Home Blog Page 3

ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేయాలి 

చిత్రం న్యూస్, అదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా టీఎన్జీవోస్ సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పీవో ను టీఎన్జీవోస్ జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీఎన్జీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. తిరుమల్ రెడ్డి, జిల్లా బాధ్యులు జి.గోపి, రాజేశ్వర్, నారాయణ, రవి , ఓం ప్రసాద్, రూరల్ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి అరుణ్, వార్డెన్ సంఘం అధ్యక్షుడు నర్సింలు, గోవిందు, శ్రీనివాస్, నవీన్, సంజీవ్, సాయి కుమార్, విజయ్ , సంజయ్, టీఎన్జీవో యూనియన్ మాజీ అధ్యక్షులు సంద అశోక్, మహిళా బాధ్యులు, వందన, సుజాత, రాధ, సంగీత, ఆశ జ్యోతి వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

రైతు భరోసా నిధులు విడుదల చేసేవరకు పోరాడతాం 

బీఆర్ఎస్  యువ నాయకులు సతీష్ పవార్ 

చిత్రం న్యూస్ బేల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో  పూటకోమాట మాట్లాడుతుందని, ఈ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతుల్లో ఏ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ యువ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అధ్యక్షతన, గ్రంథాలయ జిల్లా మాజీ చైర్మన్ రౌతు మనోహర్ సహకారంతో గ్రామ గ్రామాల్లో వెళ్లి రైతుల వద్ద నుంచి సంతకాల సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 70% రైతులు ఉన్నారని మూడు దపాలుగా రైతుభరోసా వేయకుండా వారితో చెలగాటం ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు సభబు అని అన్నారు. సంతకాల సేకరణతో హైకోర్టుకి సమర్పించడం జరుగుతుందని, రైతుభరోసా విషయాన్ని హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తుతాడని భయంతో ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేస్తామని ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు మూడు కిస్తీల రైతు భరోసా పడే వరకు తమ పోరాటం ఆగదని సూచించారు. ధర్నాలు, కలెక్టరేట్, అసెంబ్లీ ముట్టడీలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రే గంభీర్,మస్కె తేజ రావ్, మండల నాయకులు బాల్చందర్ పరాట్కర్ , జితేందర్ బెదుర్కర్,సర్పంచ్ ఖోడే విపిన్, విశాల్ గోడే , విట్టల్ వరడే,బత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర మండలంలోని సవర్గం గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం ఘనంగా సత్కరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సవర్గం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను గ్రామ సర్పంచ్. గాదెకర్ ముత్తు బాయ్,  ఉప సర్పంచ్ మంజూష ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ‘పరిశుభ్రతను కాపాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో గల ప్రతివాడలో మురికి కాలువల నుండి చెత్త చెదారాన్ని పోగుచేసి గ్రామ చివరన గల డంపింగ్ యార్డ్ లో  చెత్తను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ సర్పంచ్ పారిశుద్ధ్య కార్మికులకును అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అవాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం 

చిత్రం న్యూస్, బేల: 99 రోజుల “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా అవాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను పాలక వర్గం, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.గ్రామ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడుతూ, వారి సేవలకు గుర్తింపుగా గ్రామ సర్పంచ్ అనిల్ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు వారికి శాలువాలు కప్పి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సురేష్, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హీరాసుక జయంతి వేడుకలు:పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో హీరాసుక జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, హీరాసుక విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, హీరాసుక ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ప్రధాన్ సమాజం అభ్యున్నతికి చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు, ప్రధాన్ సంస్కృతిని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

హీరాసుక ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం:

హీరాసుక ఆశయాలు, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రధాన్ సమాజం ఐక్యంగా ఉండి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధాన్ సమాజ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

బాసర అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఈవో విజయరామారావు ఏఈఓ గంగా శ్రీనివాస్, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక వేద ఆశీర్వాద మండపంలో అర్చకులు వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు .వీరికి ఆలయ ఈవో విజయ రామారావు, ఏఈఓ గంగా శ్రీనివాస్ కమిషన్ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య కు ఆలయ మర్యాదలతో శాలువాతో ఘనంగా సన్మానించారు.బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు స్వామి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య బాసర రెండు రోజుల పర్యటనలో భాగంగా దేవస్థానంలోని రాజన్న నిలయం అతిథి గృహంలో రాములు స్వామిని కలసి దర్శించుకున్నారు. వీరి వెంట మహేందర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ సుకేష్ రావు, ఆలయ పీ ఆర్ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ఆశా వర్కర్ల వినతి 

0

చిత్రం న్యూస్, బైంసా: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నెరవేర్చేలా చూడాలని ఆశా వర్కర్లు శనివారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను నిర్మల్ జిల్లా బైంసాలోని అయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బీజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి, తాను ఆశ వర్కర్ల తరఫున మాట్లాడనున్నట్లు చెప్పారు. ఆశ వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన వారిలో సంఘ నాయకులతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద మొత్తంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

బాసర్‌లో టెక్ సందడి: అంతఃప్రజ్ఞ 2K-26 ఘనంగా ప్రారంభం

0

చిత్రం న్యూస్, బాసర : భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా విఖ్యాతి గాంచిన అంతఃప్రజ్ఞ 2K-26 యొక్క మొదటి రోజు మార్చి 13న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరలో అసాధారణమైన ఉత్సాహంతో ప్రారంభమైంది. వేలాది మంది విద్యార్థులతో ప్రారంభోత్సవ వేడుక సాయంత్రం 7:00 గంటలకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్  ఏ.గోవర్ధన్ అధికారికంగా ప్రారంభించారు. వేదికపై ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఇ. మురళీ ధర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె. స్వప్నిల్, కాకతీయ శాండ్‌బాక్స్‌తో అనుబంధంగా ఉన్న శ్రీ సత్యం కె.చౌబే, అధ్యాపకులు, అంతఃప్రజ్ఞ నిర్వాహక కమిటీ సభ్యులు విశిష్టంగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం క్యాంపస్ వేగంగా ఉత్సవ వాతావరణంతో నిండిపోయింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఒక చైతన్యవంతమైన గేమింగ్ అరేనాగా రూపాంతరం చెంది, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్‌లు, వీడియో గేమింగ్ సెటప్‌లతో సహా విద్యార్థులకు మెరుగైన డిజిటల్ అనుభవాలను అందించింది. భారీ జనసమూహాన్ని ఆకర్షించి విద్యుదావేశమైన వాతావరణాన్ని సృష్టించింది.vగేమింగ్ జోన్‌కు అనుబంధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణం సృజనాత్మకత, నవీనత, వినోదాన్ని ప్రదర్శించే విద్యార్థి నేతృత్వంలోని వైవిధ్యమైన స్టాల్‌లతో సజీవంగా మారింది. సాయంత్రపు అత్యంత ప్రశంసనీయమైన హైలైట్లలో ఒకటిగా నిలిచింది. వర్ణమయమైన దీపాలు, స్పందింపజేసే సంగీతంతో వెలిగిపోతూ, క్యాంపస్ వేడుక వాతావరణాన్ని వెదజల్లింది, విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాలను అన్వేషిస్తూ ఉత్సవ వాతావరణాన్ని ఆనందించారు.

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలో మార్చి14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 16 వరకు కొనసాగే పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు.నిర్దేశించిన సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ధరల పెంపుపై 16న ధర్నాకు సీపీఐ పిలుపు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల ఎదుట చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మీ, నగదు పంపిణీ వంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.