Home Blog Page 87

దేశానికి వాజపేయి చేసిన సేవలు మరువలేనివి

0

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా:  భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..రహదారుల నిర్మాణంతో దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి, ప్రజల గుండెల్లో గొప్ప నాయకుడిగా కీర్తి గడించిన దార్శనికుడు, మాజీ ప్రధాని అటల్ జీ అని కొనియాడారు. వారు దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు

0

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు

చిత్రం న్యూస్, విజయవాడ: పింఛన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను 95523 00009 నంబర్‌కి “మన మిత్ర” ద్వారా  వాట్సాప్ లో మెసేజ్‌ ద్వారా పంపించే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరతాయి.  తర్వాత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs) లాగిన్‌లో చూసి సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదు పరిష్కారం అయిన వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలను తిరిగి సిస్టమ్‌లో అప్లోడ్ చేస్తారు. అవి మళ్లీ అభ్యర్థుల వాట్సాప్ లోకి వస్తాయి. దీంతో పింఛన్ దారులు తమ ఫిర్యాదు స్థితి, పరిష్కారం వివరాలు ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. అందువల్ల అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కొత్త డిజిటల్ సదుపాయంతో పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రజలకు సౌకర్యం కలుగుతున్నాయి.

వరద నీటిలో ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల

వరద నీటిలో  మునిగిన ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ 

చిత్రం న్యూస్ బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఇచ్చోడ మండల కేంద్రంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వరద నీటితో మునిగింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తక్షణమే పాఠశాలకు చేరి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. బోథ్ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులను తనకు అందజేయాలని సూచించారు. వీరి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చిన రాజప్పకు వినతి

నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చిన రాజప్పకు వినతి పత్రం అందజేస్తున్న మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని చంద్రమాంపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ..మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి సమస్యను విన్నవించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పడినప్పుడు పాఠశాల ఆవరణణ మొత్తం నీటితో నిండిపోతుందన్నారు. దీంతో విద్యార్థులకు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా మారిందని, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన హెచ్ఎం రాధిక

0

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన హెచ్ఎం రాధిక

చిత్రం న్యూస్,భైంసా: మండలంలోని వాలేగాం గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ పాఠశాల, గ్రామ పంచాయతీ, మున్నూరు కాపు సంఘం, వీరశైవ లింగాయత్, అంబేద్కర్, అన్న బాహు సాఠే విగ్రహం ముందు జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లు పంచారు.

స్వాతంత్ర్యం రావడానికి అమరులైన పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోనియా, లక్ష్మణ్, అంగన్వాడీ ఉపాధ్యాయులు సరస్వత, జ్యోతి, గ్రామ కార్యదర్శి పోతన్న, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, వీడిసి సభ్యులు రాందాస్, జె.గంగాధర్, కిషోర్ పాటిల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇరువంత్, దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ మహేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

స్లోకా గ్లోబల్ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0

స్లోక గ్లోబల్ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లోని కోకాపేట స్లోకా గ్లోబల్ స్కూల్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంతో, దేశభక్తితో శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులు బాలాజీ, నరేంద్ర రెడ్డి, పాఠశాల ఛైర్మన్, డైరెక్టర్ జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ దీపికా ఠాకూర్, వైస్ ప్రిన్సిపల్ స్వాతి సక్సేనా, హెచ్.ఆర్. సరితా హాజరయ్యారు.

మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు.  వివిధ తరగతుల విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఉత్సాహభరితమైన నృత్యాలు, స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తిని హైలైట్ చేసే ఆలోచింపజేసే స్కిట్లతో సహా ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు.

మామిడి మల్లారెడ్డి, ముక్కెర ప్రభాకర్ ల దాతృత్వం

పాఠశాలకు 3ఫ్యాన్లు అందజేస్తున్న ముక్కెర ప్రభాకర్

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన మామిడి మల్లారెడ్డి, ముక్కెర ప్రభాకర్ లు దాతృత్వం చాటారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదులకు 3 ఫ్యాన్ లను ముక్కెర ప్రభాకర్  విరాళంగా అందజేసి ఉదారతను చాటారు. ముక్కెర ప్రభాకర్ ను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సన్మానించారు.

విద్యార్థుల సౌకర్యార్థం రూ.20 వేలతో ఫ్లోరింగ్ చేయించిన మామిడి మల్లారెడ్డి

తమ గ్రామంలో  చదువుతున్న పేద విద్యార్థులు పాఠశాల తరగతి గదుల్లో ఫ్లోరింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మామిడి మల్లారెడ్డి వారి సౌకర్యార్థం రూ.20 వేలు వెచ్చించి 2 తరగతి గదులు, వరండా ఫ్లోరింగ్ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM అర్చన, సైపట్ మహేందర్ రావు, బండారి వినోద్, నర్రా విఠల్ ,అర్హుల ఆశన్న, గంధం సురేష్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

దేశ రక్షణలో ఆర్మీ జవాన్ల సేవలు అభినందనీయం

విశ్రాంత ఆర్మీ జవాన్ శంకర్ దాస్ ను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: దేశ రక్షణలో ఆర్మీ జవాన్ల సేవలు అభినందనీయమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని సైనిక సంక్షేమ కార్యాలయంలో విశ్రాంత ఆర్మీ జవాన్లను శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. దేశ రక్షణ కోసం సరిహద్దులు, కుటుంబాలను వదిలి కాపలాగా ఉన్న సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరిస్తూ వారిని గౌరవించాలని పేర్కొన్నారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సైనికులు శత్రువులతో పోరాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు  శంకర్ దాస్, ఆర్. దేవన్న, వామనరెడ్డి, ఎల్. వి రావు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

0

గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటినీ విడుదల చేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని  గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు  గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 1,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మధ్యాహ్నం సమయానికి క్రమక్రమంగా ఇన్ ఫ్లో పెరిగి 15,400 క్యూసెక్కులకు చేరుకుంది. గురువారం ప్రాజెక్టు నీటి మట్టం 357.9 మీటర్లు, 1.384 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. మధ్యాహ్నం సమయానికి 15వేల క్యూసెక్కుల వరద నీటి చేరికతో ప్రాజెక్టు నీటి మట్టం 358.4కి ఎగబాకింది. వరద నీటి చేరిక పరిస్థితిని అంఛనా వేసిన ప్రాజెక్టు అధికారులు, ఎమ్మెల్యే రామరావ్ పాటిల్ చేతుల మీదుగా రెండు వరద గేట్లను ఎత్తివేసి దిగువకు 8వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్ ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో వరద గేట్ల ద్వారా నీటి విడుదల సైతం పెంచనున్నట్లుగా ప్రాజెక్టు నిర్వాహకా అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ లో మొదటి సారిగా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తివేయడంతో గడ్డెన్న ప్రాజెక్టు సందర్శకుల తాకిడి మొదలైంది.  భైంసా వాసులతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు గడ్డెన్న ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.

నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

 

నిరుపేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 18 రణదివేనగర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.  జాతీయ గీతాలాపన అనంతరం జెండా వందనం చేశారు. అనంతరం ఇంతియాజ్ ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన నిరుపేదలకు నిత్యవసర సరకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి  చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి,ఇంతియాజ్ ఖాన్, యశ్వంత్ నిరాడే, శ్యామ్ రావు కామ్డె, షేక్ వాజీద్, దేవానంద్, వాగ్మారే చందు, వినోద్ గైక్వాడ్, రాజశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.