Home Blog Page 4

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు బోర్లను వేయించిన మామ్మాయి రమేష్ 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఓటమి కూడా అడ్డంకి కాలేదని మామ్మాయి రమేష్ నిరూపించాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ గ్రామానికి నీటి సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మామ్మాయి రమేష్ రెండు బోర్లను వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన రమేష్, తాను గెలిచినా గెలవకపోయినా గ్రామంలో రెండు బోర్లను వేయిస్తానని మాట ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయనకు విజయం దక్కకపోయినా, ఇచ్చిన మాటను మాత్రం మరవలేదు. తన కుమారుడు మామ్మాయి సచిన్ రెండు బోర్లను శుక్రవారం బొర్రా గణేష్ గల్లీ, ధోబి గల్లీ ప్రజలతో, యువకులతో కలిసి ప్రారంభించారు.

సచిన్ మాట్లాడుతూ..మా నాన్న సర్పంచిగా, ఎంపీటీసీగా ఎన్నో సేవలు అందించారన్నారు. నాన్న బాటలో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తాననన్నారు. తన సొంత ఖర్చుతో గ్రామంలోని అవసరమైన బొర్రా గణేష్ గల్లీ, దోబి గల్లీ ప్రాంతాల్లో రెండు బోర్లను వేయించి, వాటిని ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మామ్మాయి రమేష్ ను అభినందించారు. రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలనే సంకల్పంతో మామ్మాయి రమేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ దేశ్ముఖ్, గురప్ప శంకర్, వార్డ్ మెంబర్లు నానం సాయిలు, భూమన్న నాగలక్ష్మి అశోక్, ఫారుక్, గైని సాగరా గంగాధర్, బలగం శైలేష్ , మల్లేష్ వీరన్న దావరాజు ఇక్బాల్ ముల్తాన్ విక్రమ్ శీను తదితరులు ఉన్నారు.

బాసరలో ఘనంగా అంజన్న మహా పడిపూజ  

0

చిత్రం న్యూస్,బాసర: నిర్మల్ జిల్లా బాసరలో శుక్రవారం ఘనంగా అంజన్న మహా పడిపూజ నిర్వహించారు. హనుమాన్ దీక్ష గురు స్వామి శ్రీనివాస్, మమ్మాయి మురళీ, ఏం.గంగేశ్ ఆధ్వర్యంలో నల్ల హనుమాన్ ఆలయ సమీపంలోని ముల్కీ లింగన్న యాదవ్ నివాసంలో పడి పూజ కనుల పండువగా జరిగింది. హనుమాన్ దీక్ష మాలధారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు.,ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం,,వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు,తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు.,హనుమాన్ స్వాముల భజనలతో ప్రాంగణమంతా జైశ్రీరామ్.. జై హనుమాన్ నామ స్మరణతో మార్మోగింది. అనంతరం ముల్కీ లింగన్న యాదవ్ కుటుంబ సభ్యుల తరపున హనుమాన్ స్వాములకు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

పశువులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మణియార్ పూర్, గూడ, గ్రామాల్లో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్య అధికారి డాక్టర్ దీప్ రతన్ మాట్లాడుతూ ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం పశువులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పశువులకు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఠాక్రే జ్యోష్ణా గంభీర్, నాగేసెన్, అశోక్, దిలీప్, రితేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ముథోల్ లో రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

0

చిత్రం న్యూస్, ముథోల్:నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద Sub-Mission on Agricultural Mechanization (SMAM) వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేశారు. లోకేశ్వరం, బాసర, ముథోల్, తానూర్ మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు స్ప్రే పంపులు, రోటవేటర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు కార్మిక వ్యయం తగ్గడంతో పాటు సాగు పనులు వేగంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకత పెంపొందించుకోవచ్చని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే చిన్న, మధ్య తరహా రైతులు కూడా ఆర్థికంగా బలపడతారని ఆయన అన్నారు.పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మికుల కొరత వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సబ్సిడీపై అందిస్తోందని తెలిపారు. పరికరాల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన, సాంకేతిక సహాయం కూడా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్.స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

30 ఏళ్ల నిరీక్షణకు తెర..గిమ్మ రైతులకు అందిన రైల్వే భూపరిహారం

చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ గ్రామ రైతుల మూడు దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ల్యాండ్ భూసేకరణ పరిహారం డబ్బులు ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా దాదాపు 89 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి.

30 ఏళ్ల పోరాటం: రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి గిమ్మ రైతులు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వాల కాలంలో పరిష్కారం కాని ఈ సమస్య, పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొలిక్కి వచ్చింది.

ఎమ్మెల్యే చొరవ: ఈ అంశంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి, నిధుల విడుదలకు అవసరమైన అడ్డంకులను తొలగించారు. ఫలితంగా రూ.89 లక్షల పరిహారం నేరుగా బాధితుల అకౌంట్లలో జమ అయ్యాయి.

కృతజ్ఞతలు తెలిపిన రైతులు: తమకు న్యాయం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గిమ్మ గ్రామ రైతులు ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. అక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సర్పంచ్ గాజుల సన్నీ,బీజేపి నాయకులు ,రైతులు పాల్గొన్నారు.

బోథ్ వ్యవసాయ మార్కెట్ పదవి రైతు పక్షపాతికే పట్టం !

