Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 12

ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం

0

ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం

నేరడిగొండ, చిత్రం న్యూస్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలోని శ్రీ శబరిమాత 3 వ ఆలయ వార్షికోత్సవం  అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు శివానంద భారతి, దేవన్న స్వామి, బాలయ్య స్వామి శబరీ మాత ఆలయంలో గల విగ్రహాలకు పూజలు నిర్వహించారు.  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి గ్రామ గ్రామాన శబరిమాత భక్తులు కుమారి గ్రామ భక్తులతో కలిసి వీధుల గుండా శబరిమాత పల్లకీ ఊరేగింపులో పాల్గొన్నారు. మహిళలు, పెద్దలు, చిన్నలు నృత్యాలు చేస్తూ శబరమ్మ పాటలు పాడుతూ భక్తి పారవశ్యంతో ముందుకు సాగారు. అనంతరం శివానంద భారతి స్వామి మాట్లాడుతూ. శబరమ్మ చెప్పిన బాటలో నడుస్తే  జీవితం మారుతుందన్నారు ఆశ్రమ చైర్మన్ డోకూర్ భోజన్న, డి.భోజ గౌడ్, బిక్క లస్మన్న, బొడ్డు సుభాష్ గౌడ్, చాట్ల భూమేష్, చెమ్మనా పురుషోత్తం, పొచ్చర నారాయణ రెడ్డి, గొర్ల మనోహర్, బిక్క అడేల్లు తదితరులు పాల్గొన్నారు.

బోథ్ న్యూ కాలనీలో ఓటరు  వినూత్న ప్రయత్నం

0

బోథ్ న్యూ కాలనీలో ఓటరు  వినూత్న ప్రయత్నం

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలో  గతంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ 15వ వార్డు సమస్యలను పట్టించుకోలేదని బిలాల్ దుకాణ యజమాని అజీమ్ ఆరోపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అభ్యర్థులకు తన కాలనీ సమస్యలను స్పష్టంగా ఒక ప్లకార్డు మీద వ్రాసి చూపిస్తూ, “గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తాం” అని హామీ తీసుకుంటున్నారు. ఆ హామీపై అభ్యర్థుల సంతకాలు తీసుకుంటూ ప్రత్యేక హామీ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత హామీ నెరవేర్చకపోతే.. వారి సంతకంతో కూడిన ఆ హామీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో పోరాటం చేస్తానని అజీమ్ స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఓటర్లు ఈ విధంగా బాధ్యతాయుతంగా ముందుకు రావడం కాలనీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సేవలు 

0

కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సేవలు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో  ఇక కార్డియాలజిస్ట్ సేవలు  ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు  డా.అనూప్ అగర్వాల్ డిసెంబర్ 16న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు.  గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, గుండె దడ, ఆయాసం, అన్ని రకాల గుండె జబ్బులు ఉన్నవారు అపాయింట్మెంట్ కోసం 9063 646464  నెంబరును సంప్రదించాలన్నారు.

రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్

0

రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, జైనథ్: అదిలాబాద్ జైనథ్ మండలం లక్ష్మీపూర్ లో శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. రెండో విడత ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రజలను సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్ట్ పెట్టిన, గ్రామాల్లో రెచ్చే గొట్టేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బేల మండలంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడిపై 67 ఐటి యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రావణ్ కుమార్, బేల, జైనథ్ ఎస్ఐలు ప్రవీణ్, గౌతం పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి..సర్పంచి అభ్యర్థి గెడo రాము

0

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి..సర్పంచి అభ్యర్థి గెడo రాము

చిత్రం న్యూస్, బేల:  సర్పంచిగా ఐదేళ్లు గ్రామాన్ని అభివృద్ధి పథoలోకి తీసుకెళ్లాలని మరోసారి దీవించాలని టాక్లి గ్రామ స్వతంత్ర సర్పంచి అభ్యర్థి గెడo రాము కోరారు.. శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థించారు. తనను మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు  మహిళలు బుద్ది చెప్పండి

