Home Blog Page 91

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు నగదు

0

 రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్,పెద్దాపురం:  కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద  రైతుల ఖాతాల్లో  రూ.7వేలు జమ చేసింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో  రైతులు వారి ఆనందాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా రైతులందరూ కలిసి ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు.  ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె మంగ లక్ష్మి రామారావు , నియోజకవర్గ అబ్జర్వర్ బోళ్ల వెంకటరమణ ,యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్,   పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట మండలం టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, పెద్దాపురం మండలం అధ్యక్షులు మొగుళ్ళ కృష్ణమూర్తి, సామర్లకోట పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, పాలకుర్తి శీను బాబు, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ కంటే బాబు, పెద్దాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి

0

మాట్లాడుతున్న ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ : ఈ డబ్ల్యూ ఎస్ ను అన్ని రంగాల్లో అమలు చేయాలని ఓసి సంక్షేమ సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు.  ప్రభుత్వాలు మారిన  అగ్రవర్ణ పేదల బతుకులు మారలేదన్నారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలన్నారు. ఈ రోజుల్లో  అగ్రవర్ణాల ప్రజలకి అడుగడుగున అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. రిజర్వేషన్ లేక ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువతీ, యువకులు బతుకులు ఆగం అవుతున్నాయాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్ల్యూఎస్ ను  కూడా రాష్ట్రం లో పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్ పాటించటం లేదన్నారు. కింది స్థాయిలో కూడా ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతున్నదన్నారు.  ఈ కార్యక్రమంలో ఓసి సంఘం నాయకులు, బ్రాహ్మణ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్ కొలవి అనిల్ కుమార్, అశోక్, కోవూరి జగన్, ఆర్ యుగంధర్, జోషి క్రాంతి కుమార్ లు పాల్గొన్నారు.

✖ Close హోం

రైతు భీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి

0

 రైతు భీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి

చిత్రం న్యూస్, భైంసా: 2025–26 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతు బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల మునుపటి డేటాను ఈ నెల 12లోపు అధికారులు పునరుద్ధరిస్తారని, కొత్త నమోదు గడువు 13తో ముగుస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి, గడువులోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్  పేర్కొన్నారు.

✖ Close హోం

అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి అన్న భాహు సాఠే

సౌన గ్రామంలో అన్న భాహు సాఠే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న  నాయకులు, గ్రామస్తులు

చిత్రం న్యూస్ భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్  మండలంలో అన్న భాహు సాఠే 105 వ జయంతి మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు గాయక్వాడ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్న బాహు సాఠే ఒక అణగారిన వర్గంలో జన్మించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి, పోరాడుతు అనేక రచనలు చేసిన కవి అని గుర్తు చేశారు. ప్రపంచంలో తనదైనా శైలిలో ప్రసంఘాలు ఇచ్చి రష్యా, ఇటలీ, ఇంగ్లాండ్, లాంటి దేశంలో గుర్తింపు తెచ్చుకున్న, ముంబై కోసం గుజరాత్ ప్రభుత్వంతో పోరాడిన సామాజిక వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసి డాక్టర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి అన్న భాహు సాఠే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్తాపకులు నామత్కర్ దిగంబర్ ఎమ్మార్పీఎస్, జిల్లా నాయకులు షెల్కె ఆనంద్, బాబు సర్పంచ్, గణపతి సర్పంచ్, విట్టల్ పటేల్, శ్యామరావు పటేల్, మాదిగ సమాజం పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి

సాత్నాలలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, సాత్నాల: ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం సాత్నాల మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.

అనంతరం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..బీజేపీ కార్యకర్తలకు వేదికగా నూతనంగా ఏర్పడిన మండలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఆదరించారో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని ఆదరించాలని కోరారు. కార్యకర్తలు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, బోరజ్ మండల అధ్యక్షుడు గాజుల సన్నీ,  ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అస్తక్ సుభాష్, పెరుక సంఘం జిల్లా అధ్యక్షుడు దోడ అశోక్, నాయకులు రమేష్, ఆనంద్, సురేష్, పంద్ర రాము, రాథోడ్ రోహిదాస్, కుంచాల మహేందర్, సంతోష్, తిరుపతి, రేణుక బాయి, అంబరావ్, వెంకటి, రాము, సంతోష్, వసంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

✖ Close హోం

బాధిత పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న 

బాధిత  కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన అరవింద్ దోహర్కర్ తండ్రి, సిర్సన్న గ్రామానికి చెందిన గోదూరి నర్సన్న  కుమారుడు ఇటీవల మరణించడంతో వారి కుటుంబీకులను మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం  పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కల్లెం ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లఫ్ వార్ దేవన్న, మస్కే తేజరావు,సతీష్ పవార్,తన్వీర్ ఖాన్, విపిన్ ఖోడే, దీపక్ గౌడ్, సురేష్ రెడ్డి, రూపేష్ ఊరడే, రాము, వికాస్, టి.పురుషోత్తం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి –  అప్పాల ప్రసాద్ జీ

