Home Blog Page 18

గిమ్మ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న వినతి

0

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ మండలం గిమ్మ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్  ప్రద్యుమ్న సమస్యలపై విన్నవించారు. గిమ్మ గ్రామంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన  చంద్ర నారాయణ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, ఆలయ పునరనిర్మాణానికై  నిధులు మంజూరు చేయాలని, పెన్ గంగా తీరంలోని ఓంకారేశ్వరాలయం అభివృద్ధికి కృషిచేయాలని విన్నవించారు. అర్హత కలిగిన.కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు. గిమ్మ నుంచి మాండగడ, పిప్పర్వాడ వరకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని వివరించారు. ఇది వరకు నిర్మించిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు.

 

వరుస దొంగతనాల కేసును చేధించిన బేల పోలీసులు

0

*అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

*వివరాలను వెల్లడిస్తున్న బేల ఎస్సై ఎల్ ప్రవీణ్ కుమార్

చిత్రం న్యూస్, బేల: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసును బేల పోలీసులు చేధించారు. శనివారం నిందితుడి వివరాలను బేల ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అభి అలియాస్ కుంచెలవార్ అభినవ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బేల గ్రామంలో ఫర్టిలైజర్ షాపులు, బ్యాంక్, ఇతర దుకాణాల షట్టర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డానని తెలిపారు. దొంగతనం చేసిన నగదును చేనులో దాచి పెట్టాడన్నారు.దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార,దుస్తులు, మొబైల్ ఫోన్,  మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దొంగలించబడిన నగదు లెక్కించగా మొత్తం రూ.58 వేలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..సీఎంకు విన్నవించిన సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ 

0

చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండని సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్ సాయి వర్మ సమస్యలపై విన్నవించారు. నూతనంగా ఏర్పడిన మండలం కావడంతో సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు తాగునీటి సదుపాయాలు, డ్రైనేజి, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, స్మశానవాటికకు వెళ్లేందుకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేసేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు.

సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ-మహారాష్ట్ర నడుమ  పెన్ గంగా నదిపై భోరజ్ మండలంలో నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేసేందుకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

 

జంగుబాయి దేవతకు పూజలు 

0

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని దత్తగూడ జామిని పంచాయతీ దత్తగూడ గ్రామంలో అడవి తల్లి, ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి దేవతకు పూజలు చేశారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో ఆదివాసీ గిరిజనులు జంగుబాయి  దేవతను ఘనంగా పూజిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొడప రాము, చిన్న భీమా, కొడప లక్ష్మి బాయి, కొడప సోనేరావు తదితరులు పాల్గొన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించిన సామ రూపేష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ  పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేత జీవైసి

0

చిత్రం న్యూస్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్‌ కప్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి.విద్యానగర్, ఆటో యూనియన్, అంబేద్కర్ యువజనసంఘం, జ్ఞానోదయ యువజన సంఘం పేరుతో మొత్తం 4 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో జ్ఞానోదయ యువజన జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్‌ పోటీల్లో జీవైసి 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌ దిగిన ఏవైసీ జట్టు ఐదు ఓవర్లలో 18 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు టీపీఎల్ చైర్మన్ రత్న ప్రకాష్ ప్రైజ్ మని అందజేశారు.

శివాలయం నిర్మాణానికి రూ.21వేల నగదు విరాళం 

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పెన్ గంగ నది ఒడ్డున నిర్మిస్తున్న భారీ శివాలయ నిర్మాణానికి బేలలోని హనుమాన్ ఫెర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి విరాళం అందజేశారు. గురువారం ఆ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.21 వేలు విరాళo అందజేశారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

గాలిపటం ఎగురవేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్ధి

0

చిత్రం న్యూస్, భోరజ్: వినోదం కోసం ఎగురవేసే గాలిపటం ఓ విద్యార్థి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం బాలాపూర్‌ గ్రామంలో గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బాలయోగి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బాలయోగి తన ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా, గాలిపటం దారం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ ప్రవాహం దారం ద్వారా విద్యార్థి కి సోకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో  శరీరం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే గమనించిన కుటుంబీకులుకి చి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భజన పోటీలకు ఆహ్వానం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భజన పోటీలు నిర్వహిస్తున్నారు. 24-01-2026 శనివారం రాత్రి 8:00 గంటల నుండి పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ బహుమతి రూ.11 వేలు, రెండోబహుమతి రూ.5 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు, ఉత్తమ గాయకుడు రూ.వేయి, ఉత్తమ వాద్య సంగీతానికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ప్రతి భజన మండలిలో ఏడుగురు సభ్యులు ఉండాలని,భక్తి గీతాలు, తత్వగీతాలు పాడవచ్చని (చూసి పాడకూడదు)  పేర్కొన్నారు. ప్రదర్శించే బృందమునకు 30 నిమిషములు సమయం ఉంటుందన్నారు.భజన మండలి వారు 5 పాటలు పాడాలని (సమయ పాలన పాటించాలి), ఈ 5 పాటలలో శ్రీ వేంకటేశ్వరుని గురించి ఒక భక్తి గీతం పాడాలని తెలిపారు.భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాలాలు) ఎవరివి వారే తెచ్చుకోవాలన్నారు.  తుది నిర్ణయంన్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.పాల్గొనేవారు ఫోన్ నంబర్లు 9441015240, 9441239091 కి సంప్రదించాలని సూచించారు.