Home Blog Page 22

రామాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరాజ్

0

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెంలోని రామాయలం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరాజ్, ప్రధాన కార్యదర్శిగా గంగేశ్వర్, చిన్నయ్య, కోశాధికారులుగా రాజు,  గణేష్, కిట్టు, రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ప్రసాద్, శ్రీరామ్, నల్లగొండ మోహన్ నాయక్, బ్రహ్మచారి బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గానికి గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహణకు నూతన కమిటీ కృషి చేయాలని భక్తులు, గ్రామస్తులు నూతన కమిటీ సభ్యులను కోరారు. అలాగే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం

0

చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని కూర గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం పెద్ద ఎత్తున గ్రామస్తులు, దాతల సహకారంతో జరుగుతుందని ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు గుండేటి రామాంజనేయ శర్మ తెలిపారు. శనివారం కరంజి గ్రామానికి చెందిన నూతుల మహేందర్ రెడ్డి  కుటుంబం, కరంజి, దీపాయిగూడ సుందర సత్సంగ్ భజనలతో ఆలయంలో శోభ సంతరించుకుంది. ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

సదర్ మాట్ కాలువ సాధన దీక్షకు రైతులు

0

*మద్దతు పలికిన న్యాయవాదులు, మేధావులు, నాయకులు

*తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందించిన రైతులు

చిత్రం న్యూస్, కడెం: కొత్త సదర్ మాట్ ఆనకట్ట నుండి పాత సదర్ మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలని, చివరి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరుతూ శనివారం కడెం మండల కేంద్రంలో సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ఆధ్వర్యంలో సదర్ మాట్ ప్రత్యేక కాలువ సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలంలోని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పెద్దూర్, తండా, బెల్లాల,దిల్దార్ నగర్,ఎలగడప,లింగాపూర్, లక్ష్మి సాగర్ నచ్చన్ ఎల్లాపూర్ తదితర గ్రామాల నుండి వందలాది మంది రైతులు స్వచ్చందంగా తరలి వచ్చారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, న్యాయ వాదులతో పాటు మేధావులు, ఉద్యమకారులు, పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందజేశారు దీక్షలో సర్పంచులు విజయ్ కుమార్, స్టీఫెన్, రామాగౌడ్, చిట్టిటె ముత్తన్న, దండికి గంగన్న, లసేట్టి శేఖర్, జాగిరి శ్రీనివాస్,ముక్కెర శ్రీనివాస్,దశరథ్,కానూరి సతీష్,నవీన్,గద్దల దేవన్న, సదానందం,పల్లె సత్తన్న, నర్సింహా రెడ్డి,నారయణ, శంకర్,రాజేశ్వర్, రాజేందర్,బుక్య శేఖర్, వకీలు గంగన్న, సునారికారి రాజేష్, లింగన్న, రాజాగౌడ్, నాగరాజు, ప్రశాంత్,సందిప్, ఆది మల్లేష్, ప్రవీణ్, సురేష్ నాయక్, రాపర్తి శ్రీనివాస్,బాలు నాయక్, సత్యారావు, దాసరి రమణ, చిన్నరాజన్న, రాములు,భూమన్న, దుర్గం లక్ష్మి,ఆకుల లక్ష్మి,రాజన్న,మక్కి శంకర్, గిల్లి రమేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చిత్రం న్యూస్, జైనథ్: చారిత్రక ప్రసిద్ధి గాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పునరుద్ఘాటించారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరైన నేపథ్యంలో శనివారం  గ్రామస్తులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను, కోనేరు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో పని చేస్తున్నానని తెలిపారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు ప్రతి అభివృద్ధి పనిని ప్రతికూలంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇతరులను విమర్శిస్తేనే రాజకీయాల్లో హీరోలు అవుతామని కొందరు భ్రమపడుతున్నారని, అటువంటి రాజకీయాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని హితవు పలికారు. ప్రస్తుతం మంజూరైన రూ.1.50 కోట్లతో ఆలయ రూపురేఖలు మార్చడంతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సామ రూపేష్ రెడ్డిని సన్మానించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్,బేల:  బేల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఇటీవల రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఆరోగ్య జాతర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలకు విరాళాలు అందజేసిన దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించగా సామ రూపేష్ రెడ్డి చేసిన ఉదారతను గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం పూట చికెన్ భోజనము  ఏర్పాటు చేశారు. అనంతరం స్వీట్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రెటరీ శ్రీ దుర్గే భగవాన్ దాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ప్రేమ్ రాజు గౌడ్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి స్వామి, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

