Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

పది పరీక్షలు భయం లేకుండా ఇష్టంతో రాయాలి: ఎస్సై నవనీత్ రెడ్డి 

చిత్రం న్యూస్, బాసర: పదో తరగతి పరీక్షలను భయం లేకుండా ఇష్టంతో, ఆత్మవిశ్వాసంతో రాయడంతోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని బాసర ఎస్సై నవనీత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరలోని నాగభూషణం విద్యాలయంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటూ సరైన ప్రణాళికతో సన్నద్ధమవ్వాలని, ముఖ్యమైన అంశాలను, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల మంచి గ్రేడ్లు సాధించవచ్చన్నారు. మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎస్సైను శాలువాతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments