Home Blog Page 127

రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది

0

రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది

*కడెంలో యూరియా కోసం రైతుల ఆందోళన

*సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేశారు. రైతుల చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ  ఇంఛార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. రైతులతో కలిసి పీఏసీఎస్ కేంద్రానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోకుండా వ్యవహరించటం సరైంది కాదని ఆగ్రహం చేశారు.రేపటిలోగా రైతులకు యూరియా పంపిణీ చేపట్టకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతమని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింద న్నారు. ఎన్నికల్లో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం విచారకరం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై అక్కసు ఉందని, నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు ,మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

0

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

*తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్

చిత్రం న్యూస్, ముథోల్: యువతలో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ద్యేయమని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ముథోల్ లోని నాగార్జున నగర్ బుద్ధ విహార్ ఆవరణలో సమతా సైనిక్ దళ్ నిర్మల్ జిల్లా మొదటి వార్షికోత్సవ వేడుకలు, భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర  ఇంఛార్జి  కస్తూరె సంజయ్ బోధి వర్ధంతిని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఉన్నతమైన లక్ష్యాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో యువత పయనించే విధంగా చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. బహుజనులపై జరిగే అన్యాయాలపై స్పందించి వారి హక్కుల సాధనలో భాగస్వాములు అవుతామన్నారు. యువతలో ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సమతా సైనిక్ దళ్ లో చేరడానికి యువత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాగ్మారే నారాయణ, సంస్కార్ విభాగము తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్బారావు వాగ్మారె, రాష్ట్ర కమిటీ సభ్యులు సవితా బాయ్ టోక్రే, సంజయ్ క్షిర్సాగర్, జిల్లా కోశాధికారి రామచందర్ జంగ్మే, జిల్లా పర్యటక విభాగం ప్రధాన కార్యదర్శి పండిత్ వాగ్మారే, జిల్లా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షులు అశోక్ బన్సోడె, జిల్లా కార్యవర్గ సభ్యులు శృంగారె గంగాధర్, రాందాస్ వాగ్మారె,  ముథోల్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ వాగారే, లోకేశ్వరం మండల అధ్యక్షులు దిలీప్ కదమ్, తానూర్ మండల కార్యధ్యక్షులు నాగోరావ్ లోకండే, సమతా సైనిక్ దళ్ సైనికులు, బౌద్ధ ఉపాసకులు, ఉపాసికులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

0

కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ పాటలతో, మహిళలు డీజే  చప్పుళ్ల నడుమ  హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ సోమవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రకృతిలో సూర్య చంద్రులను కొలిచిన విధంగా వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్కరంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడారు. ఊరు వాడ కలిసి సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం, మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ పెద్దల నాటి సాంప్రదాయంతో వచ్చిన పండగని ఘనంగా జరుపుకుంటున్నారు. కీర్గుల్ (కె) గ్రామంలో మొట్ట మొదటిసారిగా దుర్గామాతను  గ్రామస్తులు కలిసికట్టుగా  ప్రతిష్టించారు. దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ నేత పరామర్శ

0

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్ 

చిత్రం న్యూస్, కడెం:  నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన  బీఆర్ఎస్ సీనియర్ నేత చిట్టెటి ముత్తన్న సోదరి గంగవ్వ  ఇటీవల మరణించారు.  బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్  సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కత్తెరపాక రాజశేఖర్ ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి కాలు ఫ్యాక్చర్ కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని ఆయన్ను కూడా పరామర్శించారు.  ఆర్థిక సాయం అందజేశారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు 

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె)  గ్రామంలో సోమవారం బతుకమ్మ సంబరాలను మహిళలు  ఘనంగా జరుపుకున్నారు. తీరొక రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి తయారు చేసి, బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ డీజే పాటలతో హోరెత్తిస్తూ మహిళల నృత్యాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కోలాటాలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు.

ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0

ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్నం (కే) గ్రామంలో డాక్టర్ స్వప్న ఆర్ బీ ఎస్ కే  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. డాక్టర్ స్వప్న రోగులతో మాట్లాడుతూ..అందరూ శుభ్రంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. జ్వరాలు వస్తే వస్తే డాక్టర్లను సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మకూడదని ఎప్పుడు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ఓం ప్రకాష్. ఏఎన్ఎంలు సుజాత, గంగామణి, మందుల శ్యామల, అంగన్వాడీ సిబ్బంది ఉమా, ఆశ, ఆనందబాయి తదితరులు ఉన్నారు.

