెలిపారు. మహిళా సాధికారత సాధించేందుకు, ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఇప్ప‌టికే స‌మ‌గ్ర చ‌ర్య‌లు తీసుకుందని, ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తోందన్నారు. సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల‌లో విస్తృత అవ‌కాశాలు క‌ల్పించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం దృఢ నిశ్చ‌యంతో ప‌నిచేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

✖ Close హోం

దన్నూర్(బి)లో సామూహిక రక్షాబంధన్

దన్నూర్(బి)లో సామూహిక రక్షాబంధన్ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు

చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ (బి) పద్మశాలి సంఘ భవనంలో సామూహిక రక్షాబంధన్ నిర్వహించారు. కుల దైవము శ్రీ భక్త మార్కండేయ చిత్రపటానికి పూజలు నిర్వహించి సామూహికంగా పద్మశాలి కుల బాంధవులు రక్షాబంధన్ కట్టుకున్నారు. కార్యక్రమంలో బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆసాల సదాశివ్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, శంకర్, రాజేశ్వర్, నారాయణ, ఎర్రన్న, శ్రీనివాస్, సురేష్, రమేష్, గంగారాం, రాంబత్తుల రాజేశ్వర్, లక్ష్మణ్, కుల బాంధవులు పాల్గొన్నారు.

✖ Close హోం

బీజేపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన హర్ ఘర్ తిరంగా

బీజేపి ఆధ్వర్యంలో  ఇంటింటికీ జెండాలను పంపిణీ చేస్తున్న నాయకులు

చిత్రం న్యూస్, సాత్నాల:  బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్ ఘర్  తిరంగా (ఇంటింటా జాతీయ జెండా) కార్యక్రమం నాయకులు నిర్వహించారు. సాత్నాల మండలంలోని మేడిగూడ (R), మేడిగూడ (C) గ్రామాలలోని ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని అందించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వివరించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేసి మన దేశభక్తి చాటాలని గ్రామస్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్,  పీసీఎస్ వైస్ ఛైర్మెన్ రోహిదాస్, శక్తికమిటి అధ్యక్షులు డోకే సంతోష్, నాయకులు పోతరాజు రమేష్, లింగారెడ్డి, పంద్ర రాము, తారు, అడేళ్లు, మాధవ్, దినేష్ ,రవి, బాలు, సంతోష్, సుధాకర్, సురేష్ , బూత్ కమిటీ అధ్యక్షులు పలువురు బీజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.

✖ Close హోం

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సాయినాథ్ 

రక్తదానం చేస్తున్న సాయినాథ్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హల్ద గ్రామానికి చెందిన సాయినాథ్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. భైంసా సాయి సుప్రియ  హాస్పిటల్ లో శశికళ అనే మహిళ పేషంట్ కు B+ రక్తం అవసరం ఉందని తెలుసుకున్న వెంటనే, రక్తదానం చేయడానికి సాయినాథ్ ముందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ..రక్తదానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు, ఇలాంటి సంఘటనలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయి.ఇది సామాజిక బాధ్యతను, మానవత్వాన్ని చాటిచెప్పే ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నారు.

✖ Close హోం

మూడున్న‌రేళ్లుగా కొన‌సాగుతున్న నిత్యాన్న‌దానం 

0

స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తున్న కంది శ్రీ‌నివాస రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో గ‌త మూడున్న‌రేళ్ళుగా నిరంత‌రాయంగా కొన సాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి శుక్ర‌వారం సంద‌ర్శించారు. కేంద్రానికి ఆక‌లి తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన అంద‌రికి న‌మ‌స్క‌రిస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నారంటూ వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజ‌నం, తాగునీటి సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. వ‌చ్చిన వారికి ఆయ‌న స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తూ క‌డుపు నిండా భోజ‌నం చేయాల‌ని కోరారు.చిన్నారుల‌కు త‌న చేత్తో క‌లిపి తినిపించారు. కంది శ్రీ‌నివాస రెడ్డి చేస్తున్న నిత్యాన్న దానంతో పాటు సామాజిక సేవ‌ల‌ను అంద‌రు ప్ర‌శంసించారు.పేద‌ల ఆక‌లి తీర్చ‌డం భ‌గ‌వంతుడు త‌న‌కు క‌ల్పించిన అదృష్ట‌మ‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.త‌రుచుగా వ‌చ్చేవారితో పాటు ఆదిలాబాద్ కు చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు ఏ ప‌ని మీద వ‌చ్చినా మ‌ధ్యాహ్నం వేళ అన్న‌దాన కేంద్రంలో భోజ‌నం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. తాను గెలిచినా ఓడినా నిత్యాన్నదానం మాత్రం కొన‌సాగుతుంద‌న్నారు.

✖ Close హోం

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

*మృతుడు భైంసా మండలం పెండ్ పెల్లి వాసి

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా భైంసా_నిర్మల్ ప్రధాన రహదారి మార్గంలో మాటేగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెండ్ పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ (25) కుంసర గ్రామానికి చెందిన విలాస్ మిత్రులైన వీరిరువురు భైంసా నుంచి పెండ్ పెల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వీరిద్దరు మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న యశ్వంత్, విలాస్ లు తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనా స్థలి నుంచి క్షతగాత్రులను భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా అపస్మారక స్థితికి చేరుకున్న యశ్వంత్ మార్గమధ్యలోనే మృతి చెందారు. భైంసా రూరల్ ఎస్ఐ శంకర్ ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

✖ Close హోం

కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక

 బీజేపీలో చేరుతున్న నిర్మల్ రూరల్  మండలం  కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కండువా కప్పుతున్నబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

చిత్రం న్యూస్ నిర్మల్: నిర్మల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొండా శ్రీనివాస్ నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లడుతూ.. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన పట్ల ఆకర్షితులై అనేకమంది బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, జమాల్, సరికెల గంగన్న, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు పీ. నర్సారెడ్డి, నర్సారెడ్డి, భూపతి రెడ్డి, జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

✖ Close హోం

ఆర్మీ జవాన్ కి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

ఆర్మీ జవాన్ మహేందర్ కు ఘన స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భాది గ్రామానికి చెందిన ఆకుల మహేందర్ దేశ సరిహద్దులను కాపాడే వీర సైనికుడిగా విశేష సేవలందించి పదవీ విరమణ చేశారు. గురువారం తన సొంత గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పూలదండ వేసి శాలువాలతో సత్కరించారు. జవాన్ మహేందర్ మాట్లాడుతూ..ఇన్ని రోజులు దేశానికి సేవ చేయడం తనకు చాల సంతోషం ఇచ్చిందని, ప్రతి ఒక్కరు దేశ పౌరులుగా దేశభక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. యువత ఆర్మీలో చేరాలని పిలుపునిచ్చారు.

✖ Close హోం