0

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి _అప్పాల ప్రసాద్ జీ

*జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ జీ

చిత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కొమురం భీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సభ నిర్వహించి ఆదివాసీ ఆడబిడ్డలతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ..అమెరికా, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, కెనడా దేశాలలో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న సుమారు 7 లక్షల 50వేల మంది ఆదివాసీ ప్రజలను విష ప్రయోగాలతో సామూహిక మారణకాండ జరిపి హత్య చేశారని, మిగతా అనేక పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి పేరిట ఆదివాసీలపై మారణకాండ జరిపారన్నారు. ఆదివాసీలను కేవలం రెండవ తరగతి ప్రజలుగా చూశారని, ఇలాంటి దుశ్చర్యలపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆదివాసీలు చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. ఆదివాసీ దినోత్సవం అంటే కేవలం ఆదివాసీలు జరుపుకునే పండగ కాదని ,ఆదివాసీలు ఇచ్చినటువంటి సంస్కృతి, ఇచ్చినటువంటి అడువులు, స్వచ్ఛమైన నీరు అనుభవిస్తున్న ప్రజలందరూ జరుపుకోవాల్సిన పండగ అని అన్నారు. జల్ జంగల్ జమీన్ ఇది రాజకీయ నినాదం కాదని ఎక్కడైతే భూమి పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే అడవి శాతం ఎక్కువగా ఉంటుందో. ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ నివసించే ప్రజలు మరియు పశుపక్ష్యాదులు సుభిక్షంగా ఉంటాయని ప్రపంచానికి చాటిచెప్పిన వారు ఆదివాసీ బిడ్డలు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి గ్రామపంచాయతీలో  పీసా చట్టం అమలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీలు అంటే గవర్నమెంట్ ఆఫీసులో ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్లో, ఎక్కడ కూడా విలువ ఇవ్వడం లేదు వారికి గౌరవం కల్పించేలా ప్రభుత్వం చొర చూపాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఐటీడీఏ నుండి వచ్చే పథకాలు ఏమేమిటో ఆదివాసీలకు తెలియటం లేదు. కాబట్టి పథకాలపై వారికి అవగాహన కల్పించాలని అలాగే పోడు భూములలో ప్రభుత్వ నుండి బోర్లు వెయ్యాలి అని కోరారు. ఆదివాసీ ఇలవేల్పుల జాతర్ల అప్పుడు జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే జాతరకయ్యే ఖర్చులు భరించాలన్నారు.
ప్రతి ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమ అనంతరం వివిధ గ్రామ పెద్దలకు , ఆదివాసీ పూజారులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తెల్లం నరసింహ రావు, ఎదలపల్లి వీరభద్రం, మాజీ ఎంపీపీ పోడం సీత, సోడే శ్రీరాములు, సిద్ధబోయిన రామ్మూర్తి, కాలం నరసింహా రావు, సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు

జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు

*యువత కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో ముందుకు సాగాలి

*యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్

చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా, సమ సమాజ స్థాపనకు నిత్యం కృషి చేసిన సమత మరియు ఐక్యత మూర్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి యువజన కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..మన దేశంలోనే యువత నాయకత్వం వహిస్తున్న, అత్యంత బలమైన ఆర్గనైజేషన్ గా యువజన కాంగ్రెస్ ముందు వరుసలో ఉందనీ, యూత్ కాంగ్రెస్ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా సబ్బండ వర్గాల యువత దేశం నలుమూలల నుండి కోట్లాదిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో భాగస్వాములు కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, యువజన కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషించిందని కొనియాడారు. యువజన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిదని యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందని, ఈ దేశ దశ దిశను మార్చేది యువతే నన్న గట్టి సంకల్పంతో యువతలో ఉత్సాహాన్ని నింపుతూ, యువతలో మరింత రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ  ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలందరి ఆశీర్వాదాలతో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్యా నవీన్, పర్లపెల్లి నాగరాజు, జిల్లా కార్యదర్శి సజ్జు, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ పింగిలి రాకేష్, హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి రోమాల రాజ్ కుమార్, జమ్మికుంట మండలం ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి వెంకటేష్, యువజన నాయకులు పాతకాల ప్రవీణ్, సురేష్, జావిద్, సతీష్, బషీర్, వెంకటేష్, అశోక్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

వాలేగాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో నాయకులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి, ఆదివాసీల ముద్దుబిడ్డలైన కొమురం భీం, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీల హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రవి, ఎంఈవో సుభాష్, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఎమ్మెల్యే రామారావు పటేల్ కు రాఖీ కడుతున్న సోదరి  శాంతాబాయి

చిత్రం న్యూస్, భైంసా: ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ నివాసం లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సోదరి శాంతాబాయి అన్నకు రాఖీ కట్టి ఆశీర్వచనాన్ని అందించారు. ఎమ్మెల్యే తో పాటు అతని ఇద్దరు సోదరులు భీమ్ రావ్ పటేల్, దత్తారం పటేల్, కుమారులు, కూతుళ్లు, మనుమలు, మనవరాలతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. అక్క తమ్ముడు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని, రక్త సంబంధాలు మరింత బలపడాలని, మన హిందూ సంప్రదాయంలో పండగలు ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

✖ Close హోం