మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
చిత్రం న్యూస్, భైంసా: భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..రహదారుల నిర్మాణంతో దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి, ప్రజల గుండెల్లో గొప్ప నాయకుడిగా కీర్తి గడించిన దార్శనికుడు, మాజీ ప్రధాని అటల్ జీ అని కొనియాడారు. వారు దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

స్వాతంత్ర్యం రావడానికి అమరులైన పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోనియా, లక్ష్మణ్, అంగన్వాడీ ఉపాధ్యాయులు సరస్వత, జ్యోతి, గ్రామ కార్యదర్శి పోతన్న, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, వీడిసి సభ్యులు రాందాస్, జె.గంగాధర్, కిషోర్ పాటిల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇరువంత్, దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ మహేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. వివిధ తరగతుల విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఉత్సాహభరితమైన నృత్యాలు, స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తిని హైలైట్ చేసే ఆలోచింపజేసే స్కిట్లతో సహా ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు.

