Home Blog Page 153

గుడుంబా విక్రయిస్తే చర్యలు_ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్

0

గుడుంబా విక్రయిస్తే చర్యలు_ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  నిషేధిత గుడుంబా విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాబ్జిపేట్ లో కొందరు వ్యక్తులు గుడుంబా తయారుచేసి విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. బాబ్జిపేట్ కు చెందిన జాదవ్ లక్ష్మీ వద్ద 5 లీటర్ల గుడుంబా దొరికిందన్నారు. జాదవ్ లక్ష్మిని విచారించగా సిరిచెల్మలోని మహమ్మద్ షౌకత్ కిరాణ దుకాణంలో ఆమె కొన్నట్లు పేర్కొందన్నారు. అనంతరం కిరాణా దుకాణంలో దాడులు నిర్వహించగా 300 కిలోల నల్ల బెల్లం, 9 కిలోల పటికను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత గుడుంబా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ విజయలక్ష్మి, సిబ్బంది బాపురావు, మౌనిక, అరుణ, సంధ్యారాణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

కోలూర్‌లో కూలిన పెంకుటిల్లు_తప్పిన పెను ప్రమాదం

0

కోలూర్‌లో కూలిన పెంకుటిల్లు_తప్పిన పెను ప్రమాదం

చిత్రం న్యూస్, తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూర్ గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన షేక్ ఉమర్‌కు చెందిన ఈ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఆ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.  ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.

బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు

0

బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు

*గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో వరదనీరుతో గ్రామం అతలాకుతలం గా మారింది. ఆదివారం రోజున హెల్త్ క్యాంప్ ను తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యురాలు నైనత నిర్వహించారు. ఎంపీడీవో మహేష్ కుమార్, తహసీల్దార్ నారాయణ గ్రామంలో పర్యటించి వరద నీటిలో మునిగిన ఇండ్ల బాధితుల వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షంతో రైతులు ప్రధానంగా పంట చెన్లకు వెళ్ళే లో-లెవల్ వంతెన పక్కన దెబ్బతిన్న దారిని పరిశీలించారు. వర్ష కాలం దృష్ట్యా ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు చక్రవర్తి, ముజీబ్, గ్రామస్థులు రఘువీర్ రెడ్డి, ఉషన్న, రాకేష్ రెడ్డి, సంజీవ్ ,అభిజిత్ రెడ్డి, ఆనంద్ రావ్, నరేష్ రెడ్డి,అశన్న, చిన్నారెడ్డి, ఎల్లన్న, నర్శింగ్ రెడ్డి,గండన్న,కిస్టు తదితరులు ఉన్నారు.

పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

0

 పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులోని పెన్ గంగా నదిని రఘునాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఎగువలో ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్ట్ లో నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగిందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో పంట పొలాల్లో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో  ప్రజలు ఆత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చిన సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన బెదోడ, కాప్సి గ్రామాలను నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐ సాజిద్ ఖాన్, గ్రామ కార్యదర్శి వేణుగోపాలరావు, వీడీసీ అధ్యక్షుడు, భూపతి రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కదరపు ప్రవీణ్, సతీష్ గేడాం తదితరులున్నారు.

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

0

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పీఏసీఎస్ గోదాములో యూరియా బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో ఎగువ నుండి వచ్చిన నీరు గోదాంలోకి అధికంగా వరద నీరు రావడంతో యూరియా బస్తాలు తడిసిపోయాయి. తడిసిన యూరియా బస్తాలని  కార్మికులు తీసే ప్రయత్నం చేశారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

0

సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా మండలం లోకేశ్వరం నగర్ గ్రామానికి చెందిన సావిత్రి, సామ్రీన్ బేగం అనే లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను ( CM Relief Fund ) శనివారం అందజేశారు.ఆసుపత్రి  ఖర్చులకోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముస్తాఫ్ సహకారంతో నగర్ గ్రామపంచాయతీ కి చెందిన సావిత్రికి రూ.30 వేలు, సామ్రీన్ బేగంకు రూ.26 వేలు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కును బాధితులకు శనివారం మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ..సీఎం సహాయనిది పథకం పేదలకు వరం లాంటిదన్నారు. ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి,మాజీ ఉపా సర్పంచ్ ముస్తాఫ్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జన్మదిన వేడుకలు

0

టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అత్రం సుగుణక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సొనాల మండల కాంగ్రెస్ శ్రేణులు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ముద్దుబిడ్డ, అనునిత్యం ప్రజల కోసం ముందుండి హక్కులకై పోరాడే నాయకురాలు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క  జన్మదినం సందర్భంగా సొనాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గాజుల పోతన్న, రమేష్ బత్తుల మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుండి, నేడు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎదగడం చాలా గర్వకారణం అని, ఎన్నో ఆదివాసీ ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెట్ల పెల్లి అనిల్,  మండల నాయకులు పాల్గొన్నారు.

తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు

0

తిలక్ నగర్ కాలనీలో జలమయమైన ఇళ్ళు

తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉదారత చాటిన సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోనితిలక్ నగర్ కాలనీవాసులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేయించారు. భారీ వర్షాల కారణంగా కాలనీలో ఇండ్లు నీట మునగడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న  ఆయన వెంటనే కాలనీకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి నుండి వర్షం కారణంగా శనివారం ఉదయం నుండి చాలా కుటుంబాలు వంట చేసుకోలేని పరిస్థితి ఉండడంతో వెంటనే దాదాపు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయించి ఉదారత చాటారు సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి.

రోడ్లు, కల్వర్టు నిర్మిస్తాం_బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ 

0

*పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

*కాలనీవాసుల ఇబ్బందులను తొలగించిన సామాజిక సేవకుడు చట్ల ఉమేష్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాయి నగర్ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఇండ్లను, తెగిన కల్వర్టును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. కాలనీవాసులకు ధైర్యం చెప్పి పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. త్వరలోనే రోడ్లు, కల్వర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ఉన్నారు.

బోథ్ లోని సాయినగర్ కాలనీలోని రాత్రి నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న బ్రిడ్జ్ కొట్టుకుపోయి వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది.  దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సామాజిక సేవకుడు చట్ల ఉమేష్ దృష్టికి సాయి నగర్ యువత తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అక్కడికి చేరుకొని  జేసీబీతో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చేయించారు. రోడ్లపైన నిలిచిన వరద నీరు వెళ్లేందుకు దారి చేయించారు. కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కుండపోత  వర్షం.. గ్రామాలు అతలాకుతలం

0

కుండపోత  వర్షం..గ్రామాలు అతలాకుతలం

*జలమయమైన రోడ్లు, నీట మునిగిన ఇళ్ళు, పంటలు, గ్రామాలకు నిలిచిన రాకపోకలు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి జైనథ్, భోరజ్ మండలాల్లోని గ్రామాలు అతలాకుతంగా మారాయి. జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలోని పలు ఇళ్ళు, పంట చేలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.  రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన కుంచపు గణేష్, ఓల్లేపు మారుతి, మంజుల రమేష్, భూతం భీమయ్య  ఇళ్ళ లో వరదనీరు చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యవసర సరకులు తడిసిపోయాయి. ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వాపోయాయి.

భారీ వర్షంతో పత్తి, సోయా పంటలు నీట  మునిగిపోయాయి.  ప్రభుత్వం స్పందించి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.