Home Blog Page 90

మున్సిపల్ కౌన్సిలర్ కు నామినేషన్ దాఖలు చేసిన అబ్రర్ అలీ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అన్సారీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్సార్ సోదరుడు అబ్రర్ అలీ శుక్రవారం  నామినేషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున 34 వార్డ్ శాంతినగర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ డెయిరీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  అన్సారీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆన్సర్ తన చేతుల మీదుగా నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో” పుడమి తల్లి”గా వృక్షానికి పట్టాభిషేకం

0

చిత్రం న్యూస్,ఇచ్చోడ: గ్రామ పొలిమేరల నుండి పట్టణ వీధుల వరకు పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా “కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్” మరియు “కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్” సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన ఒక మహా వృక్షాన్ని “పుడమి తల్లి”గా నామకరణం చేస్తూ, దానిని తమ ‘తల్లి వృక్షం’గా భావించి సంరక్షిస్తామని విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించడం, వృక్షాలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. పల్లె నుండి పట్టణం దాకా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి విద్యార్థి ఒక హరిత సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ కోఆర్డినేటర్ వి.మధు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సరస్వతి విద్యార్థులకు జీవవైవిధ్యం (Biodiversity) యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడుకోవడం ద్వారానే రేపటి తరానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని వారు స్పష్టం చేశారు. వృక్షానికి హారతి ఇచ్చి, పర్యావరణ ప్రతిజ్ఞ చేయడంతో కళాశాల ప్రాంగణమంతా నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతామని ప్రతినబూనారు.

గుబిడిలో భజన పోటీల కరపత్రాల విడుదల

0

చిత్రం న్యూస్, భీంపూర్:భీంపూర్ మండలం గుబిడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం, శబరిమాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భజన పోటీల కరపత్రాలను గ్రామ పెద్దలు విడుదల చేశారు. ఈ పోటీలను ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 06:25 నుండి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీ వివరాలు: ప్రథమ బహుమతి: రూ.15,111 (కీ॥శే॥ శ్రీ బొలిపెల్లి సంతోష్ యాదవ్ గారి స్మారకార్థం), ద్వితీయ బహుమతి: రూ.11 వేలు (కీ॥శే॥ శ్రీమతి అన్నం మల్లుబాయి రాములు గారి స్మారకార్థం), తృతీయ బహుమతి: రూ.7 వేలు ( మేకల ప్రవీణ్ యాదవ్, గుబిడి గ్రామ సర్పంచ్), నాల్గవ బహుమతి: రూ. 5 వేలు (కీ॥శే॥ తూడి చిన్నయ్య స్మారకార్థం), అయిదో బహుమతి: రూ. 3 వేలు ( గేడం పురుషోత్తం), ఉత్తమ గాయకుడు, ఉత్తమ హార్మోనియం కళాకారుడు, ఉత్తమ తబలా కళాకారుడు: రూ. వేయి చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

నియమ నిబంధనలు: ప్రతి భజన మండలిలో ఏడుగురు (7) సభ్యులు ఉండాలి. భజన పాటలు చూసి పాడకూడదు, ప్రతి పాటకు అంకితం రావాలి. ప్రదర్శించే భజన బృందమునకు 30 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. బృందంలో పాడే ప్రతి పాట యొక్క కాపీని న్యాయ నిర్ణేతలకు ప్రదర్శనకు ముందుగా ఇవ్వాలి. భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాళాలు) ఎవరికి వారే వెంట తెచ్చుకోవాli తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కలదని నిర్వాహకులు తెలిపారు.

సంప్రదించవలసిన నెంబర్లు: తూడి రాకేష్ యాదవ్: 9989541931, అంగ గణేష్ యాదవ్: 9110323148

బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

0

చిత్రం న్యూస్ జైనథ్: జైనథ్ మండలం బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం గ్రామంలో  శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, ఉపసర్పంచ్‌ కడే రవి, వార్డు సభ్యులు, తహసీల్దార్‌ నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి పూజ, జీపీవో సురేష్, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు రాంరెడ్డి,బాజీరావ్ చంద్రకాంత్ రెడ్డి, దత్తు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న 5 టిప్పర్ లు సీజ్

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని డేరాగ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో  మొరం తరలిస్తున్న. 5టిప్పర్లను పట్టుకున్నట్లు బోథ్ ఎస్సై వి.పురుషోత్తం తెలిపారు. తమ సిబ్బంది సాయి కృష్ణ, శ్రీకాంత్, సుధాకర్ లతో కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేసి పట్టుకకొని పోలీస్ స్టేషన్ తరలించామన్నారు. 5 టిప్పర్ల పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.  అనుమతులు లేకుండా మొరం, ఇసుక  తరలిస్తే చట్టరిత్యాచర్య తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.

