Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 4

పదవి ఆమెది – పెత్తనం అతనిది

0

చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: మహిళలకు ఉన్న ప్రత్యేక రిజర్వేషన్ల కారణంగా అధికారం కోసం, ఇంట్లో ఉన్న తమ ఆడవారితో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు మగవారు. ఆ విధంగా పదవిలో నామమాత్రంగా మహిళలు ఉంటున్నారు. పెత్తనం మాత్రం మగవారు చేస్తున్నారు. వాళ్లు కూడా భర్తకు ఎదురు చెప్పలేని స్థితిలో బాధ్యతలను మగవారికే అప్పగిస్తున్నారు. ఇలా భర్తలే నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు హాజరవ్వడం వంటి సంఘటనలు పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉద్దేశం పక్కదారి పడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రతినిధి ఆమె :వనితలకు పదవులు, రాజకీయాలు కొత్తే కావొచ్చు. ఇప్పటివరకు ఇంటి పనులకో, వ్యవసాయానికో పరిమితమై ఉండొచ్చు. పాలనానుభవం పెద్దగా లేకపోవచ్చు. అయితేనేం! ప్రజా సమస్యలపై వారికీ అనుభవం ఉండే ఉంటుంది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధి ఆమె. అయినా సొంతింటి వారే బయటకు రాకుండా చిన్నబుచ్చుతుంటే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ‘సర్పంచ్‌ సాబ్‌’ అని నలుగురు పిలుస్తుంటే పులకరిస్తున్నారే తప్ప, మన ఇంటి ఆడపడుచును ‘పతిచాటు సతి’ అని పదుగురిలో పలుచన చేస్తున్నామని గ్రహించడం లేదు.

ఇటువంటి ధోరణే ఇక్కడ: పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించిన వేళ, మహిళా సర్పంచుల పక్కనే వారి పతులకూ కుర్చీలు వేసి సన్మానాలు చేశారు. అంటే అటు కుటుంబీకులు, ఇటు జనం సైతం ‘అతడిదే పెత్తనం’ అని అంగీకరించినట్లేనా? సమీక్షలు అన్నింటికీ కుటుంబ సభ్యులు, భర్తలే ముందుంటున్నారు. భర్త చాటు భార్యగానే ఆమెకు స్థానం అధికారులే గుర్తుపట్టలేని పరిస్థితి. అధికారిక కార్యక్రమాలకు భర్తలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు.ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన భర్త కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండటం, ఎన్నికలు వచ్చినప్పుడు మహిళలు ప్రచారం కోసం తిరుగుతారని గెలుపొందిన తర్వాత బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మనదేశంలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నత శిఖరాల్లో పదవుల ఆచరించి ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఆచరణకు నోచుకోలేని మహిళలుగానే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళలకు దక్కే విధంగా ఆచరణ చేయాలని ఆశిద్దాం!