0

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు  మహిళలు బుద్ది చెప్పండి

చిత్రం న్యూస్: బేల: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు  మహిళలు బుద్ది చెప్పండని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారానికి వస్తే మీకు ఓటు ఎందుకు వెయ్యాలని మహిళలు గట్టిగ నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చినట్టు వంటి హామీలు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలు ఇచ్చి మహిళలకు మోసం చేసిందన్నారు. కళ్యాణలక్ష్మి పథకంలో బంగారం, సబ్సిడీ గ్యాస్, మహిళలకు రూ.2,500, చదువుకునే యువతులకు స్కూటర్ ఇలా అనేక దొంగ హామీలు ఇచ్చినందుకు ఓటు వేయాలా అని ప్రభుత్వానికి మహిళలు సూటిగా అడగాలని పేర్కొన్నారు. అదేవిదంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల పత్తి, సోయా పంటలను కొనుగోలు చేయలేక రైతులకు మోసం చేసిందని మండిపడ్డారు. రైతులు పంటలను మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నారని దీనికి స్థానిక ఎంపీ ఏంచేస్తున్నారని… దీనికి సమాధానం ఎంపీ చెప్పాలని కోరారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏమిలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో వారికీ గట్టిగా బుద్ది చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్లెం ప్రమోద్ రెడ్డి, అడనేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, నాయకులు మధుకర్, ఠాక్రే గంభీర్, మాజీ ఎంపీటీసీ గోడే మధుకర్, కన్నల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లో  ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం

0

జైనథ్ లో  ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జైనథ్ మండల తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో సుధీర్ కుమార్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో మండల ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ సేవలు లభ్యం కావడంతో ప్రజలు సులభంగా ఆధార్ నమోదు, అప్‌డేట్ వంటి సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుగు సురేందర్, సయ్యద్ సర్ఫరాజ్, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కేంద్రం యొక్క సంప్రదింపు నంబర్: 9441614474.

నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్

0

*కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగమల్యాల్  గ్రామస్తులు

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నాగమల్యాల్ గ్రామస్తులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. అభివృద్ధి చూసి కాంగ్రెస్ లో చేరుతున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని అధికార పార్టీతో కలిసి మా ఊరును అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్  మాట్లాడుతూ.. గత 10 సం.. నుండి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందని, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నాగమల్యాల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచిలు భీముడు, నారాయణ, గ్రామపటేళ్లు గంగారాం,తోట గంగాధర్ గంగారాం, యువ నాయకులు మహేందర్. మండల అధ్యక్షులు ఆడే వసంతరావు రావు కుంటాల మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, బానోత్ వసంత్, జాదవ్ కపిల్ దేవ్,ఆడే రమేష్, వసంతరావు,ఎండి సద్దాం, మౌలానా,గజ్జల అశోక్,గట్టుఅశోక్, సంతోష్, దేవేందర్,లక్ష్మణ్,నాయకులు గ్రామస్తులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరడిగొండలో బీఆర్ఎస్ కు భారీ షాక్ 

0

*కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగమల్యాల్  గ్రామస్తులు

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నాగమల్యాల్ గ్రామస్తులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. అభివృద్ధి చూసి కాంగ్రెస్ లో చేరుతున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని అధికార పార్టీతో కలిసి మా ఊరును అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్  మాట్లాడుతూ.. గత 10 సం.. నుండి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందని, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నాగమల్యాల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచిలు భీముడు, నారాయణ, గ్రామపటేళ్లు గంగారాం,తోట గంగాధర్ గంగారాం, యువ నాయకులు మహేందర్. మండల అధ్యక్షులు ఆడే వసంతరావు రావు కుంటాల మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, బానోత్ వసంత్, జాదవ్ కపిల్ దేవ్,ఆడే రమేష్, వసంతరావు,ఎండి సద్దాం, మౌలానా,గజ్జల అశోక్,గట్టుఅశోక్, సంతోష్, దేవేందర్,లక్ష్మణ్,నాయకులు గ్రామస్తులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 గ్రామాల అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

*ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరిన రాంపూర్ మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉప సర్పంచ్ నందు తదితరులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అన్ని గ్రామాల సమానాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. శనివారం భోరజ్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉపసర్పంచ్ నందు తో పాటు సింగిల్ విండో డైరెక్టర్లు, పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నికైన బీజేపీ పంచాయితీలకు రూ. 25 లక్షలు అందజేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి మంచి చేయాలనే సదుద్దేశంతో బీజేపీలో చేరిన వారందరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తోట రమేష్, గాజుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.