ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
*సాంగిడి గ్రామంలో సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి చికిత్స
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో శ్రీ మోతీజే మహారాజ్ ఆలయంలో L V ప్రసాద్ వారి సౌజన్యంతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా కంటి చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు తమ L V ప్రసాద్ ఆసుపత్రికి రావాలని సూచించారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఎందరో మంది కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారనే ఉద్దేశ్యంతో L V ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కంటి శస్త్ర చికిత్స చేయాలంటే నేడు వేల రూపాయలు ఖర్చు చేసేంత స్తోమత లేని పేదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ శిబిరానికి సహకరించిన L V ప్రసాద్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ప్రణయ్, వెంకట్ రమణ, సాయిలుకు, గ్రామస్తులతో పాటు ఆయన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో అవసరమైన వారికీ కళ్ళ అద్దాలు, ఉచిత మందులు, ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స కూడా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సామ నర్సారెడ్డి, దయాకర్ పటేల్, సుధాకర్, మేకల జితేందర్, మంచికంటి సాయి, దేవన్న, జగదీష్ రెడ్డి, రాంరెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.





అత్యవసర సమయంలో ప్రైవేట్ వైద్యులను సంప్రదించి పశువుల ప్రాణాలను కాపాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు దాదాపు అందరూ జంతు ప్రేమికులే కానీ ఏ రోజు పశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. నెల క్రితం ఇద్దరు రాజకీయ నాయకులు పశువుల ఆసుపత్రి పై శ్రద్ధ వహించి ఉన్నత అధికారులతో మాట్లాడితే రెండు, మూడు రోజులు డాక్టర్ ను పశువైద్యశాలకు పంపించారు. మళ్లీ ఇప్పుడు పాత పరిస్థితే కొనసాగుతుంది. పశు వైద్య శాలలో ఉన్న ఒక్కరే అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి డాక్టర్ తో పాటు సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని సొనాల గ్రామ రైతులు కోరుతున్నారు.



శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జోత్సవ శోభాయాత్ర వెళ్లే మార్గంలో నాలుగు డ్రోన్లు, 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 600 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అల్పాహారం పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనోత్సవం పురస్కరించుకొని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. యువకులు, చిన్నారులు శోభాయాత్రలో చేస్తున్న నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణపతి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం పూర్తవడంతో అనేక ప్రాంతాలలో భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. జై గణేష్ మహారాజ్ అంటూ నినాదాలతో, డీజే పాటలతో, వాహనాలలో విగ్రహాలను ఊరేగిస్తూ, భక్తిశ్రద్ధలతో గణపయ్య ..మళ్ళీ రావయ్యా అని కోరుకుంటూ నిమజ్జనం చేశారు.
