Home Blog Page 128

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

0

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆసాల సదాశివ్ అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ (బీ)లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కొండ ఎర్రన్న,  శ్రీరామ్, శంకర్, రాజేశ్వర్, గణేష్ , రవీందర్, సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు  నారాయణరెడ్డి, గంగయ్య, భోజన్న, లక్ష్మణ్, కుల బాంధవులు పాల్గొన్నారు.

బోథ్ లో ముస్తాబవుతున్న దుర్గ మండపం

0

బోథ్ లో ముస్తాబవుతున్న దుర్గ మండపం

*శ్రీమాత ఈవెంట్స్ ఆధ్వర్యం లో అద్భుత సెట్టింగ్

*ప్రతి యేటా వినూత్న అలంకరణతో ఆకట్టుకుంటున్న మండపం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోని దుర్గ మండపం నవరాత్రులకు అందంగా ముస్తాబు అయింది. ప్రతి సారి వినూత్నంగా (కొత్తగా) సెట్టింగ్ తో ముందుకు వచ్చే దుర్గ మండపం ఈ సారి శ్రీ మాత ఈవెంట్స్ ఆధ్వర్యంలో కలకత్తా మాత సెట్టింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. అయితే సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయని, సోమవారం ఉదయం 11 గంటలకు దేవి శోభాయాత్ర మొదలు అవుతుందని దుర్గ కమిటీ అధ్యక్షుడు పాలిక్ రమేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సెట్టింగ్ అందిస్తున్న శ్రీ మాత ఈవెంట్స్ కి దుర్గ కమిటీకి తరుపున ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా. గెడం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వింగ్ ఇంఛార్జి పుష్ప మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సైన్స్ తో ముడిపడి ఉంది అని, బతుకమ్మ పండుగ లో ఉపయోగించే తంగేడు పూలు, గునుగు పూలు నీళ్ళ లో నిమజ్జనం చేయడం వలన నీళ్ళలో ఉండే సూక్ష్మజీవులు నశించి నీళ్లు శుభ్రం అవుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఐసీసి మెంబర్  ప్రియాంక,   సీనియర్ అధ్యాపకులు ఆమోల్, బిందు, సౌందర్య, విజయ, సంజీవ్, అనికేత్, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

0

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ముఖ్య అతిథిగా ముథోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీపీ చైర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్‌ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.47లక్షలు ఖరీదుచేసే ఉపకరణాలను దివ్యాంగులకు  అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదు..ఇది సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగన్నారు. ఈ పరికరాలు చైతన్యం,  ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ రోజు లబ్ధిదారుల ముఖాల పై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి

0

ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి

చిత్రం న్యూస్, బేల: యూరియా కోసం తెల్లవారుజాము నుండి లైన్లో తరబడి నిలబడ్డ రైతుపై ఏఎస్ఐ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రాందాస్ అన్నారు. శనివారం బేల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆదివాసీ రైతుపై దాడి చేసిన ఏఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదు అన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు అవినాష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

కిర్గుల్ (కె) పాఠశాలలో ముందస్తు  బతుకమ్మ వేడుకలు

0

కిర్గుల్ (కె) పాఠశాలలో ముందస్తు  బతుకమ్మ వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్ (కె) ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన విద్యార్థులు పూజలు చేసి చుట్టూ చేరి వర్షాన్ని సైతం లెక్క చేయక బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవళిక  మాట్లాడుతూ.. గౌరమ్మకు ప్రతిరూపమైన బతుకమ్మ పువ్వులలోని పరిమళాన్ని,  వివిధ రంగులను మన జీవితంలో కూడా తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవళిక, ఉపాధ్యాయురాలు భవాని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

0

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

* పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిడిగొండ మండలం బుగ్గరం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో  ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ప్రిన్సిపల్ సన్మానించారు. అనంతరం విద్యార్థినిలు చేసిన నృత్యాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకుందామని విద్యార్థులకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అనిల్ అన్న 24 గంటలు అందుబాటులో ఉంటాడని ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రాథోడ్ సురేందర్, నేరడిగొండ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి

0

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి

చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ లో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారితో కలిసి సందర్శించారు. పాఠశాల  చుట్టూ ఉన్న అపరిశుభ్రతను వెంటనే బాగుచేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాలలో వంట గది, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు,  విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రత్యేక అధికారి గెడం నవీనను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు.  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలు

0

అజయ్ మహాకాళ్ కు కేకు తినిపిస్తున్న  LPR సైన్యం అధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  అజయ్ మహాకాళ్ సేన అధ్యక్షుడు అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి, LPR సైన్యం నడుమ ఆయన కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా మహాకాళ్ సేన, LPR సైన్యం, అభిమానులు  ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో   శ్రీరాం, శ్రీకాంత్ రెడ్డి, సృజన్, గోరక్ నాథ్, సురేందర్, కొంపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం

0

ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం

చిత్రం న్యూస్,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల శివారులో  నిర్మల్ వెళ్ళే బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి బోలేరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు నుండి బోథ్ ఎక్స్ రోడ్ పోచ్చెర క్రాస్ రోడ్ నుండి కిన్వట్ వెళ్ళే టీజీ01జడ్ 0011 బస్ ను వెనుక నుండి బోలేరో వాహనం ఢీ కొట్టింది. దీంతో  బోలేరో వాహనంలో  ఉన్న 10 పశువుల్లో ఒక పశువు మృతి చెందింది. మూడు పశువులకు  తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పశువులకు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పోలీసులు నంబర్ ప్లేట్ ప్రకారం మహారాష్ట్ర కు చెందిన వాహనంగా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ కు  గాయాలు కాగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం వేరే బస్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద ఘటన స్థలం నుండి బోలేరో పికప్ వాహన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.