Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 89

ఉపాధ్యాయుడు మనోజ్ కు ఘన సన్మానం

0

ఉపాధ్యాయుడు మనోజ్ కు ఘన సన్మానం

చిత్రం న్యూస్,బేల: బేల ఉన్నత పాఠశాలలో మరాఠీ సైన్స్ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన మనోజ్ చంద్రసేన్ కు ఆ పాఠశాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. మండల విద్యాధికారి కోలా నరసింహులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్,  ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూగ శ్రీనివాస్,జాదవ్ అశోక్, మాజీ సర్పంచ్ మస్కే తేజరావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై ఆయనను ఘనంగా సన్మానించారు.

28 ఏళ్ళ తన సర్వీస్ లో అంకితభావంతో పనిచేస్తూ ఎందరో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది అందరి మన్ననలను పొందారని వక్తలు కొనియాడారు.

పంబాల కులస్తులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

0

పంబాల కులస్తులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

చిత్రం న్యూస్,శంకరపట్నం: పంబాల కులస్తులకు తహసీల్దార్ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర పంబాల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ జైలర్ కొరిమి నరసింహస్వామి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమొరాండం అందజేశారు.  ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్టిఫికెట్లు ఇంతవరకు పంబాల కులస్తులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో షెడ్యూల్ క్యాస్ట్ ను ఏ, బీ,సీ లుగా తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  కుల సర్టిఫికెట్లు కావాలని తహసీల్దార్ వద్దకు వెళ్లామని, సదరు అధికారి మా పరిధిలో లేదని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ధ్రువీకరణ పత్రం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని నరసింహస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పంబాల కులస్తులకు తహసీల్దార్ ద్వారా కుల, ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గొట్టే అంజయ్య, రౌతుఅభిలాష, కోరమి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం.

0

అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం

*పుస్తకాలు,యూనిఫామ్ పాఠశాలలోనే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి 

చిత్రం న్యూస్ జమ్మికుంట: జమ్మికుంటలోని ప్రైవేట్ స్కూల్స్ లో పుస్తకాలు, యూనిఫామ్ పాఠశాలలో కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ విద్యను వ్యాపారం చేసి బుక్స్ యూనిఫార్మ్స్ అటువంటి పాఠశాలలో తీసుకోవాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా అన్యాయంఅని తెలిపారు. అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై  భారం పడుతుందన్నారు. దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

0

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

*7 గురు అరెస్ట్, రూ.9,600 నగదు స్వాధీనం

చిత్రం న్యూస్, పెద్దాపురం:కాకినాడ జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో మండలంలోని వాలు తిమ్మాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై  ఎస్ఐ మౌనిక తన సిబ్బంది తో కలిసి దాడి చేసి, ఏడుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9,600/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

బంజారా సేవా సంఘం మాచారెడ్డి మండల కమిటీ ఎన్నిక

0

బంజారా సేవా సంఘం మాచారెడ్డి మండల కమిటీ ఎన్నిక

-మాచారెడ్డి మండల ఉపాధ్యక్షుడిగా భూక్య పుల్ సింగ్ నాయక్

-జాయింట్ సెక్రటరీగా భూక్య రవినాయక్

చిత్రం న్యూస్ జమ్మికుంట:ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు… మాచారెడ్డి మండల ఉపాధ్యక్షుడిగా భూక్య ఫుల్ సింగ్ నాయక్జాయింట్ సెక్రటరీగా భూక్య రవి నాయక్ ఎన్నికయ్యారు. ఎన్నికైన బంజారా నాయకులను ఆదివారం తమ మిత్రబృందం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ బంజారాల హక్కుల కోసం పోరాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్టుతో వీరికి కావలసిన పథకాలను అందించడానికి ప్రయత్నం చేస్తామని బంజారాల కావలసిన వసతులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో బంజారాల అభివృద్ధికి తోడ్పడుదామని ఈ సందర్భంగా తెలిపారు.

