Home Blog Page 152

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 

0

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 

చిత్రం న్యూస్ బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని అంజన స్టూడియో ఆవరణలో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం  నిర్వహించారు. ప్రముఖ ప్రపంచ ఛాయాచిత్ర పితామహుడు జుకులాస్ లూయిస్ డాగురే మండే 171 వ వర్ధంతి సందర్భంగా బోథ్, సొనాల మండలాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫొటో వీడియో గ్రాఫర్స్ పాల్గొని లూయిస్ డాగురే కు ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఫొటోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. ఫొటోగ్రపీ అధ్యక్షులు బుస లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీ అంటే సృష్టికి ప్రతిసృష్టిగ అద్దం పట్టేది ఒక్క ఫొటోకు మాత్రమేనన్నారు. ప్రతి సన్నివేశం ప్రతి మధుర క్షణాలను పపదే గుర్తు చేసి అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేసేది ఫొటో మాత్రమేనన్నారు. మండల సభ్యులు రంజిత్, ముక్కల రాజేశ్వర్,  కాడేరుగుల గణేష్, నరేష్ కుమార్, రవీందర్, లక్ష్మణ్, దేవేందర్, కుశాల్ రెడ్డి,నితీష్ గౌడ్, కాడేరుగుల రాజశేఖర్, సురేష్, ప్రకాష్, జీకే కిరణ్. తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి

0

ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి

చిత్రం న్యూస్, భైంసా: లోక్‌ షాహిర్, సాహిత్య సామ్రాట్‌ అన్నా బాహు సాఠే 105 జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా  భైంసా మండలంలోని వాలేగాం లో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్నా బాహు సాఠే సాహిత్య సామ్రాట్, అన్నా బాహు సాఠే మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, అన్నా బాహు సాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసిన అన్నా బాహు సాఠే కృషిని అందరూ స్మరించుకున్నారు. కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన మహా యోధుడని కొనియాడారు. నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య సామ్రాట్ మాదిగ సంఘం సభ్యులు కత్తి.బాబు,ఎ.సాయినాథ్,బీ.భోజన్న, పొచ్చిరాం, ఆనంద్, అడేల్లు, దినేష్, మారుతి, గంగాధర్, లక్ష్మన్, కె.సాయినాథ్, తరుణ్, శ్రీకిష్ణ, కె.బాబు, నరేష్, వీడిసి సభ్యులు,బీ.బాబు, కె.ఆనంద్,మానాజీ మల్లేష్, శ్యాంరావు , పోతన్న, రాములు, గంగాధర్, రాజు, శంకర్, భారత బాయి, లక్ష్మి, ఈశ్వర్ బాయి, సరస్వత, ఆనందబాయి, జనాభాయి, ఆడేల బాయి, రాజు బాయి, సాగర్ బాయి, అంబు భాయి మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు కన్నీటి కష్టం 

0

అన్నదాతకు కన్నీటి కష్టం 

*భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు 

*నదులు, వాగుల సరిహద్దు ప్రాంతాల్లో భారీగా నష్టం 

*పలు చోట్ల కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు 

*నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు 

*వరద ప్రాంతాలను పరిశీలించిన  ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు పొంగి పోర్లడంతో సమీప పంట పొలాలను వరద ముంచేత్తింది. దీంతో ఏపుగా పెరుగుతున్న పత్తి, సోయా, కంది తదితర పంటలు నీట మునిగాయి. మిగతా చోట్ల రోజుల తరబడి పంటలు నీళ్లలోనే ఉండటంతో తెగుళ్ల భారిన పడి ఎదుగలేని పరస్థితికి చేరుకోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోపక్క అనేక చోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు

అన్నదాతకు తీరని వేదన

ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పంటలకు మేలు జరగగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం తీవ్ర నష్టం చేకూర్చింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలోని జైనథ్, బేల, భీంపూర్, బోరజ్ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వీటితో పాటు వివిధ మండలాల్లో వాగులు, వంకలు ఉదృతం గా ప్రవహించి పంట చేలలోకి వెళ్లడంతో పాటలు నీట మునిగాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిగతా మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే మాదిరి పంటలు నష్టపోయినట్లు తెలిసింది. పూర్తి స్థాయి సర్వే చేస్తే ఎంత మేర పంటలు నష్టపోయాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది.

