Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 15

తెలంగాణకు చలి హెచ్చరిక: రాబోయే పది రోజులు గజగజే!

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 11 నుండి 19 వరకు, ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17 మధ్య కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా బలమైన శీతల వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇది గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 8 నుండి 10 రోజుల పాటు చలి ప్రభావం అధికంగా ఉండనుంది.

మ్యాప్‌లో పింక్ రంగుతో గుర్తించిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుము రంభీం, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చు. బ్లూ రంగుతో గుర్తించిన హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుండి 14°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

గ్రీన్ రంగుతో గుర్తించిన దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో (ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో) ఉష్ణోగ్రతలు 14°C నుండి 17°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు చలి నుండి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం.

సాయిలింగి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

0

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆదివారం అడప లచ్చన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన సతీమణి గౌరు బాయి జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులున్నారు.

భారత హాకీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత హాకీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్ ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత హాకీ సమాఖ్య (IHF)కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) గుర్తింపు లభించి 7 నవంబర్  2025తో వందేళ్ల మైలురాయిని చేరిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో  ఉన్న క్రీడాకారులు ఇతర క్రీడలతో పాటు హాకీలోను రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం  కలుగుతుందన్నారు. హాకీలో గెలిచిన క్రీడాకారులకు లోక ప్రవీణ్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో  గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థ సారథి, కోచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు సముచిత న్యాయం కలిపించాలనే ఉద్దేశ్యంతో ప్రజా ప్రభుత్వంను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు, నిరుపేద ప్రజలకు, మహిళలకు అందరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేరేలా ఆయన ఒక ఆశా కిరణంల వచ్చారని కొనియాడారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో ఇరవై ఏండ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్, మాజీ  జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, వామన్ వాంకడే, నాయకులు ఘన్ శ్యామ్ గవండే, సుదాం రెడ్డి, రూప్ రావు వాంఖడే, అడే శంకర్, గేడం మాదవ్, చంద్రకాంత్, కన్నె రాజు, అవినాష్ ఖడ్సే, ఘన్ శ్యామ్ గోడే, రమేష్ పటేల్, భీo రావ్, యువజన నాయకులు అవినాశ్ గోడే, సాగర్ థాక్రే, శంకర్ భోక్రే, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వప్నకు సన్మానం 

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో జిల్లా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించి బాధ్యతలు చేపట్టిన తలమడుగు గ్రామానికి చెందిన వి.స్వప్న ను సహకార యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు ముజఫర్ హుస్సేన్, శారద, ఉద్యోగులు దినేష్, లక్ష్మీ, నయీం, తౌఫీక్, రజినీకాంత్, దీరేష్, అమరేష్, ఆశ జ్యోతి, సంజయ్ ,దేవుబాయి, రజిత, శశికళ, నరేష్ కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మశాల (బి)లో  “పోలీసులు మీకోసం”  కార్యక్రమం

0

చిత్రం న్యూస్, బేల: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని మశాల (బి)లో  సైబర్ క్రైమ్ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గ్రామంలో  అనుమానిత వ్యక్తులు కనబడిన, ఆకతాయిలు వేధించిన,  ఇబ్బందులు కలిగించిన 100 డయల్ చేయాలన్నారు. పోలీసులు వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తారన్నారు. బేల ఎస్సై ఎల్. ప్రవీణ్ మాట్లాడుతూ..గ్రామంలో ఎవరైనా దేశీదారు అమ్మినా, గంజాయి విక్రయించిన, పండించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసులకు సమాచారం అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు తలెత్తితే పోలీస్ స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవం

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన లక్ష దీపోత్సవ వేడుకను ఆధ్యాత్మికతతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్లోక చైర్మన్, అధ్యక్షుడు పి.జైపాల్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనాదేవి, అకడమిక్ డైరెక్టర్ బాలాజీ, శ్లోక పాఠశాల మెంబర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.

పాఠశాల ఆవరణలో వెలిగిన అనేక దీపాలతో ఆ ప్రాంగణమంతా దివ్య కాంతితో మెరుస్తూ, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించింది. అనేకమంది తల్లిదండ్రులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యత, సానుకూలతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దీపికా ఠాకూర్ మాట్లాడుతూ. మా విద్యార్థుల తల్లిదండ్రులే కాక సమాజం నుండి వచ్చిన వారు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం మా హృదయాన్ని తాకిందన్నారు. మనం అందరం కలిసి ఈ సాయంత్రాన్ని ఒక దివ్యమైన, చిరస్మరణీయమైన అనుభూతిగా మార్చుకున్నాం అన్నారు. తల్లిదండ్రులు, అతిథులు, సిబ్బంది అందరికీ స్కూల్  తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమం ప్రార్థనలతో, చిరునవ్వులతో,ఐక్యత వెలుగులతో ముగియగా..పాఠశాల యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాస యాత్రలో మరో అందమైన మైలురాయిగా నిలిచింది.

పాఠశాల విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ చేసిన ముడుపు మౌనిష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, సాత్నాల: విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సాంగ్వి, గోండుగూడ, పాఠగూడ గ్రామాలలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, అంగన్వాడీ పిల్లల్లకు పలకలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే లక్ష్యం నిర్దేశించుకొని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభాత్ రావు, మోతిరాం, గ్రామస్తులు మాధవరావు, సంపత్ రావు, సోంజి, పొచ్చిరాం,  వెలదీ వసంతరావు, ఆత్రం భగవాన్ దాస్, చిత్రు, కిన్క శ్యామ్ రావు, ఇస్తారి,అర్జున్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపిని కోరిన ఎమ్మెల్యే రామారావు పటేల్

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యవసాయశాఖ కమిషనర్ గోపిని కోరారు. గురువారం హైదరాబాద్ లో ఆయన్ను కలిసి సన్మానించారు. రైతులు పంటలపై సాంకేతిక సలహాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. ఈ రబీ సీజన్‌లో యూరియా, డీఎపీ వంటి ఎరువులు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. కౌలు రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి సిబ్బంది లోటు తక్షణమే పూరించాలన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

భైంసా–బాసర రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఐ హాస్పిటల్ సమీపలోని భైంసా–బాసర రహదారిపై గురువారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏఎస్ఐ రవూఫ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను నిలిపి వివరాలు సేకరించారు. రహదారిపై క్రమశిక్షణ పాటించేలా డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత, చట్టం–శాంతి పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వాహనదారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని,  పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రజలు చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.