బాసరలో ఘనంగా ప్రారంభమైన  దేవీ  శరన్నవరాత్రి ఉత్సవాలు

0

బాసరలో ఘనంగా ప్రారంభమైన  దేవీ  శరన్నవరాత్రి ఉత్సవాలు

*తొలి రోజు శైలపుత్రి అవతారంలో  అమ్మవారు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు ఉత్సవాలు సోమవారం అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారు మొదటిరోజు శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించడంతో ఆమెకు శైలపుత్రి అని, వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో  కమలంతో, తలపై చంద్రవంకను ధరించి  విరాజిల్లుతుంది. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ వేద పండితులు, అర్చకులు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలతో  శైల పుత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు.

భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్

0

🏟️ మ్యాచ్ వేదిక

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై రెండు జట్లకు మద్దతు ఇచ్చారు.


🏏 టాస్ & జట్టు ప్రణాళిక

  • భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ – “పిచ్ పరిస్థితులు మా బౌలర్లకు సహాయపడతాయి, అలాగే వాతావరణం కారణంగా బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉంటుంది” అన్నారు.

  • పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్‌లో మంచి ఆరంభం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


🔥 జట్టు మార్పులు

  • భారత్ తమ పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకుంది.

  • పాకిస్తాన్ మాత్రం తమ గత మ్యాచ్ కాంబినేషన్‌లోనే కొనసాగింది.


🤝 ఆట వెలుపల ఉద్రిక్తతలు

  • టాస్ తర్వాత భారత ఆటగాళ్లు మళ్లీ పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడం చర్చనీయాంశమైంది.

  • రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తత ఈ టోర్నమెంట్‌లో కూడా ప్రభావం చూపుతున్నాయి.


📊 మ్యాచ్ ముఖ్య దృశ్యాలు (Highlights)

  1. భారత్ బౌలింగ్ – బుమ్రా మరియు సిరాజ్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను ఒత్తిడికి గురి చేశారు.

  2. పాకిస్తాన్ బ్యాటింగ్ – బాబర్ ఆజమ్ మరియు రిజ్వాన్ కొంత వరకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.

  3. స్పిన్ దాడి – కుల్దీప్ యాదవ్, జడేజా మధ్య ఓవర్లలో కీలక బ్రేక్‌త్రూ ఇచ్చారు.

  4. ఫీల్డింగ్ – భారత్ పక్కా ఫీల్డింగ్ చేసి కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టింది.


✅ విశ్లేషణ & ప్రభావం

  • భారత్ బౌలింగ్ శక్తి మళ్లీ రుజువైంది.

  • పాకిస్తాన్ బ్యాటింగ్ టాప్-ఆర్డర్ కొంత అస్థిరంగా కనిపించింది.

  • రెండు జట్ల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తత ఆటలో కూడా కనిపించింది, దీంతో మ్యాచ్ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ

0

AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల  కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ –2025 నిర్వహించారు. ఈ పరీక్షలో వివిధ పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్ష విద్యార్థులలో  షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తి, దేశభక్తి, విద్యపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో నిర్వహించారు. విద్యార్థులు పోటీ ఉత్సాహంతో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పరీక్షా కేంద్రంలో క్రమశిక్షణతో పాటు న్యాయంగా పరీక్షలు జరిగేలా ఉపాధ్యాయులు, స్వచ్ఛందకారులు పర్యవేక్షించారు. ఆయోజకులు విద్యార్థుల స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి, బాధ్యత, విద్యపై నిబద్ధత పెంపొందించేందుకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫలితాలు సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి రోజున  ప్రకటించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శి మున్సిఫ్ ప్రేమ్ సంతోష్ ముక్రముద్దీన్, సీపీఐ నాయకులు నరేష్, కార్తీక్ సాయి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

0

ఉత్తమ ఉపాధ్యాయున్ని సన్మానిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్,నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు జాదవ్అంబారావును (ఏహెచ్ఎస్ కుంటాల) నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాకప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మండల అధ్యక్షులు అల్లూరి శివారెడ్డి, సురేందర్ జాదవ్, రాథోడ్ నారాయణ, .గెర్జామ్ మాజీ ఎంపీటీసీ శుద్ధవర్ వెంకటేష్, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఉన్నారు.