శ్రీ స్వయంభూ సమ్మక్క-సారలమ్మ జాతర నూతన కమిటీ ఎన్నిక

0

అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డి ఏకగ్రీవం

చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వయంభూ సమ్మక్క-సారలమ్మ జాతర ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతర గుట్ట వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి వెన్నంపల్లి, ఎక్లాస్‌పూర్, గర్రెపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి, సోమారం గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధిని కాంక్షించి, అందరి ఆమోదంతో నూతన అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆరు గ్రామాల పెద్దలు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నూతన కార్యవర్గం కృషి చేయనుందని తెలిపారు. నూతన అధ్యక్షుడుగా సారబుడ్ల సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మారుపాక తిరుపతి (వెన్నంపల్లి), కనకం అజయ్ (వెన్నంపల్లి), కోశాధికారిగా సంగాల తిరుపతి (వెన్నంపల్లి), ఉపాధ్యక్షులుగా గుర్రాల మహేందర్ రెడ్డి (లస్మన్నపల్లి), బొద్దుల తిరుపతి (ఆరెపల్లి), ఇల్లందుల సంపత్ (ఎక్లాస్‌పూర్), దోకిడి తిరుపతి (గర్రెపల్లి), పడాల తిరుపతి (సోమారం), బీస నర్సయ్య (వెన్నంపల్లి), సహాయ కార్యదర్శులుగా సంగాల రవికుమార్, మొలుగూరి సంపత్ (వెన్నంపల్లి), తిప్పిరిశెట్టి రమేష్ (గర్రెపల్లి), కస్తూరి రాములు (ఆరెపల్లి), తీగల రఘుపతి గౌడ్, (ఎక్లాస్‌పూర్), మెరుగు నరేష్ (లస్మన్నపల్లి), గుంటి వెంకటేష్ (సోమారం) కార్యవర్గ సభ్యులుగా తిప్పిరిశెట్టి రమేష్, బెల్లి తిరుపతి (గర్రెపల్లి), బైరి రాజు, తలారి యాదగిరి (లస్మన్నపల్లి), బండి రమేష్, రేగుల భిక్షపతి (వెన్నంపల్లి), మేక కుమార్, కచ్చు శ్రీనివాస్ (సోమారం), గొంగళ్ళ రవి, కోలె అశోక్ (ఆరెపల్లి), గంగిళ్ళ రాంరెడ్డి, చల్లూరి రవి (ఎక్లాస్‌పూర్). మహ్మద్ రహీమ్ పాషా (వెన్నంపల్లి), బీస వెంకటేష్ (వెన్నంపల్లి), మొలుగూరి వెంకటయ్య (వెన్నంపల్లి), మొలుగూరి అయిలయ్య (వెన్నంపల్లి), మారుపాక ప్రణయ్ (వెన్నంపల్లి) వెన్నంపల్లి బండ శివానంద రెడ్డి నియామకం అయ్యారు.

అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం_డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న

0

  * ఘనంగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ జన్మదిన వేడుకలు

* అన్సారీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రముఖులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ తన జన్మదినం సందర్భంగా  అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్మల్  డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జైనథ్ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి అన్నారు. అన్సారీ జన్మదిన వేడుకలను బంధు మిత్రులు, నాయకులు, శ్రేయోభిలాషుల నడుమ శనివారం జరుపుకున్నారు. అందరి నడుమ కేకు కట్ చేశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఫౌండేషన్ కరపత్రాలను అందరికీ అందజేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ..ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ ఇప్పటికే పాల ఉత్పత్తుల రంగంలో రాణిస్తున్నారన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. అట్టడుగు వర్గాలకు సహాయం చేయడం. విద్యా, వైద్యం, ఆరోగ్యం సామాజిక ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సానుకూల, స్థిరమైన మార్పును తీసుకు రావడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని అన్సారీ ఫౌండేషన్ ఛైర్మన్  ఎండీ అన్సార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.సంజయ్ గుజరాతి, ఎల్టి వెంకట్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, మహ్మద్ రోహిత్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ షానవాజ్, షేక్ కిజర్ పాషా, షేక్ పర్వేజ్, గాజుల సాంబశివ, తలమడుగు సర్పంచ్ ఎలుగు చంటి (రాజన్న),  ఫౌండేషన్ సభ్యులు పి.సునీల్, ఎం.రాకేష్, శ్రీకాంత్, సుశీల్, టి.నారాయణరెడ్డి, సామ ఆశిష్ రెడ్డి, ఇర్ఫాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

చైనా మాంజా తగిలి ఒకరికి తీవ్రగాయాలు

0

చిత్రం న్యూస్, నేరడిగొండ: సంక్రాంతి పండగ వేళ సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తాం.అయితే,గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది.చైనా మాంజా.మనుషుల పాలిట యమపాశంగా మారింది.చైనా మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.చైనా మాంజా మహా డేంజర్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది.చైనా మాంజా కారణంగా నేరడిగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 రహదారి పై బైక్ మీద నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బక్పత్ కి చెందిన మొహమ్మద్ అనిస్ (42)కి పతంగి మాంజా అతడి మొహంపై చుట్టుకుంది. ఇది గమనించే లోపే తీవ్ర రక్తస్రావం అయ్యింది.వెంటనే బాధితుడిని మండల కేంద్రం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ. పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. జనాల గొంతులు కోస్తున్న ఈ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ చైనా మాంజా మార్కెట్ లో లభ్యమవుతోంది.ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. పోలీసులు చైనా మాంజా వాడొద్దని పదే పదే చెబుతున్నా వ్యాపారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అయినా చైనా మాంజా వాడకాన్ని మాత్రం ఆపడం లేదు.

రామాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరాజ్

0

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెంలోని రామాయలం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరాజ్, ప్రధాన కార్యదర్శిగా గంగేశ్వర్, చిన్నయ్య, కోశాధికారులుగా రాజు,  గణేష్, కిట్టు, రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ప్రసాద్, శ్రీరామ్, నల్లగొండ మోహన్ నాయక్, బ్రహ్మచారి బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గానికి గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహణకు నూతన కమిటీ కృషి చేయాలని భక్తులు, గ్రామస్తులు నూతన కమిటీ సభ్యులను కోరారు. అలాగే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం

0

చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని కూర గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం పెద్ద ఎత్తున గ్రామస్తులు, దాతల సహకారంతో జరుగుతుందని ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు గుండేటి రామాంజనేయ శర్మ తెలిపారు. శనివారం కరంజి గ్రామానికి చెందిన నూతుల మహేందర్ రెడ్డి  కుటుంబం, కరంజి, దీపాయిగూడ సుందర సత్సంగ్ భజనలతో ఆలయంలో శోభ సంతరించుకుంది. ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

సదర్ మాట్ కాలువ సాధన దీక్షకు రైతులు

0

*మద్దతు పలికిన న్యాయవాదులు, మేధావులు, నాయకులు

*తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందించిన రైతులు

చిత్రం న్యూస్, కడెం: కొత్త సదర్ మాట్ ఆనకట్ట నుండి పాత సదర్ మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలని, చివరి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరుతూ శనివారం కడెం మండల కేంద్రంలో సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ఆధ్వర్యంలో సదర్ మాట్ ప్రత్యేక కాలువ సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలంలోని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పెద్దూర్, తండా, బెల్లాల,దిల్దార్ నగర్,ఎలగడప,లింగాపూర్, లక్ష్మి సాగర్ నచ్చన్ ఎల్లాపూర్ తదితర గ్రామాల నుండి వందలాది మంది రైతులు స్వచ్చందంగా తరలి వచ్చారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, న్యాయ వాదులతో పాటు మేధావులు, ఉద్యమకారులు, పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందజేశారు దీక్షలో సర్పంచులు విజయ్ కుమార్, స్టీఫెన్, రామాగౌడ్, చిట్టిటె ముత్తన్న, దండికి గంగన్న, లసేట్టి శేఖర్, జాగిరి శ్రీనివాస్,ముక్కెర శ్రీనివాస్,దశరథ్,కానూరి సతీష్,నవీన్,గద్దల దేవన్న, సదానందం,పల్లె సత్తన్న, నర్సింహా రెడ్డి,నారయణ, శంకర్,రాజేశ్వర్, రాజేందర్,బుక్య శేఖర్, వకీలు గంగన్న, సునారికారి రాజేష్, లింగన్న, రాజాగౌడ్, నాగరాజు, ప్రశాంత్,సందిప్, ఆది మల్లేష్, ప్రవీణ్, సురేష్ నాయక్, రాపర్తి శ్రీనివాస్,బాలు నాయక్, సత్యారావు, దాసరి రమణ, చిన్నరాజన్న, రాములు,భూమన్న, దుర్గం లక్ష్మి,ఆకుల లక్ష్మి,రాజన్న,మక్కి శంకర్, గిల్లి రమేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చిత్రం న్యూస్, జైనథ్: చారిత్రక ప్రసిద్ధి గాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పునరుద్ఘాటించారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరైన నేపథ్యంలో శనివారం  గ్రామస్తులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను, కోనేరు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో పని చేస్తున్నానని తెలిపారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు ప్రతి అభివృద్ధి పనిని ప్రతికూలంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇతరులను విమర్శిస్తేనే రాజకీయాల్లో హీరోలు అవుతామని కొందరు భ్రమపడుతున్నారని, అటువంటి రాజకీయాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని హితవు పలికారు. ప్రస్తుతం మంజూరైన రూ.1.50 కోట్లతో ఆలయ రూపురేఖలు మార్చడంతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సామ రూపేష్ రెడ్డిని సన్మానించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

చిత్రం న్యూస్,బేల:  బేల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఇటీవల రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఆరోగ్య జాతర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలకు విరాళాలు అందజేసిన దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించగా సామ రూపేష్ రెడ్డి చేసిన ఉదారతను గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం పూట చికెన్ భోజనము  ఏర్పాటు చేశారు. అనంతరం స్వీట్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రెటరీ శ్రీ దుర్గే భగవాన్ దాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ప్రేమ్ రాజు గౌడ్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి స్వామి, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు