Home Blog Page 17

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉద్యోగులు సంఘటితంగా ఉంటూ హక్కుల సాధన కోసం పాటుపడాలని టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఏ. నవీన్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ లోని బజరంగ్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ లోని ప్రతి పంచాయతీ కార్యదర్శి టీఎన్జీవో సభ్యత్వం తీసుకొని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరంలో విలీనం చేశారు. అనంతరం జిల్లా ఫోరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా జె.సంజీవరావు, కార్యదర్శిగా కె.అరుణ్ రెడ్డి, కోశాధికారి అనిల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు డి నాగభూషణ్, ఈ రామదాస్, బి. వినోద్ , ట్రెజరర్ అనిల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్ జాయింట్ , సెక్రెటరీ గంగన్న, ఉమెన్ జాయింట్ సెక్రెటరీ నస్సేమ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ తో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎటువంటి సమస్య వచ్చిన టిఎన్జీవోస్ అండగా ఉంటుందని ఏ.నవీన్ కుమార్ తెలిపారు. టీఎన్జీవో యూనియన్ లో పంచాయతీ కార్యదర్శులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పించారు. ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్నికైన నూతన కార్యవర్గం (03) సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్,సునీల్ రెడ్డి,రాఘవేంద్ర, దుర్గయ్య,నాగభూషణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

కూర గ్రామంలో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోర్ వేయించిన నేతలు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కూర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ప్రాంగణంలో బోర్ వేయించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ..విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే స్పందించి బోర్ వేయించినందుకు ఎమ్మెల్యే శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి, సిడం రాకేష్, బోగి ఉషన్న, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఉపాధ్యాయులు నాగరాజు, శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.తమ సమస్యను గుర్తించి పరిష్కరించినందుకు పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా జాతరకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి వచ్చిన ఆయన గుడి హత్నూర్ బైపాస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అసిఫుల్లాఖాన్, గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీల, గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు కరుణాకర్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కుప్తి గ్రామానికి చెందిన వారు నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా ఏరియా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, మృతి చెందిన వారి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

వసంత పంచమి వేడుకలకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలి

0

వసంత పంచమి వేడుకలకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలి

*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, బాసర: బాసరలో ఈనెల 23న నిర్వహించే వసంత పంచమి వేడుకలకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి అధికారులతో, బాసరలోని ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి ఏర్పాట్ల వివరాలను శాఖల వారి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి పండుగను పురస్కరించుకొని, బాసరకు వచ్చే భక్తులను సంఖ్యను ముందుగా అంచనా వేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఆలయాన్ని అందమైన పూలు, లైటింగ్ తో ముస్తాబు చేయాలని తెలిపారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలన్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలు, పాలు, పండ్లను అందించాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, బయోటాయిలెట్ లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం, గోదావరి పుష్కర ఘాట్ లలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఎక్కువ సంఖ్యలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు సరిపడినంత ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. శిశువులకు పాలిచ్చేందుకు వీలుగా బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసరాలన్నీ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంచాలన్నారు. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలని అందుబాటులో ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వైద్యులను, అత్యవసర మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పుష్కర ఘాట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి భక్తులు ఆలయానికి సులువుగా చేరుకునే విధంగా రోడ్డు మార్గాన్ని తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రధాన ప్రాంతాల నుంచి భక్తుల రద్దీ మేరకు సరిపడినన్ని బస్సులు నడపాలన్నారు. ఆలయంలో ప్రవేశం, నిష్క్రమణ, త్రాగునీరు, మరుగుదొడ్ల వివరాలు తెలిపే విధంగా సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి ఘాట్ ప్రాంత ప్రదేశంలో నిరంతర పారిశుద్ధ్యన్ని కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. గోదావరి నదిలో స్నానమాచరించిన స్త్రీ, పురుష భక్తులకు వేరువేరుగా దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకూడదు: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం రోజున, సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎక్కడ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా తగినంత మంది పురోహితులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ  సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, దేవాలయ ఏఈవో సుదర్శన్ గౌడ్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో 353బీ జాతీయ రహదారికి ఇరువైపులా టవర్లకు విద్యుత్తు తీగల ఏర్పాటు పనులు కొనసాగనుండడంతో మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. చప్రాల సబ్ స్టేషన్, దహెగావ్ ఫీడర్ విద్యుత్, బేల గ్రామ పంచాయతీ పరిధిలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

క్యారం ఆడి..న్యాయవాదుల క్రీడలను ప్రారంభించి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రతి రోజు కక్షిదారులు, కేసులు, తీర్పులు తదితర అంశాలతో నిత్యం బిజీగా ఉండే న్యాయవాదులు క్రీడలతో మానసికోల్లాసం పొందుతారని జిల్లా  ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో  న్యాయవాదుల క్రీడలను క్యారం ఆడి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయవాదులు లోక ప్రవీణ్ రెడ్డి, కేమ శ్రీకాంత్, గ్రహేష్ తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన బంగారం ధర 

0

చిత్రం న్యూస్,వెబ్ డెస్క్: బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ గంటల వ్యవధిలోనే పసిడి ధర రూ.2,460 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,240కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  వేర్వేరు ప్రాంతాల్లో ఈ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

 

సదల్‌పూర్‌ ఆలయంలో మాజీ మంత్రి జోగు రామన్న పూజలు

0

చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పాలకుల వల్ల అన్ని వర్గాల ప్రజలు, రైతులు పరేషాన్ లో ఉన్నారని వారిని ఆ భగవంతుడే కాపాడాలని వేడుకున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బేల మండలం సదల్పూర్ లోని అతి ప్రాచీన శ్రీ బైరందేవ్, మహాదేవ్ జంగి జాతర సందర్భంగా సోమవారం ఆయన దేవుళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. బేల మండలం అభివృద్ధికి, సదల్‌పూర్‌ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికి తెలుసన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పాలనతో ప్రజలకు విముక్తి కల్పించాలని ఆ బైరం దేవ్, మహాదేవ్ లను వేడుకునట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లప్వార్, సతీష్ పవార్, విపిన్ ఖోడే, ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యాంరావు, అరుణ్ కొడప, గ్రామ సర్పంచ్ మంగేష్ మర్సుకోల, నందు సిడం, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ముంబై సాహిత్య సమ్మేళనం ముంబైలో సుకుమార్ పేట్కులే కి ఘన సన్మానం

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కి నవి ముంబైలోని పన్వెల్లో ఆదివారం జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు. కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్ పన్వెల్ (నవీ ముంబై) మరియు పంచశీల్ తరుణ్ మండల్ సావర్గం (ముంబై) లు సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమ్మేళన, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సాహిత్యం తెలుగు, మరాఠి, హిందీ భాషల్లో అనువాద రచనలు  చేస్తూ సాహిత్య సామాజికసేవ చేస్తున్నందుకు గుర్తింపుగా సుకుమార్ పేట్కులే ను ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ హిందీ, మరాఠీ, ఉర్దూ బహుభాషా కవి మధుబావల్కర్ ను సహితం కార్యక్రమ నిర్వాహకులు మెమెంటో, శాలువా, పూలమాల, బొకే, బహుజన సాహిత్యాన్ని బహూకరించి ఘనంగా సన్మానించారు. నవి ముంబై కి పన్వెల్ చెందిన కార్యక్రమ నిర్వాహకులు నాగనాథ్ డోలారే రచించిన రెండు మరాఠీ కవిత సంపుటులు మానవతే చే సింహాసన్, లావణ్యా లేని అనే పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ అవార్డును మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ తదితరులు ప్రధానం చేయగా పూణేకి చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్ తో పాటు మొత్తం 14 మందిని ఎంపిక చేసి ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన మహనీయుల ఆశయ సాధన కోసం గత 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నందుకు గాను తనకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ద్వారా గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాగే సాహిత్య సామాజిక క్షేత్రంలో  మున్ముందు పనిచేయడానికి ఈ సన్మానం దోహద పడుతుందని ఆయన తెలిపారు.