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి బీసీ జనరల్ వర్గానికి కేటాయించబడినట్లు వ్యవసాయ శాఖ వర్గాల నుంచి సమాచారం అందినట్లుగా స్థానిక నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి వివిధ మండలాల నుండి పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బోథ్ ప్రాంతంలో బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన చట్ల ఉమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బోథ్ నియోజకవర్గంలో ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా చట్ల ఉమేష్ మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో  ఎంపీటీసీగా, పాక్స్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతుల నమ్మకాన్ని పొందారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో అనేక వ్యవసాయ భూములకు చేరుకునేలా గ్రావెల్ రోడ్లు వేసినట్లుగా రైతులు పేర్కొన్నారు. రైతులకు రాకపోకలు సులభంగా ఉండేందుకు కల్వర్టులు నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో అనేక గ్రామాల రైతులు తమ పంట పొలాలకు సులభంగా చేరుకునే అవకాశం కలిగిందని రైతులు తెలిపారు.మరోవైపు స్థానిక రాజకీయాల మధ్య ఈ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. స్థానిక అధికార పార్టీ పెద్ద మొత్తం నాయకుల మద్దతు సైతం ఉమేష్ కు ఏకగ్రీవంగా ఉందని తెలుస్తోంది. బోథ్ నియోజకవర్గంలోని రైతులు, బీసీ సంఘాల నాయకులు, యువత కూడా చట్ల ఉమేష్‌కు బలమైన మద్దతు ప్రతిపాదిస్తున్నారు.

బోథ్ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమం,  మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా చట్ల ఉమేష్‌ను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని పార్టీ అధిష్టానం ప్రభుత్వాన్ని స్థానిక నాయకులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే బీసీలకు కేటాయించిన ఈ పదవిని అలాగే కొనసాగిస్తూ బీసీ వర్గాలకు న్యాయం చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సామాజిక సమస్యలపై అవగాహన వాటి పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆపదలో ఉంటే అండగా తాను ఉన్నానని భరోసా కల్పిస్తూ సాగుతున్న ఉమేష్ సేవలను గుర్తించి అధిష్టాన నాయకత్వం ఆశీర్వదించాలని అన్నదాతలు కోరుతున్నారు.

కలెక్టర్ రాజర్షి షా ను సన్మానించిన బేల మండల సర్పంచులు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బేల మండల సర్పంచులు కలెక్టర్‌ రాజర్షి షా ను శాలువతో సన్మానించి,పుష్పగుచ్చం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని, మండల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ చేస్తున్న కృషిని, ముఖ్యంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంలో చూపుతున్న చొరవను వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అనిల్, వినోద్, దౌలత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

బాసర ట్రిపుల్ఐటీ అవినీతిపై ఏసీబీ అధికారులతో విచారణ జరపాలని వినతి 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ఐటీలో జరిగిన అవినీతిపై,అక్రమ అడ్మిషన్ దందా పైన ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఓ ఎస్ డి. డా.మురళీ ధర్షన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో గత 2018 నుండి 2024 వరకు ఉన్న అధికారులు రూ.వందల కోట్లు విత్ డ్రా చేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై ఈడీ దర్యాప్తునకు కూడా సిఫారసు చేయించి నిందితులని కఠినంగా శిక్షించాలనీ పేర్కొన్నారు. అలాగే గత కొన్నేళ్లుగా గ్లోబల్ సీట్ల పేరుతో ట్రిపుల్ ఐటీ బాసరలో అక్రమ అడ్మిషన్ ల దందా కొనసాగుతుందని, మెరిట్ ను తుంగలో తొక్కి అక్రమంగా కొంతమంది బ్రోకర్స్/కన్సల్టెంట్స్/ఇనిస్టిట్యూషన్ నందలి కింది స్థాయి ఉద్యోగులతో కలిసి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇనిస్టిట్యూట్ కు చెల్లించకుండా ఏండ్ల తరబడి ఫీజులు పెండింగులో పెడుతూ కోట్లలో దందా సాగిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ నిర్ణయించిన (గ్లోబల్ సీట్లకు) ఫీజులకంటే అధికంగా ఫీజులు వసూలు చేసి ప్రతిభ ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తూ, అక్రమార్కులకు కోట్ల దందాలకు అవకాశం ఇస్తున్న గ్లోబల్ సీట్ల ను వెంటనే రద్దు చేసి జనరల్ మెరిట్ సీట్లను పెంచాలని, గ్లోబల్ సీట్ల విషయంలో జరుగుతున్న అక్రమ ఫీజుల దందా పై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కుంట హర్షవర్ధన్, స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్ గంగా ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, విగ్నేష్ ,అక్షయ్ ,మోహన్ మనీ, నాగరాజ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నిలుపుదాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

PAYALచిత్రం న్యూస్,ఆదిలాబాద్: అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ’99 రోజుల ప్రజా పాలన’ ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని అందరూ ఐక్యంగా అభివృద్ధి చేసుకుందామని, సర్పంచులు, కౌన్సిలర్లకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మైసమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన సర్పంచ్ మంచాల భూపతిరెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో  సర్పంచ్ భూపతి రెడ్డి మైసమ్మ ఆలయానికి గ్రామస్తులతో కలిసి గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులతో ఈ మైసమ్మ ఆలయం పనులు చేపట్టానన్నా రు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలచందర్, మాజీ ఎంపీటీసీ రాకేష్,వార్డ్ మెంబర్ సునీల్ గోహార్కర్, మాజీ ఎంపీటీసీ గోపతి విటోభా,నందు గౌడ్, సిద్రప్ సుభాష్, కదరపు ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.