Home Blog Page 129

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది

0

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది

*ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రస్తుత సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం విశ్వకర్మ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.. జిల్లా కేంద్రంలో ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. గోపాలకృష్ణ పీఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతిరోజు విశ్వకర్మను పూజిస్తే మోక్షం లభిస్తుంది అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, భాజపా నాయకురాలు సుహాసిని రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, వివిధ మండలాల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

భారీ శోభయాత్ర 

విశ్వకర్మ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక గోపాలకృష్ణ మఠం నుoచి ప్రారంభమైన శోభాయాత్ర వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా చందా వాగు వరకు కొనసాగింది..దారి పొడుగునా డీజే సౌండ్ మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు.

జైనథ్ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో  స్వచ్ఛ భారత్

0

జైనథ్ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో  స్వచ్ఛ భారత్

చిత్రం న్యూస్, జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకులు గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్కం రాందాస్, నాయకులు గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి, దంతెల రవీందర్, రామన్న, ఉషన్న, సూర్య రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్

0

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్

చిత్రం న్యూస్ ,జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకుల గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కాట్కం రాందాస్, గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి,దంతెల రవీందర్, రామన్న, ఉషన్న, సూర్య రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

స్నేహితుల ఉదారత

0

స్నేహితుల ఉదారత

*మిత్రుడి కుటుంబానికి రూ.60 వేలు, నిత్యవసర సరకులు అందజేత

చిత్రం న్యూస్, ఇచ్చోడ : చిన్నప్పటినుంచి అందరూ కలిసి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.  కానీ మిత్రులంతా మంచి, చెడులను చర్చించుకునేందుకు ఒక వేదికను ఏర్పరచుకున్నారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్తి విధి వక్రీకరించడంతో   మృతిచెందారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి చేయూతనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగామ(కే) గ్రామానికి చెందిన బైరీ విలాస్ (40) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి జడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్  మిత్రబృందం ఇచ్చోడలో కలుసుకున్నారు. మిత్రులందరూ తలా కొంత డబ్బులు జమ చేశారు. ఒక క్వింటాన్నర  బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు, ఆర్థిక సహాయంగా రూ. 60 వేలు నగదును మృతుడు విలాస్ సతీమణికి అందజేశారు. మేమున్నామంటూ బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. విలాస్ పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుతూ చిత్ర పటానికి నివాళులర్పించారు. గతంలో అకాలంగా మృతి చెందిన భోజన్న, నాగరాజు కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచామని స్నేహితులు తెలిపారు.

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి

0

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ:
నేరడిగొండ మండలంలో గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న ఆధార్ సెంటర్ ను పునః ప్రారంభించాలని నేరడిగొండ మండల యువకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండీ కలీంకు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో ఉన్న తప్పులు సరిచేసుకోవాలన్న, కార్డు అప్డేట్ చేసుకోవాలన్న, కొత్తగా పెళ్లైన వారి ఆధార్ కార్డు బదిలీ చేసుకోవాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి. గత కొన్ని నెలలుగా ఆధార్ సెంటర్ మూతపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు నమోదు చేసుకోవాలన్నా ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, ఇచ్చోడ ఆధార్ సెంటర్ ఇటీవల తిరిగి ప్రారంభమైనా నేరడిగొండ ఆధార్ సెంటర్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో  తహసీల్దార్ ను కలిసి విన్నవించామన్నారు. మండల జనాభా ప్రాతిపదికన ప్రజల సౌలభ్యం కోసం మరో ఆధార్ సెంటర్, మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సాబ్లే సంతోష్, సింగ్, రాథోడ్ రాజశేఖర్, ఏలేటి మనోజ్ రెడ్డి, బొంతుకుల శ్రీను, కుంచపు గోవింద్, బాక్రే ప్రశాంత్, సురేష్, తగిరే చందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

0

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ:  బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి  నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం రూ.5.21కోట్ల నిధులు, గుడిహత్నూర్ మండలం డోంగ్రగావ్ నుండి మన్నూర్ మీదుగా కొల్హారి, శాంతపూర్  వరకు బీటీ కోసం రూ.4.40 కోట్ల నిధులు మంజూరు చేశానని,  ప్రజల చిరకాల వాంఛ రోడ్డు సమస్య అని,  ప్రజా సమస్యలే పరమావధిగా కొనసాగుతానని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

0

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ: బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి  నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం రూ.5.21కోట్ల నిధులు, గుడిహత్నూర్ మండలం డోంగ్రగావ్ నుండి మన్నూర్ మీదుగా కొల్హారి, శాంతపూర్  వరకు బీటీ కోసం రూ.4.40 కోట్ల నిధులు మంజూరు చేశానని,  ప్రజల చిరకాల వాంఛ రోడ్డు సమస్య అని,  ప్రజా సమస్యలే పరమావధిగా కొనసాగుతానని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

రక్తదానం చేసిన  విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు

0

రక్తదానం చేసిన  విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు

చిత్రం న్యూస్,కాకినాడ: శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రూరల్ మాజీ అధ్యక్షులు, విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు బుధవారం కాకినాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా సేవ పక్వాడ అభియాన్ కార్యక్రమం రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన రక్త దానం చేశారు. విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మోదీ పుట్టిన రోజు సందర్భంగా  రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మీ లో ఉంటూ దేశ ప్రజల కోసం  చేసిన సేవను, పడిన శ్రమను, తను పాల్గొన్న కార్గిల్ వార్ లో ఎందరో ప్రాణాలు కోల్పోయిన విషయాలను  గుర్తుచేసుకున్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా జరిగే సేవా పక్షోత్సవలో భాగంగా అక్టోబర్ 2 వరకు మెడికల్ క్యాంప్ లు, సెమినార్లు, పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన  తెలిపారు.

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

0

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

చిత్రం న్యూస్ భైంసా : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంజ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రధానోపాధ్యాయుడు సాగర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి రాచరిక పాలననుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, ప్రవీణ్, పోతన్న, గంగాధర్, అజయ్, రాజు శ్రీనివాస్, గ్రామ యువకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

0

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం విశ్వకర్మ మరాఠి వడ్రంగి సంఘo ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పట్టణంలో భారీ శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. బీసీ సంఘo జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, నేతలు విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, నాయకులు, కులస్తులు పాల్గొన్నారు