అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు
చిత్రం న్యూస్, భైంసా, ముథోల్: అధికార లాంచనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల కింద న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళాల్లో పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ {25} వాటర్ పాల్ లో పడి మృతిచెందారు. శనివారం అతని అంత్యక్రియలు స్వగ్రామంలో అధికారిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ జవాన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముథోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్ తది
తరులు పాల్గొన్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. రైతు నేస్తాలైన బసవన్నలను పూజించుకోవడం రైతుల్లో గొప్ప పండగ అన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకోవడం మత సామరస్యం తో ఐక్యమత్యానికి పొలాల పండగ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వడూర్ గ్రామ పెద్దలు హన్మాండ్లు యాదవ్, మాజీ సర్పంచ్ హన్మాందాస్ యాదవ్, రమణారెడ్డి, సుదర్శన్, సంజీవ్ రెడ్డి, కావటి దేవరెడ్డి, అడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, అనిల్ యాదవ్, అర్లి t మాజీ సర్పంచ్ గొల్లి లస్మయ్య, వీడీసీ చైర్మన్ ఓమన్న, గ్రామ పెద్దలు కామన్వార్అశోక్, రాహుఫ్, నందు, ఉల్లాస్ పటేల్, గజానన్ యాదవ్, గంగయ్య, మాజీ ఎంపీటీసీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