రోడ్లు, కల్వర్టులకు నష్టం

భారీ వర్షాలకు పంటలతో పాటు పలు చోట్ల రోడ్లు, కల్వర్టులు వరద దాటికి తెగిపోవడంతో రూ.కోట్ల లో నష్టం జరిగింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఆదిలాబాద్ పట్టణంలో శివారులో కాలనీల్లోని తట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు స్వాంతన కలిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమాచారం అందించాలని చెబుతున్నారు. అటు పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తం గా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టెందుకు డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

నేడు విద్యా సంస్థలకు సెలవు

0

నేడు విద్యా సంస్థలకు సెలవు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

భైంసాలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

0

భైంసాలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

*పాల్గొన్న బీసీ సంఘం, జనసేన పార్టీ నాయకులు

చిత్రం న్యూస్,భైంసా:  బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసి సంఘం జిల్లా నాయకులు సుంకేట పోశెట్టి, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం ఆవరణలో సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను స్థానిక బీసీ సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్, రజక సంఘం నాయకులు శ్రీను, ముత్యం, సాయినాథ్, భూమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

0

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

* మానవత్వం చాటుతున్న  భైంసా కు చెందిన నవీన్, మోహన్

చిత్రం న్యూస్, భైంసా: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతుంటారు. అలాంటే వారిని ఆదుకుకునేందుకు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఇద్దరు ఆపద్బాంధవులు సాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. వారు విధుల్లో ఎంత బిజిగా ఉన్నా తోటి వారికి సాయం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా వాసులు నవీన్ , మోహన్ లు. అత్యవసరంగా భైంసా జీడీఆర్ హాస్పిటల్లో ప్రభు అనే పేషంట్ కు ఎ పాజిటివ్ రక్తం కావాలి అని అనగానే వెంటనే వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

పొంగిపొర్లిన వాగులు..నిలిచిపోయిన రాకపోకలు

0

పొంగిపొర్లినవాగులు..నిలిచిపోయిన రాకపోకలు

*తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజల కష్టాలు

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అదిలాబాద్ నుండి జైనాథ్, బేల మండలాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధం అయ్యాయి. భోరజ్ మండలం తరోడ, జైనథ్ మండలం నిరాల గ్రామం దగ్గరలో ఉన్న లో-లెవల్ వంతెనపై నుండి వరద నీరు రావడంతో. రెండు వైపులా రహదారులు మూసుకుపోయాయి.  దాదాపుగా ఐదు గంటల పైగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా

0

ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యాసన సామాగ్రి మేళ (TLM) ఎంతగానో ఆకట్టుకుంది. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు సృజనాత్మకతతో తయారుచేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. అనంతరం 10 బోధనోపకరణాలు జిల్లా స్థాయికి  ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో మండల నోడల్ అధికారి కదం మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీఎల్ఎంలు ఎంతో దోహద పడతాయన్నారు. వెనుకబడిన విద్యార్థులకు సులువుగా అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచవచ్చన్నారు.. కార్యక్రమంలో సీఆర్పీ లు ఆర్.వెంకన్న, విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

0

ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

చిత్రం న్యూస్, బోథ్ : ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఎస్ఐ శ్రీ సాయి తో కలిసి నిందితుడి  వివరాలు సోమవారం  వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సంపత్ నాయక్ తండా, టివిటి, పార్ది (బి) గ్రామాల్లోని యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి రాథోడ్ సంజువ్ దగ్గర నుండి 1,50,000 వేలు, రాథోడ్ బాపురావు నుండి 1,20,000 వేలు, మచ్చేందర్, జంగు, గణేష్, బాలు, అను నలుగురు వ్యక్తుల నుంచి 70 వేలు తీసుకున్నాడు. ఇలా మొత్తం కలిపి 5,50,000 వేలు తీసుకొని వీరిని మోసం చేశాడన్నాడు. వీరంతా కలిసి మావిడాల సతీష్ పైన ఫిర్యాదు చేయడంతో  బోథ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశామన్నారు. మావిడాల సతీష్ ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు

0

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపల్లి కాంతయ్య ఇంట్లో పెంచుకొంటున్న బ్రహ్మ కమలం పువ్వులు ఆదివారం రాత్రి వికసించాయి. దీంతో ఉపాధ్యాయుడు కాంతయ్య దంపతులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క నాటామన్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసింద‌ని ఆమె చెప్పారు. ఆ పుష్పాలను స్థానిక ఆలయానికి అందజేశామని చెప్పారు. అరుదైన, ప్రత్యేకత కలిగిన పుష్పం త‌మ‌ వీధిలో విక‌సించ‌డంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.