చిత్రం న్యూస్, జైనథ్: వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిరాల, జైనథ్, లేఖర్ వాడ, సావాపూర్, కచ్ కంటి గ్రామాలలో శనగ, కంది, గోధుమ రబీ పంటలలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డా.కే రాజశేఖర్, డా.జి. ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ..గులాబీ రంగు పురుగు దృశ్య పత్తి పంటను తీసివేయాలన్నారు. కంది పంటలో పురుగు నివారణకు లాండా సాయి హాలోత్రిన్ + క్రోరాంతనిప్రోలు ఎకరానికి 80 మిల్లీలీటర్లు విచికారి చేసుకోవాలన్నారు. సెనగ పంటలో ఎండు తెగులు నివారణకి కాపరాక్షి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలన్నారు. గోధుమ పంటలో తెగుళ్ళ నివారణకి ప్రాపి కొనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ ఇచ్చిన కందిరకాలను కూడా సందర్శించారు. రైతులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు_జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 15 ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, రేసింగ్ వంటి నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయిని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించి సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
_జిల్లా కలెక్టర్ రాజర్షి షాని కోరిన నేతలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తున్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను సంబంధిత యాజమాన్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే నేతల బృందం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ లను కలిసి జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో వినతి పత్రం సమర్పించారు. జనవరి మూడో తేదీన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని రాష్ట్ర పండగగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మాలీ మహా సంఘం, హిందీ భాష సేవా సమితి కార్యవర్గ సభ్యులు కార్యక్రమ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని అన్ని యాజమాన్యాల పాఠశాల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేలు స్త్రీ విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషిచేసిన మహోన్నత వ్యక్తులని వారి సేవలను స్మరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను ఏర్పాటుచేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారిని సంఘం నేతలు కోరారు. వారిని కలిసిన వారిలో మాలే మహ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలే, హిందీ భాషా సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ ప్రధాన్, సంయుక్త కార్యదర్శి అనిల్ కోట్రంగే తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదం..యువకుడికి తీవ్రగాయాలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road accicent) జరిగింది. జందాపూర్ బైపాస్ సమీపంలో ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మూగజీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ
చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు వైద్యాధికారి డా.రాజేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను వేశారు.అనంతరం పశు వైద్యాధికారి మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న పశువులతో పాటు మేకలు, గొర్రెలు వ్యాధిన పడ్డ వాటిని గ్రహించి యజమానులు వెనువెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని, ఎప్పటికప్పుడు పశువులను శుభ్రంగా ఉంచితే సమృద్ధిగా పాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్ పటేల్, ఉప సర్పంచ్, పురుషోత్తం, పశువైద్య సిబ్బంది, జేవీఓ సుజాత. గోపాలమిత్ర గణేష్ ఓఎస్ వినాయక రావు, రైతులు హల్దేకర్ గోపి, కాలేవార్,దిగంబర్, గోవింద్, దశరథ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పీఎం, సీఎం సోదరీమణులు వీరే..
చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్ లోని నీలకంఠ ఆలయంలో ఇద్దరు మహిళలు మెదటిసారి కలుసుకున్నారు. ఒకరు ఆలయం వెలుపల పూల దుకాణం నడుపుతున్నారు. మరొకరు దైవదర్శనం కోసం కాలి నడకన అక్కడికి వచ్చారు. వారిద్దరి సోదరులు దేశంలోని అత్యంత శక్తివంతమైన, గొప్ప పేరున్న నాయకులు. విశేషమేమంటే..వారికి ఎటువంటి భద్రతా, మంది, మర్భలం, సేవకులు లేరు. ఒకరేమో పూలదుకాణం యజమాని శశి దేవి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి కాగా మరో మహిళ వాసంతి బేన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోదరి.
పీఎం, సీఎం సోదరీమణులు వీరే..
రైతులపై మొసలి కన్నీళ్లు ఎందుకు?
విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి
చిత్రం న్యూస్ బేల : బేల మార్కెట్ యార్డు లో 45 రోజుల నుంచి రైతులు పడుతున్న కష్టాలు, కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ లకు కనిపించడం లేదా అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి ధ్వజమెత్తారు. బేల మార్కెట్ యార్డు లో కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడం తో మేము తప్పు చేశాం…మార్కెట్ కు సోయా తీసుకొచ్చి తప్పు చేశాం అని మోకాళ్ళ పై కూర్చొని రైతులు నిరసన తెలపడంతో స్పందించిన ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కరోనా సమయంలో కూడా ఇంటింటికి వచ్చి కొనుగోళ్లు చేసిన ఘనత కేవలం బీ ఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి దక్కిందన్నారు. అసెంబ్లీలో మొసలి కన్నీళ్లు కార్చి రైతుల పక్షాన ఉన్నామనుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి బేల రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులు రాత్రి అనగా పగలు అనగా కష్ట పడి పండించిన పంట చివరకు అమ్ముకుందాం అనుకుంటే పంట కొనుగోలు చేసే మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు చేసిన నాణ్యమైన సోయా బస్తాలు వెనుకకు రావడం తో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతులు పడుతున్న కష్టాల పై రెండు రోజుల్లో రైతుల తో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ చేపడుతున్నామని రాబోయే రోజుల్లో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని. రైతులకు భరోసా కల్పించారు. ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పంటలు కొనుగోలు చేయించాలని, లేనియెడల రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, జక్కుల మధుకర్, సతీష్ పవార్, మస్కే తేజరావు, సురేష్ రెడ్డి, ఠాక్రే అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పెర్సపెన్ పూజలు
చిత్రం న్యూస్ బేల: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల (గోండులు) ముఖ్యమైన సాంప్రదాయ పూజలలో కుల దేవత పెర్సపెన్ను పూజిస్తారు. పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, క్షేమం కోసం పూజలు చేస్తారు, ఇవి పుష్యమాసం, మే నెలల్లో జరుగుతాయి, సంస్కృతి, సంప్రదాయాలు, కొత్త కోడళ్ళను పరిచయం చేసే వేడుకలతో ఘనంగా జరుగుతాయి. పూజలో భాగంగా ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటించి, ఊరేగింపులు నిర్వహిస్తారు. పెర్సపెన్ అంటే పెద్ద దేవుడు లేదా బడా దేవ్, ఈయన ఆదివాసుల సర్వోన్నత దేవుడు. గోండు, కోలాం ఆదివాసీ గిరిజన తెగలు ఈ పూజలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బాధి, వడగూడ గ్రామాల్లో పుష్య మాసం సందర్భంగా జుగ్నక పరివార్ వంశీయులు, మంగళవారం పెర్సపేన్ పూజలు ప్రారంభించారు. మూడు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో ఎక్కడినుంచో వచ్చిన బంధుమిత్రులు పెర్సపేన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ పూజలో కుటుంబ సభ్యులతో పాటు జగ్నక గాంధీ కటొడ్ల, జుగ్నక శంబు, జుగ్నక నందు, సిడాం నందు కుమార్, జుగ్నక లక్ష్మణ్, జుగ్నక శంకర్ తదితరులు పాల్గొన్నారు.
లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, బేల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బేల తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్ తో కలిసి సోమవారం అవాల్ పూర్, పిట్ గావ్ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలనలో లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, మహిళలకు బస్సు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇలా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్, బాది సర్పంచ్ వినోద్, బేల మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, మాజీ ఉప సర్పంచ్ అనిల్, వార్డ్ మెంబర్ సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
గిమ్మ సర్పంచ్ గాజుల సన్నీకి ఘనంగా సన్మానం
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ) ను పదో వార్డు కాలనీవాసులు ఘనంగా సన్మానం చేశారు. సోమవారం కాలనీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా సర్పంచ్ గాజుల సన్నీ, ఉప సర్పంచ్ మంద అడెల్లు, వార్డు మెంబర్ హైమద్ తో పాటు వార్డ్ మెంబర్ అభ్యర్థి జర ప్రశాంత్ లను శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేశారు. సన్మానించిన వారిలో ఆవునూరు గణేష్, భావునే సంతోష్, కనిపెల్లి సాయి, కంచర్ల నాగరాజు గౌడ్, సిర్పూర్ బాపురావు, ఆటో భూమన్న, దశరథ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.