బేల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్ ఓ ప్లాంటును ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం, న్యూస్ బేల: బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంటుని జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణకుమార్ ఆరోగ్య పాఠశాల, పాఠశాల యొక్క ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ కు వివరించారు. పాఠశాలలో దాతలు అందించిన రూ.3 లక్షలతో విద్యార్థుల కోసం మంచి నీటి పథకంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పారు.మండలానికి చెందిన పలువురు దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాలను ముందుగా జిల్లాలో 130 పాఠశాలలతో ప్రారంభించి ఇప్పుడు 250 పాఠశాలలో ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య అలవాట్లు మార్చడం కోసమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలో బేల మండల ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, మండల తహసీల్డార్ రఘునాథ్ రావు, ఎంపీడీవో అంజనేయులు, మండల విద్యాధికారి మహాలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గృహజ్యోతి పథకం: జీరో బిల్లు రాని వారికి ప్రభుత్వం కొత్త ఆప్షన్

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో భాగంగా అర్హులైనప్పటికీ జీరో (0) బిల్లు రాని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద జీరో (0) కరెంట్ బిల్లు రాని వారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. జీరో బిల్లు రాని అర్హులైన వినియోగదారులు తమ మండలంలోని MPDO కార్యాలయం వద్దకు లేదా మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ నివాసితులై ఉండి, తెల్ల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) కలిగి, వారి ఆధార్ నంబర్ విద్యుత్ కనెక్షన్ కస్టమర్ IDతో లింక్ అయి ఉండాలి. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉన్న గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కావలసిన పత్రాలు:కరెంట్ బిల్లు, చివరిగా చెల్లించిన బిల్లు రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అన్ని అర్హతలు ఉండి కూడా బిల్లు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సవరించిన బిల్లు (జీరో బిల్లు) జారీ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అర్హులైన వినియోగదారులు జీరో బిల్లును పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ ప్రద్యుమ్న

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ ఎస్సీ హాస్టల్ ను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ)  ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కప్పుకునేందుకు  దుప్పట్లు ఉన్నాయా..విద్యార్థులు ఎంత మంది ఉన్నారంటూ ఆరా తీశారు. మీరు చక్కగా చదువుకోండి.  ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని పరిష్కరిస్తానన్నారు.  ఆయన వెంట గ్రామస్తులు అనిల్, సంజీవ్, శ్రీకాంత్, సంతోష్, దమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ హితమైన కాటన్ మాంజాను ఉపయోగించాలి 

* చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన 

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కేంద్రం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేటర్.డా అమృత్ కుమార్, చేయూత ఫౌండేషన్ ఛైర్మన్ డా.యన్.టి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డా.యన్.టి. రమణ మాట్లాడుతూ..పండగల సమయంలో గాలి పటాల కోసం  విస్తృతంగా ఉపయోగిస్తున్న చైనా మాంజా దారం ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని, చైనా మాంజా దారంలో గ్లాస్ పౌడర్, నైలాన్ దారం వంటివి ఉపయోగించడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. పక్షులు, జంతువులు మృతి చెందుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, యువత, ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లుతున్నారని, ప్రత్యేకంగా రోడ్లపై వేగంగా ప్రయాణించే వాహనదారుల మెడ, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు కలుగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చైనా మాంజా తయారీ, విక్రయాలు, వినియోగం నిషేధించాలన్నారు. స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డా.అమృత్ కుమార్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు పిల్లలను చైనా మాంజాకు దూరంగా ఉంచాలన్నారు. పర్యావరణ హితమైన కాటన్ మాంజా మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ సంస్థలు & చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల నేరడిగొండ ప్రధానోపాధ్యాయురాలు, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు మీనా, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.