Home Blog Page 14

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి:మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి మనోహర్

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్మ ఈడీ మనోహర్ అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయంలో  సర్పంచులు,  ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మండల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ఉత్తమ అధికారిగా రిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సిరాజొద్దీన్

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన వేడుకలలో ఆయా ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ఉత్తమ అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిరాజొద్దీన్ సోమవారం 77 వ ఘనతంత్ర దినోత్సవ సందర్బంగా ప్రశంసా పత్రాన్ని అందుకోగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ తోపాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందించినందుకు  ఎవరు సందర్బంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

0

చిత్రం న్యూస్, బేల: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బేల పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సామూహిక సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండల కేంద్రంలోని 13 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నృత్య ప్రదర్శన, స్కిట్లతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, వార్డు సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ భగవాండ్లు, వివిధ పార్టీల నేతలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి

0

చిత్రం న్యూస్ సాత్నాల: పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి ఉంటుందని ప్రముఖ వైద్యుడు ఎండీ జనరల్ మెడిసిన్, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కళ్లెం వెంకట్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం కాన్ఫ మేడిగూడ (ఆర్) పాఠశాలలో నిర్వహించిన 77వ  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన జన్మదినం సందర్బంగా మేడిగూడ పాఠశాలను దత్తత తీసుకొని వంద మంది విద్యార్థులకు ఉచితంగా షూలు పంపిణీ చేశామన్నారు. భవిష్యత్తులో  ఏది అవసరమైన తాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. డా.కళ్లెం వెంకట్ రెడ్డిని సర్పంచ్ పర్చకీ లక్ష్మీబాయి, వీడీసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, స్కూల్  హెచ్ ఎం ప్రకాష్ యాదవ్ సన్మానం చేశారు.

సాత్నాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాదవ్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో  ఎంఆర్ఐ  సాయిరాం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మండల కేంద్రంలో కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్ రావు, సతీష్, సుమన్, మూర్తి మాంగుర్ల గ్రామ సర్పంచ్ ఆడ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

మరోపక్క బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన గావించారు. బీజేపీ నాయకులు పోతురాజు రమేష్, అస్తక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రం అవార్డు 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీ సేవ కేంద్రం అవార్డును సోమవారం అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన ఆధార్, ధ్రువపత్రాల సేవలు అందుంచినందుకుగాను జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రంగా అవార్డును అందజేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా మీసేవ నిర్వాహకుడు గడుగు సురేందర్ కు  ప్రశంసా పత్రం అంజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఈడీఎం బండి రవి తదితరులు ఉన్నారు.

లోక ప్రవీణ్ రెడ్డి కి మెమొంటో అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు ఇటీవల నిర్వహించిన షటిల్, బాడ్మింటన్, క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డికి సోమవారం జిల్లా  ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్, ఇతర న్యాయవాదులు తదితరులు  ఉన్నారు.

చలో దిల్లీ విజయవంతం చేయండి-అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ 

0

 

చిత్రం న్యూస్, సాత్నాల: ఫిబ్రవరి 28న దిల్లీలో జరగనున్న లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని డా.బీ. ఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు, లంబాడాలు తరలివచ్చి విజయవంతం. చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:16 వ జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ వ్యసాయ పరిశోదన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.శ్రీధర్ చౌహన్ ఆధ్వర్యంలో ఆదివారం తమ సిబ్బందితో జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమన్నారు. ఓటు అందరి హక్కు. దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ఓటుతో అవినీతిని పారదోలే అవకాశం ఉంటుందని, ప్రశ్నించే అధికారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డా.కె.రాజశేఖర్, డా. మోహన్ దాస్, సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాస్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, టైమ్స్ స్కేల్ ఉగ్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

 

ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం – ఆడే గజేందర్

0

మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ సమక్షంలో భారీగా చేరికలు

చిత్రం న్యూస్, బోథ్: ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో 13వ వార్డు‌కు చెందిన సొలంకి సంతోష్, గిరిజబాయి, 14వ వార్డు‌కు చెందిన రాయల తిరుపతి, 16వ వార్డు‌కు చెందిన పద్మారావు, మాజీ వార్డు సభ్యులు సొలంకి తుకారాం, సిందేకర్ తాళ్ల శంకర్, మెర్గు శిందేకర్ నారాయణ, వెంకటరమణ, కొట్టూరి భాస్కర్, షేక్ నాజు తదితరులతో పాటు న్యూ కాలనీకి చెందిన దాదాపు 65 మంది వివిధ వర్గాల ప్రజలు, మాజీ వార్డు సభ్యులు, భారీ సంఖ్యలో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, మాజీ సర్పంచ్ నర్సింహ దాస్, ఆత్మ డైరెక్టర్ రహీం, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ మాల్యాల అంజయ్య, అందూర్ సర్పంచ్ పృథ్వి, మార్కెట్ డైరెక్టర్ అబుద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్, కాంగ్రెస్ నాయకులు ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి, ఉమేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.