Home Blog Page 80

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

0

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

చిత్రం న్యూస్, భైంసా, ముథోల్: అధికార లాంచనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల కింద న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళాల్లో పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ {25} వాటర్ పాల్ లో పడి మృతిచెందారు. శనివారం అతని అంత్యక్రియలు స్వగ్రామంలో అధికారిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ జవాన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముథోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్  తది

తరులు పాల్గొన్నారు.

భైంసాలో అందుబాటులోకి ఫ్రీజర్ సేవలు

*డా.ముత్యం రెడ్డి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం 

చిత్రం న్యూస్,భైంసా: తన తల్లి అమృతాబాయి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువుల రాకపోకల్లో ఆలస్యం కలిగిన సందర్భాల్లో మృతదేహాన్ని  భద్రపరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడనుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..తల్లి ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆశయంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సేవను ప్రారంభించాం. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫ్రీజర్ సేవలు అవసరమున్న వారు 9441375375, 6300854960 మొబైల్ నెంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన డా. ముత్యంరెడ్డిని భైంసా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కదం మోహన్ రావ్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చందులాల్, బీజేపీ పట్టణ కమిటి అధ్యక్షులు రావుల రాము, మాజీ అధ్యక్షులు గాలి రవితో పాటు పలువురు అభినందించారు.

బీఆర్ఎస్  నాయకుల పరామర్శ

బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్  నాయకులు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కోగ్దూర్ గ్రామానికి చెందిన చొకాజీ నింసత్కర్ మరియు హేటి గ్రామానికి చెందిన నాందేవ్ ఠాక్రే (మహాజన్) ఇటీవల మరణించడంతో బాధిత  కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, యువ నాయకుడు సతీష్ పవార్, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ తేజ్రావు మస్కే, విశాల్ గోడే,సుదర్శన్ బత్తుల, సుధాకర్ చౌహాన్ తదితరులు ఉన్నారు.

ఘనంగా ఆడే గజేందర్  జన్మదిన  వేడుకలు

బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నేరడిగొండ లోని లక్ష్మి గార్డెన్ లో జరిగిన జన్మదిన వేడుకల్లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆడే గజేందర్

ను శాలువాతో సన్మానించారు. అనంతరం కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, రెండ్ల రాజన్న, ఎస్ కే అలీమ్, దినేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పొలాల పండగ 

0

         ఘనంగా పొలాల పండగ

*ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్న జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పొలాల అమావాస్య పండగను జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి_వెంకట్ రెడ్డి దంపతులు  ఘనంగా నిర్వహించారు.  ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్ లోని వారి నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకి  కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం  బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. ప్రజలు పాడిపంటలు, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

ఘనంగా పొలాల అమావాస్య 

పొలాల వేళ.. అన్నదాతలకు అండగా

*సామాజిక  కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఉదారత

చిత్రం న్యూస్, భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి (టి) గ్రామాల్లో పొలాల అమావాస్య పండగను ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వడూర్, అర్లిటి గ్రామాల్లో చూడ ముచ్చటగా బసవన్నలను అలకరించిన రైతులకు పంపుసెట్లు, టార్చిలైట్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను బహుమతులుగా ప్రధానం చేశారు.

ఈ మేరకు  ఆయన మాట్లాడుతూ. రైతు నేస్తాలైన బసవన్నలను పూజించుకోవడం రైతుల్లో గొప్ప పండగ అన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకోవడం మత సామరస్యం తో ఐక్యమత్యానికి పొలాల పండగ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వడూర్ గ్రామ పెద్దలు హన్మాండ్లు యాదవ్, మాజీ సర్పంచ్ హన్మాందాస్ యాదవ్, రమణారెడ్డి, సుదర్శన్, సంజీవ్ రెడ్డి, కావటి దేవరెడ్డి, అడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, అనిల్ యాదవ్, అర్లి t మాజీ సర్పంచ్ గొల్లి లస్మయ్య,  వీడీసీ చైర్మన్ ఓమన్న, గ్రామ పెద్దలు కామన్వార్అశోక్, రాహుఫ్, నందు, ఉల్లాస్ పటేల్, గజానన్ యాదవ్, గంగయ్య, మాజీ ఎంపీటీసీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు

0

జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు

*సత్యాగ్రహ దీక్ష చేపట్టిన పాల్వాయి హరీశ్

*నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

చిత్రం న్యూస్, కాగజ్ నగర్:  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను బీజేపి ఎమ్మెల్యేలు విరమింపజేసారు. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం పాల్వాయి హరీష్ బాబును బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేశ్ రెడ్డి,  కాట్ పెల్లి  వెంకటరమణ రెడ్డి లు పరామర్శించారు.  నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ. సందర్భంగా బీజేపి ఎమ్మెల్యేలు మట్లాడుతూ..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 రద్దు చేస్తున్నామని కేవలం ప్రకటించిందని, దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు జీవో 49 రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపి పార్టే ఆధ్వర్యంలో ప్రభుత్వంపై భారీ ఎత్తున పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు

సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు

*బసవన్నలకు ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. బోథ్ మరియు  సొనాల మండల కేంద్రాల్లో  శ్రావణ మాస ఉత్సవాల సందడిలో భాగంగా పొలాల బసవన్నల ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వానలు బాగా కురవాలి, పొలాలు పచ్చగా కళకళలాడాలి. పంటలు బాగా పండాలని ఆకాంక్షతో గ్రామ పెద్దలు, యువత బసవన్నలను పూలమాలలతో, రంగురంగుల వస్త్రాలతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. డోలు వాయిద్యాల మధ్యన ఊరేగింపు గ్రామమంతా సందడిగా సాగింది.రైతులు బసవన్నలకు పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని మొక్కులు తీర్చుకున్నారు. బసవన్నల ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ సాంప్రదాయం తరతరాలకు సంక్రమించి కొనసాగాలని, రైతు జీవితంలో బసవన్నకు ఉన్న ప్రాధాన్యతను కొత్త తరం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు.  పొలాల అమావాస్యలో శాస్త్రీయత దాగి ఉందని పెద్దలు తెలిపారు..

 

మావల లో ఘనంగా పొలాల అమావాస్య పండగ 

ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నబోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, మావల: నిత్యం రైతుకి సహాయపడే పశువులను పూజించే గొప్ప పండగ పొలాల అమావాస్య పండగను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం మావలలోని నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకు శ్రీకాంత్ రెడ్డి, అయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని హనుమాన్, పోచమ్మ ఆలయాల్లో డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్ల ఊరేగింపు ఏంతో వేడుకగా నిర్వహించారు. రైతులు, యువకులు, గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎడ్ల ఊరేగింపులో పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన జాయిట్ సబ్ రిజిస్ట్రారర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. గమనించిన కొంత మంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరపగా..లంచం తీసుకుంటున్న జాయింట్ రిజిస్ర్త్రార్ ను అదుపులోకి తీసుకున్నారు. సిలికన్ పరీక్ష నిర్వహించి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. బాదితుడు బేల మండలం సిర్సన్నకు చెందిన మన్సుర్ ఖాన్ పటాన్ తన భార్య గౌసియ బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డీడ్ కోసం ఈనెల 19న ముదస్సిర్ షా అనే డాక్యుమెంట్ రైటర్ తో పత్రాలు తయారు చేశారు. 20వ తేదిన జాయింట్ రిజిస్ట్రారర్ వద్దకు పత్రాలను పరిశీలించి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాదితుడు దానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం గిఫ్ట్ డీడ్ అయిన తరువాత ఐదు వేలు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ మధు తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన లంచం అడిగితే పోలీసులు లేదా ఏసీబీని సంప్రదించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని తెలిపారు. అయితే ఇంచార్జ్ బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు రావడం గమనార్హం.