నూతన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి

0

నూతన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి

*బీజేపీ బేల మండల 

అధ్యక్షుడు ఇంద్రశేఖర్ డిమాండ్

చిత్రం న్యూస్ బేల: బేల మండల కేంద్రంలో నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పీహెచ్సీ ఆసుపత్రి కట్టించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. ఆస్పత్రిని వెంటనే ప్రారంభించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. పేద ప్రజలకు మెరుగైన ఉద్యమం అందించడానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బర్కాడే రాము,మాజీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం,జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే,మాజీ సర్పంచ్ రాకేష్,దర్నె జీవన్,గంగాధర్, నార్లవర్ అజయ్,తదితరులు పాల్గొన్నారు

విద్యార్థుల అకౌంట్లోకి రీయింబర్స్మెంట్ ఫీ, స్కాలర్షిప్ డబ్బులు

0

 

విద్యార్థుల అకౌంట్లోకి రీయింబర్స్మెంట్ ఫీ, స్కాలర్షిప్ డబ్బులు

చిత్రం న్యూస్ బేల:2024 -25 విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల కాలేజీ రీఎంబెర్స్మెంట్ ఫీ, స్కాలర్ షిప్ డబ్బులు రెండు కూడా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయని కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావు తెలిపారు. కాలేజ్ రీఎంబెర్స్మెంట్ డబ్బులు కాలేజీ లో జమ చేసి తగు రశీదు పొందవచ్చన్నారు. స్కాలర్ షిప్ మాత్రం మీరు ఉంచుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం నుండి ఫ్రెష్,  రెన్యువల్ విద్యార్థులకి వరిస్తుందన్నారు.  ఏమైన సందేహాలు ఉంటే ఆన్లైన్ లో పూర్తి సమాచారం ఉంటుందని, కాలేజీ లో నేరుగా కలవవచ్చు అని కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావు, ఏ సి రీఎంబెర్స్మెంట్ ఇంచార్జి సాగర్, జూనియర్ అసిస్టెంట్ అనికేత్  పేర్కొన్నారు.

జాతరలో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

0

మాట్లాడుతున్న ఎస్ఐ మౌనిక

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాలు పురష్కరించుకుని యువకులు దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దాపురం ఎస్సై వి.మౌనిక తెలిపారు. వీధి సంబరాలు జరుగుతున్న సమయంలో దురుసు ప్రవర్తన, అసభ్యపదజాలం, రెచ్చగొట్టే విధంగా ఎవరైన ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే మరిడమ్మ ఉత్సవాలు పురష్కరించుకుని వీధి సంబరాల నిర్వహణ కమిటీ సభ్యులకు నిబంధనలతో కూడిన ఆదేశాలు సృష్టంగా జారీ చేసినట్లు ఆమె తెలిపారు.ఇటీవల జరిగిన జాతరలో దురుసుగా ప్రవర్తించిన వారిపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.

ఇండ్ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని వినతి

0

డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ని కలిసి వినతిపత్రం అందజేస్తున్న సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్ బేల: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి గూడు కల్పించాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఆ ఇళ్ల నిర్మాణం జరగకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన స్థానిక అర్హులైన పేద ప్రజలకు కనీసం గూడు సౌకర్యం కూడా లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ లక్ష్యానికి అడ్డుపడకుండా అర్హులైన పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం తో పాటు స్థానిక అటవీశాఖ అధికారులు వీటికి అడ్డుపడకుండా అనుమతివ్వాలని శనివారం జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.అయితే సానుకూలంగా స్పందించిన డీ ఎఫ్ ఓ  పరిశీలించి పర్మిషన్లు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు మేకల జితేందర్,అనుముల ఉదయ్ కిరణ్,యువజన కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కార్గిల్ వీరునికి ఘన నివాళి

0

కార్గిల్ వీరుడు బిజేంద్ర శర్మకు నివాళులర్పిస్తున్న ఎస్ఐ నాగనాథ్

చిత్రం న్యూస్, బేల: కార్గిల్ యుద్ధంలోఎల్ 2002 సంవత్సరంలో వీరమరణo పొందిన హరియాణ రాష్ట్రానికి చెందిన సైనికుడు బిజేంద్ర కుమార్ శర్మ వర్ధంతిని శనివారం బేలలో ఆయన బంధువులు జరుపుకున్నారు. ఎస్సై నాగనాథ్, ఏఎస్సై జీవన్, మాజీ సర్పంచులు వివిధ పార్టీల నేతలు, గ్రామ పెద్దలు యువకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  దేశం కోసం ప్రాణాలర్పించిన శర్మను స్ఫూర్తిగా తీసుకొని యువకులు సైన్యంలో చేరి దేశ సేవలో ముందుండాలని ఎస్ఐ పిలుపునిచ్చారు.