ఆధార్ సేవల్లో విప్లవం:  ఆధార్ మొబైల్ యాప్ విడుదల!

0
aadhaar
aadhaar

చిత్రం న్యూస్, న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆధార్ సేవల కోసం ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పూర్తి స్థాయిలో ఆధునీకరించిన కొత్త ‘ఆధార్’ (Aadhaar) మొబైల్ యాప్‌ను బుధవారం (జనవరి 28) నాడు విడుదల చేసింది. ఢిల్లీలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు.

ముఖ్య ఫీచర్లు ఇవే:

మొబైల్ నంబర్ అప్‌డేట్: గత పదేళ్లుగా మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

అడ్రస్ మార్పు: చిరునామా మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, ఫేస్ అథెంటికేషన్ (Face Authentication) ద్వారా నేరుగా ఫోన్ నుంచే మార్చుకునే వెసులుబాటు కల్పించారు.

డిజిటల్ ప్రొఫైల్స్: ఒకే యాప్‌లో కుటుంబంలోని ఐదుగురు సభ్యుల ఆధార్ ప్రొఫైల్‌లను సేవ్ చేసుకోవచ్చు.

ప్రైవసీ అండ్ సెక్యూరిటీ: మీ ఆధార్ నంబర్ లేదా పూర్తి వివరాలు బయటకు తెలియకుండా ఉండేలా ‘మాస్క్డ్ ఆధార్’ మరియు సెలెక్టివ్ డేటా షేరింగ్ ఆప్షన్లను ఇందులో చేర్చారు.

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్: ఇంటర్నెట్ లేకపోయినా QR కోడ్ ద్వారా గుర్తింపును వెరిఫై చేసుకోవచ్చు.

ఎక్కడ లభిస్తుంది: ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store) మరియు iOS (Apple App Store) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. పాత ‘mAadhaar’ యాప్‌ స్థానంలో ఈ సరికొత్త వెర్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా భౌతిక ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు.

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన బోథ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని బోథ్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేద మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళా సాధికారతే లక్ష్యాంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బోథ్ ,మాజీ ఎంపీటీసీ చాట్ల ఉమేష్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, ఏపీఎం గంగాధర్, సీసీ సర్వేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానం

0
Gajula pradyumna
Gajula pradyumna

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో సీఎం కప్ మండల స్థాయి పోటీలు ముగింపుకు చేరుకున్నాయి. గురువారం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ), తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణురెడ్డి హాజరయ్యారు. వివిధ క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు.

 

తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

0
Model school
Model school

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో కొత్త ప్రవేశాలకు, అలాగే 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు షెడ్యూల్ విడుదలైంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడం ఈ పాఠశాలల లక్ష్యం.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 జనవరి 28

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 2026 ఏప్రిల్ 9 నుండి

ప్రవేశ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్ 19 (ఆదివారం)

దరఖాస్తు రుసుము: ఓపెన్ కేటగిరీ (OC) విద్యార్థులకు: ₹200/-

BC, SC, ST, PwD, EWS విద్యార్థులకు: ₹125/-

పరీక్ష వివరాలు: పరీక్ష ఆయా మండలాల్లోని మోడల్ స్కూల్స్/నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించబడుతుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు జరుగుతుంది.7 నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgms.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

0

చిత్రం న్యూస్,బోథ్: తెలంగాణ మోడల్ స్కూల్ లో రోడ్డు భద్రత పై వ్యాసరచన పోటీలను బుధవారం బోథ్ పోలీసులు నిర్వహించారు. గెలిపొందిన ముగ్గురు విజేతలకు బోథ్ si పురుషోత్తం, స్కూల్ హెడ్ మాస్టర్ అనురాధ బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ..రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది మన్, రంజిత్ పాల్గొన్నారు.